India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
VMRDA 2047 మాస్టర్ ప్లాన్తో విశాఖ నగర విస్తృత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుతోంది. ఈ తరుణంలో రెవెన్యూ అంశాలపై మంచి పట్టున్న VMRDA కమిషనర్ విశ్వనాథన్ బదిలీపై చర్చ నడుస్తోంది. అధికార వర్గాల నుంచి వస్తున్న వినతులు, అభ్యంతరాలను కమిషనర్ సీరియస్గా తీసుకోకపోవడం, ముక్కుసూటితనంగా ఉండటంతో ఆయనను బదిలీ చేయించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా అమరావతిలో I&PR డైరెక్టర్గా ఆయన బదిలీ అయ్యారు.
పూండి రైల్వే స్టేషన్లో ఇంటర్ లాకింగ్ సిస్టం పనుల కారణంగా విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం పవన్ శుక్రవారం తెలిపారు. విశాఖ – బరంపూర్ ఎక్స్ప్రెస్ (18526), విశాఖ – భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ (22820), విశాఖ – బరంపూర్ ప్యాసింజర్ (58532ను) అక్టోబర్ 13న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో ఇవే రైళ్లు అక్టోబర్ 14న రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. విశాఖ జిల్లాలో 40 రైతు సేవా కేంద్రాల ద్వారా 10,000 మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. కామన్ రకం క్వింటాకు రూ.2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ.2,389 మద్దతు ధరగా నిర్ణయించారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే టోల్ఫ్రీ నంబర్ 1967కి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
➤ కంచరపాలెం దొంగతనం కేసును చేధించిన పోలీసులు
➤ విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు
➤ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు 20 దరఖాస్తులు
➤ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ వైసీపీ నేతలు
➤ VMRDA గార్డెన్ కార్మికులను విధులలోకి తీసుకోవాలి: CITU
➤ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కావడం లేదు: MLA వంశీ కృష్ణ
➤ సింహాచలంలో అమ్మవారి బేడా తిరువీధి మహోత్సవం
➤ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంనకు 15 వినతులు
ఆపరేషన్ సింధూర్.. భారతీయుల అందరి హృదయాల్లో నిరంతరం ప్రతిధ్వనించే మాట ఇది. అయితే ఈ సింధూరం పేరు కలిగిన మొక్క విశాఖలోని జీవవైవిధ్య ఉద్యానవనంలో కనువిందు చేస్తోంది. తెల్లని పుష్పాలు, కాయలతో ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ ఉద్యానవనంలో చాలా కాలంగా ఈ మొక్కను సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం పుష్పాలు, కాయలతో ఎంతో సుందరంగా ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.
IDCS విశాఖ అర్బన్ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో 2 కార్యకర్తల పోస్టులు, 21 ఆయాల పోస్టుల నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు నేటితో గడువు ముగిసింది. 2 కార్యకర్తల పోస్టులకు 20 దరఖాస్తులు వచ్చినట్లు అర్బన్ సీడీపీవో నీలిమ శుక్రవారం తెలిపారు. 21 ఆయా పోస్టులకు 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు సమాచారం అందిస్తామన్నారు.
విశాఖ వేదికగా VCA – ADCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 12న (ఆదివారం) ఇండియా V/S ఆస్ట్రేలియా ఉమెన్స్ తలపడనున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ జరిగిన మ్యాచులో సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ చేతిలో ఇండియా ఉమెన్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆదివారం సెలవు రోజు కావటంతో అధిక సంఖ్యలో క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
కంచరపాలెం ఇందిరానగర్-5 <<17927881>>దొంగతనం కేసు<<>>లో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయినట్లు సమాచారం. బాధిత కుటుంబంలో ఓ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనే పథకం ప్రకారం ఈ దోపిడీకి ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ నెల 5 అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లయ్యమ్మ(73)నోట్లో గుడ్డలు కుక్కి 12 తులాల బంగారు, కారు, కొంత నగదుతో దుండగలు పరారయ్యారు. కంచరపాలెం క్రైంపోలీసులు కేసును తమైదన శైలిలో విచారిస్తున్నారు.
ఆరిలోవ రైతు బజార్లో మొత్తం 11 స్టాళ్లను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డ్వాక్రా మహిళలకు 10, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్కి ఒకటి కేటాయించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 20వ తేదీ లోపు గోపాలపట్నంలో గల మార్కెటింగ్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
డ్వాక్రా మహిళలకు సఖి సురక్ష కార్యక్రమం కింద ఈనెల 26 వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 35 ఏళ్లు దాటిన మహిళలకు వైద్య పరీక్షలు చేస్తామన్నారు. వైద్య పరీక్షల్లో వ్యాదిని గుర్తించి చికిత్స అందిస్తామని మెప్మా డైరెక్టర్ తేజ భరత్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.