India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

VMRDA మాస్టర్ ప్లాన్-2041ని రివిజన్ చేస్తోంది. గత డ్రాఫ్ట్పై వచ్చిన అభ్యంతరాల ఆధారంగా సవరణలు చేపట్టింది. మార్చి 10 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుంది. 4,380 చ.కి.మీ.ల పరిధిలో పట్టణాభివృద్ధి, రవాణా సౌలభ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వానికి సమర్పించే ముందు ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం(సేఫ్టీ) కర్రి శ్రీనివాస్ అరుదైన O-నెగటివ్ రక్తాన్ని 57వసారి దానం చేసి సేవా స్ఫూర్తిని చాటారు. గుండెపోటుతో కేజీహెచ్లో శస్త్రచికిత్సకు సిద్ధమైన హిరమండలం ప్రాంతానికి చెందిన రామారావుకు అత్యవసరంగా రక్తం అవసరమవడంతో ఆయన స్పందించారు. అవసరమైన వారికి రక్తం దానం చేయడం సంతృప్తిని ఇస్తోందని ఆయన అన్నారు.

నగరంలో మాంసం చేపలు విక్రయాలకు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో మాంసం విక్రయాలు చేపట్టవద్దని, దుకాణాలు తెరవవద్దని, నిబంధనలు ఉల్లంఘింస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అధికారులు వ్యాపారులకు ముందుగానే తెలిపి పర్యవేక్షణ చేయాలని సూచించారు.

నగరంలో మాంసం చేపలు విక్రయాలకు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో మాంసం విక్రయాలు చేపట్టవద్దని, దుకాణాలు తెరవవద్దని, నిబంధనలు ఉల్లంఘింస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అధికారులు వ్యాపారులకు ముందుగానే తెలిపి పర్యవేక్షణ చేయాలని సూచించారు.

నగరంలో మాంసం చేపలు విక్రయాలకు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో మాంసం విక్రయాలు చేపట్టవద్దని, దుకాణాలు తెరవవద్దని, నిబంధనలు ఉల్లంఘింస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అధికారులు వ్యాపారులకు ముందుగానే తెలిపి పర్యవేక్షణ చేయాలని సూచించారు.

విశాఖలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్తో పాటు పలువురు కోర్ట్ అధికారులు ఉన్నారు.

విశాఖలో 17 నుంచి 25 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టరేట్లో ఫిబ్రవరి 16న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ రద్దు చేసినట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ ఐఎఫ్ఆర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య నేతలు రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్ల నిర్వహణలో పాల్గొంటున్నారన్నారు. ఈ మేరకు నగర ప్రజలు గమనించాలని సూచించారు.

విశాఖలో జరగనున్న ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి పదో తరగతి, ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు పూర్తిగా నిషేధించాలన్నారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ నిర్వహించారు. ఈ ఓపెన్ ఫోరమ్లో 22 వినతులను జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు స్వీకరించారు. వీటిలో జోన్లు భీమిలి-1, మధురవాడ-3, ఈస్ట్-7, సౌత్-2, నార్త్-2, వెస్ట్-1, పెందుర్తి-2, గాజువాక-4 వినతులు ఉన్నాయి. సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

నగరంలోని గత నెలలో వివిధ కేసుల్లోని ప్రతిభ చూపించిన 291 పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబత్ర బాగ్చి రివార్డులు అందజేశారు. వివిధ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి సీఐ వరకు మెరిట్ ఆధారంగా గుర్తించి రివార్డులు క్రైమ్ మీటింగ్లో అందించారు. మిగతా సిబ్బంది వీరిని స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో మరింత పనిచేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.