Visakhapatnam

News July 5, 2024

విశాఖ జూకు చేరిన కొత్త అతిథులు

image

విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు గుజరాత్‌లోని జామ్‌న‌గర్ రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి గ్రీన్ వింగ్ మకావ్, స్క్విరెల్ మంకీస్ తదితర వాటిని జంతువులు వచ్చాయి. గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో ఇవి విశాఖకు చేరుకున్నాయి. జంతువులను పరస్పరం మార్చుకునే విధానంలో ఇక్కడకు జంతువులను తీసుకువచ్చారు. కొత్త జంతువులను కొద్దికాలం క్వారంటైన్ అనంతరం సందర్శకులకు అందుబాటులో ఉంచుతారు.

News July 5, 2024

విశాఖ: యూపీఎస్సీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

image

యూపీఎస్సీ ఈ నెల 7న నిర్వహించబోతున్న ఈపిఎఫ్ఓ, ఈఎస్ఐసి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డీఆర్ఓ కె.మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. యూపీఎస్సి నియమించిన పరిశీలకులు విశాఖలో పరీక్షా కేంద్రాలను ఈనెల 6న పరిశీలిస్తారన్నారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు, సూపర్ వైజర్లు పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విశాఖ కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

News July 4, 2024

సింహగిరి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టర్ పర్యవేక్షణ

image

సింహాచల గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హారేంధిర ప్రసాద్ గురువారం పర్యవేక్షించారు. ఈనెల 20న గిరిప్రదక్షిణ జరగనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆరా తీశారు. సింహాచలం తొలి పావంచ వద్ద అధికారులతో మాట్లాడారు. పర్యటనలో ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News July 4, 2024

విశాఖ: నాటు తుపాకీతో వీధి కుక్కను కాల్చి చంపాడు

image

కొండపాలెంలో నాటు తుపాకీతో వీధి కుక్కను కాల్చి చంపిన యాదగిరి నూకరాజును, అతనిని తీసుకువచ్చిన పెద్దాడ శ్రీనివాసరావును అరెస్టు చేశామని బుచ్చయ్యపేట ఎస్సై డి.ఈశ్వరరావు తెలిపారు. గ్రామంలోని వీధి కుక్క నాటు కోళ్లను తినేస్తోందని శ్రీనివాసరావు అనే వ్యక్తి కేపి. అగ్రహారానికి చెందిన నూకరాజును తీసుకువచ్చి అతని వద్ద ఉన్న నాటు తుపాకీతో వీధి కుక్కని కాల్చి చంపినట్లు స్థానిక వీఆర్వో ఫిర్యాదు చేశారన్నారు.

News July 4, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పెందుర్తి-పినగాడ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన మధు (30) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి దేవరాపల్లి మండలం అలమండ గ్రామానికి చెందిన యువతితో ఏడాదిన్నర కిందట పెళ్లిజరిగింది. వీరికి ఓ పాప ఉంది. ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది.

News July 4, 2024

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటూ జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా శాఖాపరంగా పథకాల అమలు, వాస్తవ పరిస్థితులు, పెండింగ్ అంశాలను తన దృష్టికి తీసుకురావాలన్నారు.

News July 4, 2024

ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గడువు పెంపు

image

ఏయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో విద్యను అభ్యసిస్తున్న వారు పరీక్షల దరఖాస్తుకు ఈనెల 10వ తేదీలోగా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం సంచాలకులు ఆచార్య ఎన్.విజయమోహన్ తెలిపారు. రూ.5 వేల అపరాధ రుసుముతో తత్కాల్ విధానంలో ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసిన వారికి విశాఖలో పరీక్షలు నిర్వహిస్తారు.

News July 4, 2024

విశాఖ ఐఐఎంలో పెరిగిన మహిళల ప్రవేశాలు

image

ఆనందపురం మండలంలోని గంభీరంలో ఉన్న విశాఖ ఐఐఎంలో మహిళల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయని యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. రెండేళ్ల రెసిడెన్షియల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్ మెంట్ ప్రోగ్రాం కింద 338 మంది ప్రవేశాలు పొందగా అందులో 135 మంది మహిళలే ఉన్నారన్నారు. అన్ని ఐఐఎంలు సగటు కంటే ఇక్కడ 10 శాతం మహిళలే ఎక్కువని తెలిపారు. ఇక్కడ ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రకు చెందిన వారే ప్రవేశాలు పొందుతున్నారని చెప్పారు.

News July 4, 2024

త్వరలో విస్తృతస్థాయి సమావేశాలు: గుడివాడ

image

కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికి త్వరలో విస్తృతస్థాయి సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామన్న ఆయన.. మళ్లీ ప్రజాభిమానాన్ని సంపాదిస్తామని పేర్కొన్నారు. అలాగే ఈనెల 8న జరిగే వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతికి విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు.

News July 4, 2024

గిరి ప్రదక్షిణ రూట్ పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

image

వచ్చే నెలలో నిర్వహించే సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదిక్షణ రూట్‌ను జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ ఇంజనీర్ అధికారులతో పరిశీలించారు. గిరి ప్రదక్షిణ రోజున లక్షల సంఖ్యలో ప్రజలు సింహాద్రి అప్పన్నతో గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రహదారిని చదును చేయాలని సూచించారు.