India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో 2024 స్వచ్ఛ సర్వేక్షన్లో ప్రథమ స్థానంలో నిలపాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్ సోమనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం జోన్ -3 ఆఫీసులో అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నేరుగా ముఖాముఖిగా, స్వచ్ఛత యాప్, వెబ్సైట్ లింకు ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు. విశాఖ నగర అభివృద్ధికి, నగరాన్ని దేశంలోనే ప్రథమ స్థానం లక్ష్యసాధనకు ప్రజలుకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగు హాలులో డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. గాజువాక, ఆటోనగర్, పెదగంట్యాడ, అగనంపూడిలో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం గుర్తించాలన్నారు. ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడపాలని ఆదేశించారు.
వన్యప్రాణుల హావభావాలను మంత్రముగ్ధులు కాని వారు ఎవరూ ఉండరు. మానవ నేస్తాలుగా వన్యప్రాణులు వ్యవహరిస్తూ విశాఖ జూపార్క్లో ఒక సాంబార్ డీర్ అందరినీ ఆకట్టుకుంటుంది. కళాశాల విద్యార్థులు,సందర్శకులు దీనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. సెల్ఫీ ఇవ్వడానికి నేను రెఢీ.. మరి మీరు రెఢీనా అన్నట్లుగా ఏమాత్రం భయం లేకుండా ఆ సాంబార్ డీర్ సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. ఇలాంటి దృశ్యాలు ఎన్నో జూలో సాక్షాత్కరిస్తాయి.
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖ – గుణుపూర్ (58505/06) పాసెంజర్కు అదనపు బోగి వేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు అదనపు స్లీపర్ కోచ్ ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా అదనపు బోగి సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
విశాఖలో చిట్టీల పేరుతో మోసం చేసిన దంపతులు అరెస్ట్ అయ్యారు. మల్కాపురానికి చెందిన దంపతులు మోహన్ రావు, లక్ష్మి చిట్టీల పేరుతో తనను మోసం చేశారని పెద్ద గంట్యాడకు చెందిన లక్ష్మీ న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనే వీరి వ్యవహరంపై సీపీని బాధితులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యూపోర్ట్ CI కామేశ్వరరావు వీరిద్దరిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు. మార్చి 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో మెడికల్ స్టోర్ వద్ద గురువారం ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే.అతడు మందులు కొనడానికి వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది అతడు మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి వద్ద మందుల చీటీ మాత్రమే ఉండడంతో టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలానికి చెందిన రమణ (60)గా గుర్తించారు.
గాజువాకలో ఓ చిన్నారిపై అత్యాచారయత్నం జరిగినట్లు గాజువాక పోలీసులకు ఫిర్యాదు అందింది. ఐదు సంవత్సరాల చిన్నారికి సన్నీబాబు అనే వ్యక్తి గురువారం మాయ మాటలు చెప్పి అత్యాచారానికి యత్నించడంతో ఆ చిన్నారి కేకలు వేసి తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి నిందితుడిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
బైక్పై ప్రయాణించేవారికి హెల్మెట్ ధారణ తప్పనిసరి అని విశాఖ ఉప రవాణా కమీషనర్ ఆర్సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బైక్ నడిపే వ్యక్తి, వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ ధరించాలన్నారు. ఏ ఒక్కరు హెల్మెట్ ధరించకపోయినా జరిమానా విధిస్తామన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సు 3 నెలలు సస్పెండ్ చేసి, ఫైన్ వేస్తామన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే సేవలను మరింత మెరుగుపరచాలని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వీసీ హాలులో వారితో సమావేశమైన ఆయన వివిధ అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఉచిత గ్యాస్, రేషన్ బియ్యం పంపిణీ, తూనికలు, కొలతలు ఇతర ప్రమాణాలు పాటించే క్రమంలో జాగ్రత్తలు వహించాలని చెప్పారు.
➤ శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసుల సేవలపై ప్రశంసలు
➤ ప్రశాంతంగా ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు
➤ జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాలలో 87.30 శాతం పోలింగ్
➤ KGHలో శిశువులు మార్పిడి.. ప్రత్యేక విచారణ కమిటీ
➤ అప్పికొండ బీచ్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్కు అస్వస్థత
➤ కంచరపాలెంలో తల్లి మందలించిందని 9వ తరగతి విద్యార్థి మృతి
Sorry, no posts matched your criteria.