India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ స్వయం ఉపాధి పథకం కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ కార్పోరేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ షం సున్నిషా బేగం శనివారం తెలిపారు. ఈ పథకం కింద మైనారిటీలకు రూ.లక్ష నుంచి 8 లక్షల రుణంలో 50% సబ్సిడీ మంజూరు చేయబడుతుందన్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలలో 21- 55 ఏళ్ల మధ్య బీపీఎల్కు చెందిన వారు మే 25 లోపు https://apobmms.apcfss.in ఈ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం 2025-26 కింద జిల్లా నుంచి 12,138 మంది లబ్ధి పొందారు. ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున మొత్తం రూ.24,27,60,000ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మెగా చెక్కును లబ్ధిదారులకు శనివారం అందజేశారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో శనివారం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

GVMCలో ఈనెల 28న జరగనున్న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం తెలిపారు. మేయర్ ఎన్నిక సోమవారం కానున్నందున GVMC ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. GVMC జోనల్ కార్యాలయాల్లో యథావిధిగా PGRS ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై జోనల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాలన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

విశాఖ పోర్ట్ కళ్యాణ మండపంలో శనివారం 15వ రోజ్గార్ మేళా నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆయన చేతులు మీదుగా 278 మంది అభ్యర్థులకు కేంద్ర నియామక పత్రాలను అందజేశారు. ప్రభుత్వ సేవ, జీవితపు కొత్త ప్రయాణంలో పెద్ద లక్ష్యాలను సాధించడానికి అదే ఉత్సాహంతో పనిచేయాలని వారిని కోరారు. సమాజానికి ఆదర్శంగా ఉండాలని మంత్రి సూచించారు.

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన నిమిత్తం శనివారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్లో ఎంపీ శ్రీ భరత్,ఎమ్మెల్యే గణబాబు, సీపీ శంఖ బ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ స్వాగతం పలికారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు శ్రీకాకుళం వెళ్లారు. మరల సాయంత్రం విశాఖలో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.

విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసంలో కూటమి నెగ్గటంతో ఆశావాహులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మేయర్ పదవి TDPకి డిప్యూటీ మేయర్ జనసేనకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే డిప్యూటీ మేయర్ కోసం పలువురు TDP మహిళా కార్పొరేటర్ల భర్తలు లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు కొత్తగా కూటమిలో చేరిన వారు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. మరి విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి వస్తుందో కామెంట్ చెయ్యండి.

జీవీఎంసీలో డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూటమి నెగ్గింది. 74 ఓట్లతో అవిశ్వాసంపై ఓటింగ్ సాధించి విజయకేతనం ఎగురవేసింది. సరిగ్గా వారం క్రితం మేయర్పై అవిశ్వాసం గెలిచిన కూటమి ప్రభుత్వం నేడు డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాసం కూడా గెలిచింది. దీంతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

విశాఖ డిప్యూటీ మేయర్ జీయ్యని శ్రీధర్పై నేడు అవిశ్వాసం ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో ఈ అవిశ్వాసం ఉండనుంది. అయితే ఇప్పటికే కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో సభ్యులకు జిల్లా కలెక్టర్ అవిశ్వాసం ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే జీవీఎంసీ మేయర్ పీఠంను కూటమి కైవసం చేసుకోవడంతో, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం నెగ్గుతామని కూటమి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, మంజూరు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పలు అవకతవకలు జరిగాయని పలువురు విశాఖ ప్రజా ప్రతినిధులు మంత్రి డోలా బాల వీరాంజనేయులు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ చేయించాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు మంత్రి సూచించారు. నిజనిర్ధారణ చేయాలని, అవకతవకలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తలసేమియా బాధితులు కోసం మే 8న విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో 3k,5k,10k రన్ నిర్వహించనున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. తలసేమియాపై అవగాహన కలిగించేందుకు విశాఖ వేదికగా ఈ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరూ 4నెలలకు ఒకసారి రక్తదానం చేసి, వారికి భరోసా కల్పిద్దామని భువనేశ్వరి అన్నారు.
Sorry, no posts matched your criteria.