Visakhapatnam

News July 11, 2024

గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా.. ఐతే ఇది తప్పనిసరి

image

ఈ నెల 20న సింహాచలం గిరి ప్రదక్షిణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రదక్షిణ చేయటానికి లక్షల మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. కావున వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ప్రదక్షిణ చేసే భక్తులకు ఆస్తమా, జ్వరం మొదలైనవి ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రదక్షిణ సమయంలో అలసట, నీరసం వస్తే దగ్గరలో వైద్యశిబిరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

News July 11, 2024

ఉమ్మడి విశాఖ జిల్లా జనాభా 50.66 లక్షలు..!

image

ఉమ్మడి విశాఖ జిల్లా జనాభా 50,66,616కు చేరుకుంది. విశాఖ జిల్లాలో 23,85,658 మంది, అనకాపల్లి జిల్లాలో 17,26,998 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9,53,960 మంది జనాభా ఉన్నట్లు ఏయూ జనాభా అధ్యయన కేంద్రం అంచనా వేసింది. 2011 పోల్చితే ఉమ్మడి జిల్లాలో సుమారు 8 లక్షలకు పైగా జనాభా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి విశాఖ జిల్లా జనాభా 42,90,599గా ఉంది.

News July 11, 2024

ఏయూ: 27 నుంచి ఎం.ఏ పరీక్షలు ప్రారంభం

image

ఏయూ పరిధిలో ఎం.ఏ ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, తెలుగు, ఎకనామిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, యోగ, సోషల్ వర్క్, లైబ్రరీ సైన్స్, ఎంజెఎంసి, యాంత్రపాలజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 27 నుంచి ప్రారంభమవుతాయని అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు వారీగా సబ్జెక్టులు వివరాలతో టైం టేబుల్ వెబ్సైట్లో ఉంచారు.

News July 11, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందాం: సీఎం చంద్రబాబు

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి తాను ప్రయత్నిస్తుంటే, అబద్ధాల పార్టీ(వైసీపీని ఉద్దేశించి)నాయకులు లేనిపోని బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అనుకూలంగా ఎన్డీఏ కూటమి ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందనవసరం లేదన్నారు.

News July 11, 2024

వైసీపీ నాయకులు ఆర్థిక నేరగాళ్లు: సీఎం చంద్రబాబు

image

వైసీపీ నాయకులపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాలనలో విశాఖ సహా ఉత్తరాంధ్రలో వనరులను, ప్రకృతిని దోచుకున్న ఆర్థిక నేరగాళ్లు.. వైసీపీ నాయకులని అన్నారు. గురువారం దార్లపూడిలో జరిగిన సభలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును దోచుకున్న ఆర్థిక నేరగాళ్లను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం హెచ్చరించారు. వైసీపీ అంటే అబద్ధాల పార్టీ అని దుయ్యబట్టారు.

News July 11, 2024

ఉత్తరాంధ్ర జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు: చంద్రబాబు

image

పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గురువారం దార్లపూడి పోలవరం ఎడమ ప్రధాన కాలువ వద్ద ప్రజల ఉద్దేశించి సీఎం మాట్లాడారు. గతంలో తాను 72% పోలవరం పనులు పూర్తిచేస్తే, వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక శాతం పనులు కూడా చేపట్టలేదని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు పోలవరం ఒక వరం అన్నారు.

News July 11, 2024

ఏయూ: 27 నుంచి ఎమ్మెస్సీ జాగ్రఫీ, సైకాలజీ పరీక్షలు

image

ఏయూ పరిధిలో ఈ నెల 27 నుంచి ఎమ్మెస్సీ జాగ్రఫీ 2వ సెమిస్టర్, ఎంఎస్సీ సైకాలజీ-పారా సైకాలజీ 2వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అడిషనల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ జె.రత్నం తెలిపారు. సబ్జెక్టు వారీగా పరీక్షలు తేదీలు, టైం టేబుల్ వివరాలను వెబ్సైట్లో ఉంచారు. జాగ్రఫీ పరీక్షలు మధ్యాహ్న 2 గంటల నుంచి 5:00 వరకు, సైకాలజీ-పారాసైకాలజీ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతాయి.

News July 11, 2024

పోలవరం కెనాల్‌ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు

image

ఎస్.రాయవరం మండలం దార్లపూడి సమీపాన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌‌కు గురువారం మధ్యాహ్నం 12గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. దార్లపూడిలో అసంపూర్తిగా నిలిచిపోయిన లెఫ్ట్ మెయిన్ కెనాల్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం సంబంధించిన మ్యాపులపై ఆరా తీశారు. అధికారులు కాలువ పురోగతిపై చంద్రబాబుకు వివరించారు. ఎంపీ సీఎం రమేశ్, మంత్రులు రామానాయుడు, అనిత, తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2024

విశాఖ: డిగ్రీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ గడువు పెంపు

image

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. 18 నుంచి 20 వరకు స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు. 23 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్‌లో మార్పులు చేసుకోవడానికి 27వ తేదీన అవకాశం కల్పిస్తారు. ఈ నెల 31న తొలి దశ సీట్ల కేటాయిస్తారు. >Share it

News July 11, 2024

విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అదనపు సాయం

image

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ బాధితులతో పాటు ప్రభావిత గ్రామాలకు అదనంగా రూ.120కోట్ల సహాయం చేసేందుకు దాని మాతృ సంస్థ ఎల్జీ కెమ్ ముందుకు వచ్చింది. నిరంతరం వైద్య పరీక్షలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఐదువేల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం చంద్రబాబుతో సంస్థ ప్రతినిధులు చర్చించారు.