India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలోని ఓ దినపత్రికపై మీద ఎదురుదాడి చేసిన అధికార యంత్రాంగానికి హైకోర్టులో చుక్కెదురైంది. లీడర్ దినపత్రిక సంపాదకులు రమణ మూర్తికి ఆర్డీవో శ్రీలేఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు అలాగే ఆర్డీవో ఇచ్చిన నోటిస్పై 3 వారాలులోగా పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
భక్తులపై ఏనుగుల దాడి చేసిన ఘటనపై హోంమంత్రి అనిత ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలోని వైకోట సమీపంలో గుడాలకోన వద్ద జరిగిన ఈ ఘటనపై ఎస్పీ విద్యాసాగర్తో హోంమంత్రి మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏనుగుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండాల కోనకు వెళ్లే భక్తులకు మరింత భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
విశాఖ నగరంలోని రామ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. ఏపీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకోజి పాలెం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. రాత్రి 12 గంటల తర్వాత ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్ టీం చేరుకున్నారు. ఏసీపీ అన్నెపు నర్సింహామూర్తి, సీఐ మురళి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగిన రామారావు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో దువ్వారపు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ స్థానం ఖాళీ కానుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. ఈయన స్థానంలో పార్టీ ఎవరి పేరును ఖరారు చేస్తుందో వేచి చూడాలి.
విశాఖలో వార్డు సచివాలయాల్లో, కామన్ సర్వీస్ సెంటర్లో, పోస్ట్ ఆఫీస్లో ఈనెల 28 వరకు ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ సోమవారం తెలిపారు. జిల్లాలో 3,200కు పైగా పిల్లలు బర్త్ సర్టిఫికెట్ ఉండి కూడా బాలాధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోలేదన్నారు. వారందరూ ఈఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకునేలా అంగన్వాడి కేంద్రాల సూపర్వైజర్స్ వారి తల్లిదండ్రులకు వివరించాలని ఆదేశించారు.
ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు విశాఖ- షాలిమార్కు(08508/07) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 29వరకు ప్రతి మంగళవారం నడవనుంది. మంగళవారం విశాఖలో బయలుదేరి బుధవారం షాలిమార్ చేరుకుంటుంది. మళ్లీ బుధవారం షాలిమార్ నుంచి బయలుదేరి గురువారం విశాఖ చేరుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
విశాఖ జిల్లా పరిధిలో బాలకార్మికుల విముక్తికి కార్మిక శాఖ ఆధ్వర్యంలో 10 ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు ఉప కార్మికశాఖ కమిషనర్ సునీత.. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్మిక శాఖపై సోమవారం సమీక్ష జరిపారు. ఈ ఆపరేషన్ ద్వారా 170 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించినట్లు తెలిపారు. విశాఖలో బాల కార్మిక వ్యవస్థ నివారించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.
గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్లు MRP కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం గ్యాస్ ఏజెన్సీలపై కేసులు నమోదు చేస్తామని విశాఖ జేసీ మయూర్ అశోక్ హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీల డిస్ట్రిబ్యూటర్లతో సోమవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. దీపం-2 పథకం కింద సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోపు లబ్దిదారుల ఖాతాలో సబ్సిడీ జమ కావాలన్నారు. కాని పక్షంలో డీలర్లను సంప్రదించారని లబ్ధిదారులను కోరారు.
విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో DMHO జగదీశ్వర రావు సోమవారం మాతృ మరణాలపై డిస్ట్రిక్ట్ లెవెల్ ఎం.సి.హెచ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరిలో రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి రెడ్డిపల్లిలోని ఒక మాతృ మరణం జరిగిందన్నారు.ఇకపై మాతృ మరణాలు జరగకుండా చూడాలని హెచ్చరించారు. గర్భిణీగా ఉన్నప్పుడే హై రిస్క్ ప్రెగ్నెన్సి గుర్తించి తగిన సలహాలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
మార్చి 14వ తేదిన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు విశాఖ పార్లమెంట్కు సంబందించి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ను నియమించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ ను అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. వీరు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి వేడుకలు విజయవంతానికి కృషి చేయాలి.
Sorry, no posts matched your criteria.