India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్టీ పట్ల అంకితభావం ఉన్నవారిని పార్టీ పదవులకు ఎంపిక చేస్తున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు. మంగళవారం విశాఖలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందన్నారు. వైఎస్ విజయమ్మను వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించేందుకు ప్లీనరీ పెట్టుకున్నారని విమర్శించారు. T.D.P.లో అందరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని పార్టీ పదవులకు ఎంపిక చేస్తామన్నారు.
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు జీవీఎంసీ సింగిల్ విండో క్లియరెన్స్ సెల్ ద్వారా 1097 మంది నిర్వాహకులకు అనుమతులను మంజూరు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం తెలిపారు. జీవీఎంసీకి సంబంధించిన పట్టణ ప్రణాళిక, అగ్నిమాపక, ఎలక్ట్రికల్, పారిశుద్ధ్య విభాగాల అధికారులు దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. అందరూ వినాయక చవితి పర్యావరణహితంగా జరుపుకోవాలని కమిషనర్ సూచించారు.
సమస్యలతో బాధపడే మహిళలకు అధికార యంత్రాంగం అండగా ఉండాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో ఆమె మహిళల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. 54 మంది మహిళలు తమ సమస్యలను వివరించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు న్యాయపరమైన సేవలు అందించాలన్నారు. భరణం వచ్చేలా చూడాలని, స్వయం ఉపాధి కోసం సహకరించాలని కోరారు.
జీవీఎంసీ పరిధిలోని అన్ని ఆసుపత్రులు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (C.R.S.) పోర్టల్ లో జనన, మరణ వివరాలను నమోదు చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. దీనికోసం జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం నుండి యూజర్ ఐడీలను తీసుకోవాలన్నారు. దీనివల్ల జనన, మరణ ధ్రువపత్రాలు జారీ సులభం అవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పేరుతో జనన ధ్రువపత్రాలు తీసుకోవాలన్నారు.
తూర్పు నౌకాదళంలో 2 యుద్ధ నౌకలు ప్రారంభించేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, సీపీ శంఖబ్రత బాగ్చీ, నేవీ తూర్పు నౌకదళ ప్రధాని అధికారి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడికి చేరుకొని 2 యుద్ధ నౌకలను మంత్రి ప్రారంభిస్తారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్లాంట్ నష్టాలకు కారణాలను వివరించారు. ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి చేయడానికి టన్నున్నర ముడిసరుకు అవసరం అన్నారు. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడమే నష్టాలకు ప్రధాన కారణం అన్నారు.
VMRDA పరిధిలో తాజాగా 550 అనధికార లేఅవుట్లను గుర్తించామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీటికి ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ పాట్రన్ (I.P.L.P) తయారు చేయాల్సి ఉందన్నారు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (L.R.S) ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి, అనధికార లేఅవుట్ల జాబితాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం విశాఖ వచ్చిన జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డా.అర్చనా మజుందార్కి కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్చి, ఇతర అధికారులతో కలిసి బాధిత మహిళల నుంచి మజుందార్ వినతులు స్వీకరిస్తున్నారు.
విశాఖను సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. నగరంలో పలు చోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ఆకర్షణీయ చిత్రాలు, బొమ్మలు తీర్చి దిద్దుతున్నారు. ఇక్కడి వరకు అధికారులు ప్రజల నుంచి మన్ననలు అందుకుంటున్నా తర్వాత వాటి అతీగతి పట్టించుకోవడంలేదని విమర్శలు మూటగట్టుకున్నారు. డెయిరీ ఫారం, ఆదర్శనగర్ కూడలిలో ఓ బొమ్మ చేయి విరిగి అధ్వానంగా ఉన్నా పట్టించుకున్న దాఖలాలులేవని మండిపడ్డుతున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్లో సోమవారం 110 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.