India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత్, అమెరికా సంయుక్తంగా విశాఖలో ఇవాళ్టి నుంచి టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు చేయనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో పరస్పర సహకారంలో భాగంగా ఇరు దేశాలు ఈ విన్యాసాలు చేపడుతున్నాయి. 13 రోజుల పాటు బంగాళాఖాతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 యుద్ధ నౌకలు విశాఖకు తరలివస్తున్నాయి. ఇరు దేశాల వైస్ అడ్మిరల్, రియల్ అడ్మిరల్ స్థాయిలో పరస్పర చర్చలు జరగనున్నాయి.
గ్రేటర్ విశాఖలో రూ.510కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు కలెక్టర్&ఇన్ఛార్జ్ కమీషనర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించిన ప్రజలకు, వసూళ్లలో పాల్గొన్న జోనల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 2023-24 సంవత్సరంకు గాను రూ.454కోట్లు వసూళ్లు చేయగా.. 2024-25లో రూ.510కోట్లు వసూళు చేయడం హర్షనీయమన్నారు.
విశాఖకు చెందిన వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు తుని GRP పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోమవారం కాకినాడ(D) గొల్లప్రోలు వద్ద జరిగింది. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ తన కుమార్తె పుట్టి వెంట్రుకలు తీయించేందుకు భార్యతో కలిసి వీక్లీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తున్నాడు. చేయి కడుక్కునేందుకు వాష్ బేసిన్ దగ్గరకు వచ్చిన ఆయన కుదుపులకు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
విశాఖలోని భార్మక్యాంపు వద్ద బైకులకు నిప్పంటించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవీఎంసీలో విధులు నిర్వహిస్తున్న భరత్ అనే వ్యక్తి భార్మక్యాంపుకు చెందిన మహిళను మోసం చేశాడనే కోపంతో ఆయన వాహనానికి నిప్పంటించింది. దీంతో 18 బైకులు దగ్ధం అయ్యాయి. రూ.19 లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగిందని ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. మహిళను కోర్టులో హాజరుపరచగా 11 రోజులు రిమాండ్ విధించారని పోలీసులు ఆదివారం తెలిపారు.
సింహాచలం కొండపై గంగధార వద్ద ఉన్న సీతారామ స్వామి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఏవో సుబ్బారావు సోమవారం తెలిపారు. ఆరోజు ఉదయం 10:30 నుంచి దేవస్థానం అర్చకుల సమక్షంలో అత్యంత వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. ఆరోజున భక్తులు విచ్చేసి స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొవాలన్నారు. స్వామి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుబ్బారావు తెలిపారు.
విశాఖ మేయర్ పీఠంపై మరికొద్ది రోజుల్లో సస్పెన్ష్ వీడనుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కలెక్టర్ ఎం.హరేంద్ర ప్రసాద్కు కూటమి కార్పొరేటర్లు నోటీసులు ఇవ్వగా.. ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ కార్పొరేటర్లకు సమాచారం అందించారు. అయితే YCPకార్పొరేటర్లను అధిష్ఠానం బెంగుళూరు తరలించగా.. కూటమి కూడా తమ కార్పొరేటర్లను టూర్కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
గ్రేటర్ విశాఖలో రూ.510కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు కలెక్టర్&ఇంచార్జి కమీషనర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించిన ప్రజలకు, వసూళ్లలో పాల్గొన్న జోనల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 2023-24 సంవత్సరంకు గాను రూ.454కోట్లు వసూళ్లు చేయగా.. 2024-25లో రూ.510కోట్లు వసూళు చేయడం హర్షనీయమన్నారు.
క్రికెట్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుడితో పాటు ప్రమోట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. దుబాయ్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తూ విశాఖలో ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రవీణ్ కుమార్, మదీనావలి, రజియాబేగం, ధరణి అనే వారిని అరెస్టు చేశామని తెలిపారు. బెట్టింగ్ యాప్లపై సమాచారం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
విశాఖ కేజీహెచ్లో ఏప్రిల్ 1 నుంచి అన్ని పని రోజులలో సూపర్ స్పెషాలిటీ ఓ.పి. సేవలు ఉంటాయని కేజీహెచ్ సూపరింటెండ్ శివానంద్ సోమవారం తెలిపారు. గతంలో ఒక్కో రోజు ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ వైద్యానికి ఓ.పి.విభాగాలు పని చేసేవన్నారు. కానీ రేపటి నుంచి అన్ని పనిదినాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సా.4 వరకు ఓ.పి. చూస్తారని వెల్లడించారు. ప్రజలు గమనించాలని కోరారు.
టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు నడుచుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఐదేళ్లు కష్టపడి పార్టీని కార్యకర్తలు అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు.
Sorry, no posts matched your criteria.