India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ తీరానికి సైనికులతో ఉన్న అమెరికా దేశ యుద్ధ నౌకలు వచ్చాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రతకు దిక్సూచిగా భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ 2025 విన్యాసాల్లో పాల్గొనడానికి విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ వరకు హార్బర్ ఫేజ్లో విన్యాసాలు జరుగుతాయి. అమెరికా యుద్ధనౌక యూఎస్ కంస్టాక్, రాల్స్ జాన్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ నెల 8వతేదీ సింహద్రి అప్పన్న స్వామి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం నేపథ్యంలో ఈనెల 7 నుంచి 24వరకు దర్శన వేళ్లలో మార్పులు చేశారు. ఈ రోజుల్లో అర్జీత సేవలు ఉండవని అర్చకులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. 7వ తేదీ నుంచి 14 వరకు సుప్రభాత సేవ, ఉదయం, రాత్రి ఆరాధన సేవల్లో భాగస్వామ్యం ఉండదన్నారు. అలాగే రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు ఉండవు. 10వ తేదీన ఉదయం 8గంటల తర్వాత సర్వ దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లకు బచేలి కిరండోల్ సెక్షన్లో ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం గమ్యం కుదించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. విశాఖ – కిరండోల్ పాసెంజర్(58501/02),విశాఖ-కిరండోల్ నైట్ ఎక్స్ ప్రెస్(18515/16) ఏప్రిల్ 5 నుంచి 14వరకు దంతేవాడ వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో కిరండోల్కు బదులుగా దంతేవాడ నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లకు బచేలి కిరండోల్ సెక్షన్లో ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం గమ్యం కుదించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. విశాఖ – కిరండోల్ పాసెంజర్(58501/02),విశాఖ-కిరండోల్ నైట్ ఎక్స్ ప్రెస్(18515/16) ఏప్రిల్ 5 నుంచి 14వరకు దంతేవాడ వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో కిరండోల్కు బదులుగా దంతేవాడ నుంచి బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
వేసవి రద్దీ దృశ్య రద్దీని అరికట్టేందుకు సింహాచలం, దువ్వాడ మీదుగా ప్రత్యేక రైలు నడపనట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. షాలిమర్ -చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్ (02841/42) రైళ్ళు ఏప్రిల్ 7,14,21 తేదీలలో షాలిమర్ నుంచి సింహాచలం మీదుగా చెన్నై వెళ్ళనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఏప్రిల్ 9,16,23 తేదీలలో చెన్నై నుంచి సింహాచలం మీదుగా షాలిమర్ వెళ్ళనున్నట్లు వెల్లడించారు.
విశాఖ జనసేన పార్టీ ఆఫీసులో జీవీఎంసీ జనసేన కార్పొరేటర్లు శుక్రవారం సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాటకు నిలబడి ఉంటామని జనసేన కార్పొరేటర్లు అన్నారు. ‘అవిశ్వాసంలో పవన్ కళ్యాణ్ ఏది చెబితే అదే మా తుది నిర్ణయం’ అని అన్నారు. జీవీఎంసీ కౌన్సిల్ అవిశ్వాసంపై ఒకే తాటిపై ఉంటామని భీశెట్టి వసంతలక్ష్మి అన్నారు. త్వరలో కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నట్లు PAC సభ్యులు తాతారావు వెలెల్లడించారు.
విశాఖలో ఇందిరా గాంధీ జూపార్క్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పశువైద్యుని పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు క్యూరేటర్ మంగమ్మ శుక్రవారం తెలిపారు. క్లినికల్ డిసిప్లిన్ సబ్జెక్టులలో మాస్టర్స్ చేసిన వారు అర్హులన్నారు. అనుభవం ఆధారంగా రూ.35,000 నెలవారీ వేతనంతో నియమిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రెజ్యూమ్ను విద్యా అర్హతలతో “పోస్ట్” ద్వారా ఏప్రిల్ 20లోపు ఇందిరా గాంధీ జూ పార్క్కు పంపాలన్నారు.
విశాఖలో కాట్పా 2003 చట్టం నేటి నుంచి అమలు చేశామని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. జిల్లాలో ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం పలు చోట్ల ప్రజలకు అవగాహనా కల్పించారు. బహిరంగ ప్రదేశాలలో పొగ తాగితే రూ.200 జరిమానా విధిస్తామన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తులకు 200 చొప్పున జరిమానా విధించారు. స్కూల్స్ వద్ద 100 మీటర్లలోపు పొగాకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని NCD ప్రోగ్రాం ఆఫీసర్ హారిక హెచ్చరించారు.
విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిల్మ్ నగర్ క్లబ్ అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 38 నామినేషన్లు వేసినట్లు సమాచారం. కాగా.. అధ్యక్ష పదవికి విష్ణుకుమార్ రాజుతో పాటు సినీ నిర్మాత కేఎస్ రామారావు కూడా పోటీలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు పరశురామ రాజు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ మేయర్ పీఠంపై ఎవరి ధీమా వారికే ఉంది. మొత్తం 98 కార్పోరేషన్లకు గాను ఒక స్థానం ఖాళీగా ఉంది. 14 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి 111 ఓట్లు ఉన్నాయి. అవిశ్వాసం నెగ్గాలంటే 2/3 సభ్యుల మద్ధతు అవసరం. ఇప్పటికే 71 మంది మద్ధతు తమకు ఉందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. YCP కార్పొరేటర్లు తమతోనే ఉన్నారని ఆ పార్టీ పెద్దలు చెప్తుతున్నారు. మరి వీరిలో ఎవరు నెగ్గుతారో చూడాలంటే ఈనెల 19 వరకు ఆగాల్సిందే.
Sorry, no posts matched your criteria.