India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు మహిళా దినోత్సవం. ప్రపంచమంతా మగువుల విలువ లోకానికి చాటి చెబుతోంది. కానీ తమ కష్టాన్ని గుర్తించే రోజు ఒకటుందని తెలియని శ్రమజీవులు వీళ్లు. శనివారం వేకువజామునే విశాఖలోని సిరిపురం, రైల్వే న్యూకాలనీ, రాంనగర్ ప్రాంతాల్లో ఇలా రోజువారీ పనుల్లో తలమునకలై కనిపించారు. పని మీద ధ్యాస, కుటుంబానికి భరోసా అందించాలనే ఆశ తప్ప విశ్రమించని శ్రామికులు. ఈరోజున శుభాకాంక్షలకు అత్యంత అర్హత కలిగిన మహిళామణులు వీళ్లు.
అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే చచ్చిపోతున్నా.. అంటూ ఓ మహిళ వాయిస్ మెసేజ్ కలకలం సృష్టించింది. కొబ్బరి తోటకు చెందిన ధనలక్ష్మి వద్ద సుగుణ అప్పు తీసుకుంది. వీరిద్దరి మధ్య వివాదం జరగ్గా ధనలక్ష్మి, ఆమె కుమారుడు సుగుణతో గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన సుగుణ.. గురువారం ధనలక్ష్మి ఇంటికి వెళ్లి రూమ్లో తలుపు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సుగుణ బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు.
కైలాసగిరి రోప్ వే సమీపంలో అగ్నిప్రమాదానికి బాధ్యులైన రోప్ వే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని వీఎంఆర్డిఏ ఎంసీ విశ్వనాథన్ ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన సంఘటనా స్థలంలో రోప్వే వ్యర్థాలను వెంటనే తొలగించాలన్నారు. కైలాసగిరి దుకాణదారులందరూ అగ్ని ప్రమాదాల నియంత్రణ సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తరచుగా ఫైర్ ఆడిట్ జరిపించాలని ఆదేశించారు.
విశాఖకు చెందిన దిగుమర్తి సరస్వతి దేవి ప్రముఖ గాంధేయవాది. విశాఖ జిల్లా కోర్టులో ఏడు దశాబ్దాల పాటు క్రిమినల్ లాయర్గా పనిచేసి విశేషమైన పేరు గడించారు. జాతీయోద్యమ సమయంలో ఆమె గాంధీని రెండుసార్లు కలుసుకున్నారు. ఒక బహిరంగ సభలో ఆమె తన రెండు గాజులు తీసి గాంధీకి ఇచ్చారు. ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలని కోరినప్పుడు గాంధీ తాను వడికిన నూలు, కుదురు ఇచ్చారు. 2018లో 92 ఏళ్ల వయసులో మరణించారు.
విశాఖలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి శుక్రవారం కీటక జనిత వ్యాధుల నియంత్రణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వైద్య శాఖ అదనపు సంచాలకులు సుభ్రమన్యేశ్వరి పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రతీ శుక్రవారం డ్రైడే -ఫ్రై డే పాటించాలన్నారు. యాంటీ లార్వా పద్ధతులు ద్వారా దోమల నిర్మూలన చేయాలన్నారు. నీరు నిల్వ లేకుండా, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. DMHO జగదీశ్వరావు ఉన్నారు.
విశాఖ జంతు ప్రదర్శనశాలలో శనివారం మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా జీవవైవిధ్య నడక ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల నిర్వహించనున్నట్లు జూ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు అధికారులను సంప్రదించాలని కోరారు.
విశాఖ జిల్లాలో పాఠశాలలకు రేపు (రెండో శనివారం) సెలవు యథావిధిగా కొనసాగుతుందని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యా సంవత్సరంలో నిర్దిష్టంగా 220 రోజులు పాఠశాలలు తెరవాల్సి ఉండడంతో తొలుత సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని సెలవు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మధురవాడలో జన ఔషది దివస్ కేంద్రం వద్ద జనరిక్ మందుల వాడకంపై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొని జనరిక్ మందుల గూర్చి అన్ని విషయాలను ప్రజలకు అవగాహన కలుగజేసే గోడపత్రికను ఆవిష్కరించారు. జన ఔషది కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లాలో ప్రారంభించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు. DMHO జగదీశ్వరరావు ఉన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని సిరిపురంలోని చిల్డ్రన్స్ ఏరీనాలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ రంగాలలో ప్రతిభ చూపిన మహిళలను సత్కరిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు పోటీలు నిర్వహిస్తామన్నారు.
సైబర్ నేరాలను అరికట్టేందుకు విశాఖ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని సైబర్ నేరాలు నివారించేందుకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీ కొత్తగా టీం ఏర్పాటు చేశారు. కంప్యూటర్ నైపుణ్యం ఉన్న 12 మందిని ఎంపిక చేసి బి-కేటగిరిలో హోంగార్డు నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. వీరందరి సహకారంతో సైబర్ నేరాలపై అవగాహన, నియంత్రణ చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో డీసీపీ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.