India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చట్టాలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టేది లేదని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. సోమవారం ఓ కోర్టు కేసుకు సంబంధించి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రెడ్ బుక్కును చూసి ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు చట్టాలను ఉల్లంఘించే ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని నోవాటెల్ హోటల్లో పర్యాటక పెట్టుబడిదారుల ప్రాంతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ బాలాజీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. ఈ సదస్సులో వ్యాపారవేత్తలతో టూరిజంలో పెట్టుబడులపై చర్చించనున్నారు.
విశాఖలో మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈరోజు మీరెవ్వరూ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగలేదని రిపోర్టర్లను ఎదురు ప్రశ్న వేశారు. విశాఖ వచ్చినప్పుడుల్లా మొన్నటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటూ ఫస్ట్ మీడియా మిత్రులు బుల్లేట్ దింపేవారని అన్నారు. ఆనాడు చెప్పిన విధంగా ప్రైవేటీకరణ జరగనివ్వమన్న మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
విశాఖ పోలీస్ శాఖలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దువ్వాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎం.రవి గుండెపోటుతో మృతి చెందాడు. విధులకు వెళుతుండగా మార్గమధ్యలో ఆయనకు గుండెపోటు రాగా.. వెంటనే అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు పోలీసు సిబ్బంది ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
విశాఖలో సోమవారం ఉదయం 10 గంటలకు ఓ పత్రికపై పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు అవుతారు. సాయంత్రం టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను కలవనున్నారు. సాయంత్రం 6 గం.లకు గాజువాక నియోజకవర్గం, గ్రీన్ సిటీ కాలనీలోని శ్రీవైభవ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉండవల్లి వెళ్లనున్నారు.
విశాఖలో కిడ్నీ ఆసుపత్రి నిర్వహిస్తున్న డా.రాజశేఖర్ను చెన్నైలో హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారం రోజులుగా హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా నడుస్తున్న కిడ్నీ రాకెట్పై పోలీసులు దృష్టి సారించారు. ఈ రాకెట్లో విశాఖకు చెందిన డా.రాజశేఖర్ ఓ ముఠాను ఏర్పాటు చేసి కిడ్నీల మార్పిడికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతనిని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు.
తగరపువలసలోని ఆదర్శనగర్లో పురుగుమందు తాగిన ఘటనలో <<15257483>>విషాదం <<>>చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఇషిత(5) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల భార్యాభర్తల గొడవతో మనస్తాపం చెందిన వివాహిత మాధవి(25) ఇద్దరి కుమార్తెలతో పాటు పురుగు మందు తాగిన విషయం తెలిసిందే. దీంతో మాధవితో పాటు చిన్న కుమార్తె శనివారం మృతి చెందింది. మృతిరాలి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగా పనిచేస్తున్నాడు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యరావు, రాజకీయ ప్రముఖులు, నేవీ అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆకట్టుకున్నాయి.
విశాఖలోని ఆశీల్మెట్టలో యువకుడి మృతదేహం లభ్యమైంది. త్రీ టౌన్ ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఓ స్కూల్ గేట్ ఎదురుగా మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారని తెలిపారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఎస్ఐ సురేష్ కోరారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ పోలీస్ భారక్స్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా నుంచి 446 మందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అందులో 28 మంది జిల్లా స్థాయి అధికారులకు పురస్కారాలు దక్కాయి. వారిలో VMRDA కమీషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ,ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్ ఇమ్మడి పృథ్వీతేజ్, డిప్యూటీ కలెక్టర్లు కె.సంగీత్ మాథుర్, సుధాసాగర్ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.