Visakhapatnam

News July 28, 2024

దసపల్లా భూములను స్వాధీనం చేసుకోవాలి: విశాఖ కార్పొరేటర్

image

విశాఖ నగరంలోని అత్యంత విలువైన దసపల్లా భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. భూములు ప్రభుత్వానివి అని మరోసారి రుజువైనందున తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ భూముల హక్కుదారులుగా ఇంతవరకు చలామణి అయిన రాణి కమలాదేవికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

News July 28, 2024

ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు: కలెక్టర్ దీనేశ్

image

గోదావరి, శబరి వరదల నేపథ్యంలో వరద బాధితులు ఎవరూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని, ఎటువంటి ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు. అవసరమైన వారిని గుర్తించి రేషన్, నిత్యావసర వస్తువులు, టార్పాలిన్లు, దోమతెరలు, కిరోసిన్ టార్చ్ లైట్ లు లాంటివి పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News July 27, 2024

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోడవరం బాలుడు

image

చోడవరానికి చెందిన బాలుడు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. అలవల సత్యప్రసాద్, మానస దంపతుల కుమారుడు ఆష్మాన్ రామ్ రెండున్నరేళ్ల వయసులో 110 దేశాల జాతీయ జెండాలను గుర్తించి వాటి దేశాల పేర్లు చెప్పడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. ఆన్‌లైన్‌‌లో లింగాష్టకం 57 సెకెన్‌లలో ఆలపించడంతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు.

News July 27, 2024

విశాఖ-కిరండూల్-విశాఖ రైలు దారి మల్లింపు

image

భారీ వర్షానికి ట్రాక్ పై బండరాళ్లు పడవచ్చుననే కారణంగా విశాఖ-కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్‌‌ను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ – కిరండూల్ నైట్ ట్రైన్(18514) ఈ నెల 27 నుంచి 31 వరకు విజయనగరం, రాయగడ మీదుగా కిరండూల్ చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణం కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్(18513) ఈ నెల 28 నుంచి ఆగష్టు 1వ తేదీ వరకు కిరండూల్ నుంచి రాయగడ, విజయనగరం మీదుగా విశాఖ చేరుతుందన్నారు.

News July 27, 2024

విశాఖ: పోలీస్ సిబ్బందికి రివార్డులు అందించిన సీపీ

image

ఈ నెలలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు 81 మందికి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ రివార్డులు అందించారు. నగరంలో శనివారం నెలవారీ క్రైమ్ రెవ్యూ నిర్వహించారు. గంజాయి రవాణా, చోరీ సొత్తు రికవరీ తదితర సంఘటనలలో ప్రతిభ కనపర్చిన వారికి ప్రతి నెలా రివార్డులు అందజేసి వారిని ప్రోత్సహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

News July 27, 2024

విశాఖ: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

image

సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకొని అమ్మాయిల ఫొటోలు ఎరగా చూపి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ వాసి కె.లోకేశ్‌ను అరెస్టు చేసినట్లు విశాఖ సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్ తెలిపారు. ఆ వ్యక్తి మాయలో నగరానికి చెందిన ఓ వ్యక్తి రూ. 28 లక్షలు పోగొట్టుకున్నాడని ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. కేసులో సంబంధం ఉన్న మరి కొంతమంది పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

News July 27, 2024

విశాఖ: ఆగస్టు 1న పలు రైళ్లు రీ షెడ్యూల్

image

పూండి-నౌపడ సెక్షన్లో పలు రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఆగస్టు 1న భువనేశ్వర్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(12830) గంట ఆలస్యంగా మ.1.10 గంటలకు, ఆగస్టు 3న పూరీ-గాంధీధాం (22974) గంటన్నర ఆలస్యంగా మ.12.45 గంటకు, భువనేశ్వర్-తిరుపతి (22879) గంట ఆలస్యంగా మ.1.10 గంటకు బయలుదేరుతుంది. ఈ నెల 29, ఆగస్టు 1,3 తేదీల్లో విశాఖ-పలాస-విశాఖ మాత్రమే రాకపోకలు సాగిస్తుంది.

News July 27, 2024

బ్రిక్స్‌లో భారత్‌ ప్రతినిధిగా విశాఖ అమ్మాయి

image

రష్యాలోని ఉలియనోస్క్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో భారత్‌తో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. పెందుర్తిలోని నీలకంఠపురానికి చెందిన షేక్ ఆయేషా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PHD చేస్తున్నారు. దేశం తరఫున బ్రిక్స్ సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న ఏకైక తెలుగు అమ్మాయి కావడం విశేషం.

News July 27, 2024

బ్రిక్స్‌లో భారత్‌ ప్రతినిధిగా విశాఖ అమ్మాయి

image

రష్యాలోని ఉలియనోస్క్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో భారత్‌తో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. పెందుర్తిలోని నీలకంఠపురానికి చెందిన షేక్ ఆయేషా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PHD చేస్తున్నారు. దేశం తరఫున బ్రిక్స్ సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న ఏకైక తెలుగు అమ్మాయి కావడం విశేషం.

News July 27, 2024

విశాఖ: ‘సకాలంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి’

image

ఉద్యోగులు సకాలంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలని ఇన్కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ శేషగిరిరావు సూచించారు. విశాఖ నగరం దొండపర్తి డీఆర్ఎం కార్యాలయంలో పన్ను చెల్లింపుదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం మనోజ్ కుమార్ సాహు పాల్గొన్నారు.