Visakhapatnam

News July 6, 2024

ఎలమంచిలి: మురికి కాలువలో మృతదేహం లభ్యం

image

ఎలమంచిలిలోని నాగేంద్ర కాలనికి చెందిన లక్ష్మణ్ రావు(40)రెండు రోజుల క్రితం స్థానిక మురికికాలువలో ప్రమాదవశాత్తు పడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం నీటి ప్రవాహం తగ్గటంతో కాలువలో ఆయన మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ చెల్లారావు పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య లక్ష్మి, ఓ కుమారుడు ఉన్నాడు.

News July 6, 2024

విశాఖ-కిరండూల్-విశాఖ రైళ్లు రద్దు

image

వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో కె.కె.లైనులో భద్రతకు సంబంధించి ఆధునీకరణ పనులు జరుగుతున్న కారణంగా విశాఖ-కిరండూల్-విశాఖ రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. 8న విశాఖ-కిరండూల్, 9న కిరండూల్-విశాఖ రైలును రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News July 6, 2024

స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు రూ.3 కోట్ల ఆర్థిక సాయం

image

పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం పాడేరు మండలంలోని 75 స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు రూ.3 కోట్ల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ చెక్కు రూపంలో అందజేశారు. ఆర్థిక సాయాన్ని స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. వారపు సంతల్లో కూరగాయలు, బట్టల వ్యాపారం చేసుకుంటామని స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు.

News July 5, 2024

ఈనెల 8న ఇసుక విక్రయాలు ప్రారంభించాలి: కలెక్టర్

image

ఈనెల 8న ఇసుక విక్రయాలు ప్రారంభించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చింతూరు డివిజన్ గుండాల-1 రీచ్‌లో 87,800 టన్నులు, గుండాల-2 రీచ్‌లో 79,026 టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. సీనరేజ్ టన్నుకు రూ.88 మాత్రమేనని, మిగిలినవి లోడింగ్, పరిపాలనా ఛార్జీలు, జీఎస్‌టీ ఛార్జీలు నిబంధనల మేరకు చెల్లించాలన్నారు.

News July 5, 2024

అనకాపల్లి: చెరువు ఊబిలో కూరుకుపోయి కూలీ మృతి

image

వ్యవసాయ కూలీ స్నానం కోసం చెరువులో దిగి ఊబిలో కూరుకుపోయి శుక్రవారం మృతి చెందారు.‌ నక్కపల్లి మండలం ఎన్.నరసాపురానికి చెందిన బాల సత్తిబాబు(56) ఉపమాక గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్లారు. పని ముగించుకుని వచ్చే సమయంలో పక్కనే ఉన్న చెరువులో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ఊబిలో కూరుకుపోయారు. గమనించిన తోటి కూలీలు బయటికి తీసి చూసేసరికి అప్పటికే మృతిచెందారు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 5, 2024

విశాఖ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

image

అగ్నివీర్ వాయు స్కీంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరేందుకు అవివాహితులైన పురుష, స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే.శాంతి తెలిపారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 28వ తేదీ రాత్రి 11 గంటల వరకు https://agnipathvayu.cdac.inలో అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News July 5, 2024

క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోండి: క్రీడాభివృద్ది అధికారి

image

పాడేరు: కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ అవార్డుల కోసం అర్హులైన క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోవాలని అల్లూరి జిల్లా క్రీడాభివృద్ది అధికారి జగన్మోహన్ రావు శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈ దరఖాస్తులకు అర్హులన్నారు. అర్హత గల క్రీడాకారులు ఆగష్టు 1వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుని, విజయవాడలోని క్రీడా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News July 5, 2024

విశాఖలో సందర్శనకు ‘కల్కి’ బుజ్జి

image

కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన బుజ్జి వాహనాన్ని విశాఖలో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. శుక్రవారం విశాఖ వ్యాలీ స్కూల్ ప్రాంగణంలో దీన్ని ఉంచారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ వాహనం వద్ద నిలుచుని ఫొటోలు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కల్కి సినిమాలో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాహనాన్ని దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వాహకులు సందర్శనకు వీలుగా ఉంచుతున్నారు.

News July 5, 2024

విశాఖ: సచివాలయ సేవల్లో జాప్యం..?

image

గ్రామ సచివాలయానికి సంబంధించిన సేవల్లో గత వారం రోజులుగా జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు అంటున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ వివిధ సర్టిఫికెట్ల జారీ, దరఖాస్తులు చేసుకునే ప్రక్రియలు సిబ్బంది నిలిపి వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు వివిధ సర్టిఫికెట్ల కోసం సచివాలయాలు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. అదే సమయంలో భూములకు సంబంధించిన మ్యుటేషన్ సంబంధించిన పనులు కూడా జరగడం లేదని సమాచారం.

News July 5, 2024

విశాఖ: డీసీఐకి రూ.156.5 కోట్లతో ఒప్పందం

image

ప్రతిష్ఠాత్మకమైన కొచ్చిన్ పోర్టు అథారిటీ‌తో రూ. 156.50 కోట్ల విలువైన డ్రెడ్జింగ్ ఒప్పందం కుదిరినట్లు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఛైర్మెన్ అంగముత్తు తెలిపారు. డ్రెడ్జింగ్ పరిశ్రమల్లో డీసీఐ అగ్రగామిగా ఉందన్నారు. భారీస్థాయి డ్రెడ్జింగ్ ప్రాజెక్టులను అమలు చేయడంలో మంచి రికార్డు ఉందని వెల్లడించారు. ఈ ఒప్పందం డీసీఐ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.