India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤ యుాజీసీ జేఆర్ఎఫ్ సాధించిన దివ్యాంగ ఏయూ విద్యార్థి
➤ వాల్తేర్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రా బాధ్యతలు స్వీకరణ
➤ అవమానంతో తన బిడ్డ చనిపోయాడంటూ గోపాలపట్నంలో నిరసన
➤ రుషికొండలో పల్సస్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన
➤ ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫీజు గడువు పెంపు(మార్చి 13)
➤ ఆనందపురం ఎస్ఐ ఎడమ చేతికి తీవ్ర గాయం
➤ విశాఖ ఆర్డీవోపై చర్యలకు జర్నలిస్టు సంఘాల డిమాండ్
వీఎంఆర్డీఏ నుంచి ఇళ్లు, ఇళ్ళ స్థలాలను కొనుగోలు చేసిన వారి నుంచి బకాయిలను వసూలు చేయాలని మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. దుకాణాల నుంచి అద్దెలు సకాలంలో వసూలు చేయాలని, బకాయిలు ఉంటే నోటీసులు జారీ చేయాలని సూచించారు. దుకాణదారులు నిర్దేశించిన స్థలానికి మించి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏయూ దూరవిద్యా కేంద్రంలో పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు దరఖాస్తు చేయడానికి మార్చి 13 వరకు గడువున్నట్లు డైరెక్టర్ తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో మార్చి 17 వరకు, మార్చ్ 20 వరకు రూ.2000 అపరాధ రుసుముతో దరఖాస్తులను స్వీకరిస్తారు. మార్చి 20 తర్వాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవన్నారు. మార్చి 28 నుంచి పరీక్షలు ప్రారంభంఅవుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఏయూ వెబ్ సైట్ను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగ విద్యార్థి శ్యామ్ యూజీసీ జేఆర్ఎఫ్ సాధించాడు. దివ్యాంగుడైన శ్యామ్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిభ అర్హత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ జేఆర్ఎఫ్ సాధించడం పట్ల విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి శ్యామ్ని విభాగంలో సత్కరించారు. శ్యామ్ నుంచి యువత స్ఫూర్తి పొందాలని చెప్పారు.
వాల్తేరు డివిజన్ రైల్వే డీఆర్ఎంగా లలిత్ బోహ్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఆర్ఎంగా పని చేసిన సౌరబ్ కుమార్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో ఇప్పటి వరకు మనోజ్కుమార్ సాహు తాత్కాలిక డీఆర్ఎంగా వ్యవహారించారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ సోమవారం పూర్తయ్యింది. విశాఖ జిల్లాలోని 13 పోలింగ్ కేంద్రాలకు గాను పీవో, ఏపీవో, ఓపీవోలను కేటాయిస్తూ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టరేట్లోని ఎన్.ఐ.సి. కేంద్రం నుంచి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా 13 పీవోలను, 13 ఏపీవోలను, 26 మంది ఓపీవోలను కేటాయించారు.
విశాఖ జిల్లా ఆనందపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. 1998-99లో 10వ తరగతి చదివిన విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వారి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. చదువులు చెప్పిన టీచర్లకు సన్మానం చేశారు. మీరూ ఇలా చేశారా? చివరిసారి ఎప్పుడు గెట్ టూ గెదర్ చేసుకున్నారో కామెంట్ చేయండి.
విశాఖకు లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన ఓ యువకుడు కొన్ని బెట్టింగ్ యాప్ల్లో నగదు పెట్టి నష్టపోయాడు. దాదాపు రూ.2కోట్ల వరకు అప్పులు చేశాడు. ఇదే సమయంలో అతనికి నాని చేసిన ప్రమోషన్ వీడియోలు కనపడ్డాయి. తనలా మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో సదరు యువకుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతోనే నానిని అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలోని నూతన బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాంధ్రతోపాటు కాకినాడ జిల్లాకు చెందిన న్యాయవాదులు ఈ తీర్మానం చేశారు. భారీ అసోసియేషన్ అధ్యక్షుడు బి.సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ నిరసనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు.
➤విశాఖ: లోకల్బాయ్ నానికి రిమాండ్..! ➤విశాఖ: యువకుడిని కాపాడిన లైఫ్ గాడ్స్ ➤విశాఖలో నకిలీ పోలీస్ అరెస్ట్ ➤ శివరాత్రి స్పెషల్.. అప్పికొండ, R.K బీచ్లకు ప్రత్యేక బస్సులు ➤ విశాఖ: యాక్సిడెంట్లో భర్త మృతి.. భార్యకు గాయాలు ➤గాజువాకలో యువకుడు సూసైడ్? ➤విశాఖలో గ్రూప్-2 పరీక్ష.. డ్రోన్లతో నిఘా..! ➤ఆనందపురం హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా
Sorry, no posts matched your criteria.