Visakhapatnam

News August 28, 2025

సాగర్ తీరంలో ప్రో కబడ్డీ టీమ్‌లు

image

విశాఖ సాగర్ తీరంలోని సబ్ మెరైన్ మ్యూజియం వద్ద ప్రో కబడ్డీ ప్లేయర్స్ సందడి చేశారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను 12 టీమ్‌ల కెప్టెన్లు విడుదల చేశారు. పోస్టర్‌తో పాటు లీగ్ కప్‌ను ప్రదర్శించారు. రేపటి నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు పోర్ట్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి.

News August 28, 2025

సీఎం పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

CM చంద్రబాబు పర్యటన సందర్భంగా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెలిప్యాడ్ వద్ద ముందస్తు చర్యలు, VIP ప్రోటోకాల్, గ్రీన్ రూమ్ ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. నోవాటెల్, రాడిసన్ బ్లూ రిసార్ట్‌లలో జరిగే సమావేశాల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ట్రేడ్ ప్రొమోషన్ కౌన్సిల్‌తో సమన్వయం చేయాలన్నార

News August 28, 2025

విశాఖలో ముగ్గురు కీలక నేతల పర్యటన

image

విశాఖలో ముగ్గురు ముఖ్య నాయకులు 3 రోజులపాటు పర్యటించనున్నారు. మంత్రి నారా లోకేశ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విశాఖలో పర్యటిస్తూ, టీడీపీ కార్యాలయంలో బస చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 3 రోజుల పర్యటనలో పాల్గొననున్నారు. ఈనెల 29న సీఎం చంద్రబాబు విశాఖ రానున్నారు. ముగ్గురు నేతలు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీరి బందోబస్తుకి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News August 28, 2025

పెద్ద వాల్తేరులో 25 తలల వినాయకుడు

image

వినాయక చవితి వేడుకలు విశాఖలో ఘనంగా జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్వామి విగ్రహాలను తయారుచేయించి ప్రత్యేక పూజలు చేశారు. వీటిలో పెద్ద వాల్తేరులో ప్రతిష్ఠించిన 25 తలల వినాయకుడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఇక్కడి గణపయ్యను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.

News August 27, 2025

విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

image

రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గురువారం విశాఖ రానున్నారు. గురువారం రాత్రి 9 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని సర్క్యూట్ హౌస్‌లో బస చేస్తారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబుతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 11:10 కి విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్‌లో విజయవాడ బయలుదేరి వెళ్తారు.

News August 27, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన విశాఖ కలెక్టర్

image

సీఎం చంద్రబాబు ఈనెల 29న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం పరిశీలించారు. భద్రతాపరమైన అంశాలపై పోలీస్ కమిషనర్‌తో చర్చించారు. అనంతరం రుషికొండ రాడిసన్ రిసార్ట్‌ను సందర్శించి అక్కడ జరగబోయే గ్రిఫిన్ నెట్వర్కింగ్ మీటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. గ్రీన్ రూమ్, ప్రధాన సమావేశం జరిగే ప్రాంతాలను పరిశీలించారు.

News August 27, 2025

ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో ‘కవచ్’ లోకోను ప్రారంభించిన DRM

image

విశాఖ ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో మంగళవారం ‘కవచ్’ లోకోను DRM లలిత్ బొహ్రా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైలు ప్రమాదాలను నివారించడానికి స్వదేశీ పరిజ్ఞానంతో
‘కవచ్’ వ్యవస్థ రూపొందించినట్లు పేర్కొన్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీ కొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు.

News August 27, 2025

విశాఖ: ‘సారీ నేను బతకలేను’

image

పెదగంట్యాడలో బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు న్యూపోర్ట్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న బాలిక (13) ఇంటి నుంచి వెళ్లిపోతూ చీటీ రాసింది. అందులో ‘నన్ను వెతకొద్దు, మమ్మీ నాకు చచ్చిపోవాలని ఉంది. ఇన్ని రోజులు చాలా భరించాను. ఇప్పుడు నేను ఇంక దీన్ని భరించలేను. సారీ, గుడ్ బై, నేను ఇంకా బ్రతకను’ అని రాసి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 27, 2025

విశాఖ: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాందుడుకి విశాఖ స్పెషల్ పోక్సోకోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2024లో భీమిలి మండలానికి చెందిన సరగడ సన్యాసిరావు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నేరం రుజువుకావడంతో కోర్టు పై విధంగా శిక్ష విధించింది. బాధిత బాలికకు రూ.3 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

News August 27, 2025

విశాఖలో సీఎం పర్యటన ఖరారు

image

సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. 29న సీఎం విశాఖ రానున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్‌లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కి హాజరవుతారు. మధ్యాహ్నం 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్ వర్క్ మీటింగ్‌లో పాల్గొంటారు. సా. 4.20కి విశాఖ నుంచి బయలుదేరి వెళ్తారు.