Visakhapatnam

News March 8, 2025

విశాఖ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు: డీఈవో 

image

విశాఖ జిల్లాలో పాఠశాలలకు రేపు (రెండో శనివారం) సెలవు యథావిధిగా కొనసాగుతుందని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యా సంవత్సరంలో నిర్దిష్టంగా 220 రోజులు పాఠశాలలు తెరవాల్సి ఉండడంతో తొలుత సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని సెలవు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

News March 7, 2025

జన ఔషది కేంద్రాన్ని సందర్శించిన విశాఖ ఎంపీ

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మధురవాడలో జన ఔషది దివస్ కేంద్రం వద్ద జనరిక్ మందుల వాడకంపై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొని జనరిక్ మందుల గూర్చి అన్ని విషయాలను ప్రజలకు అవగాహన కలుగజేసే గోడపత్రికను ఆవిష్కరించారు. జన ఔషది కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లాలో ప్రారంభించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు. DMHO జగదీశ్వరరావు ఉన్నారు.

News March 7, 2025

విశాఖ మహిళలను సత్కరించనున్న మంత్రి

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని సిరిపురంలోని చిల్డ్రన్స్ ఏరీనాలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి హాజరుకానున్నారు.‌ ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ రంగాలలో ప్రతిభ చూపిన మహిళలను సత్కరిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు పోటీలు నిర్వహిస్తామన్నారు.

News March 7, 2025

విశాఖలో 12 మందితో సైబర్ టీం 

image

సైబర్ నేరాలను అరికట్టేందుకు విశాఖ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని సైబర్ నేరాలు నివారించేందుకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీ కొత్తగా టీం ఏర్పాటు చేశారు. కంప్యూటర్ నైపుణ్యం ఉన్న 12 మందిని ఎంపిక చేసి బి-కేటగిరిలో హోంగార్డు నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. వీరందరి సహకారంతో సైబర్ నేరాలపై అవగాహన, నియంత్రణ చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో డీసీపీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

News March 7, 2025

విశాఖ ప్రజలు సహకరించాలి: కలెక్టర్

image

విశాఖలో రేపటి నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా P-4 సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శుక్రవారం తెలిపారు. పేదరికం లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా ఈ సర్వే రూపకల్పన చేశామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది 27 అంశాలతో సర్వే చేయనున్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా దిగువ స్థాయి కుటుంబాలను గుర్తించేందుకు ఇంటింటికీ వచ్చే సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ తెలిపారు.

News March 7, 2025

చందనోత్సవాన్ని విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే గంటా

image

ప్రభుత్వానికి పేరు తెచ్చేలా సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్న దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కె.సుబ్బారావు శుక్రవారం ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏప్రిల్ 30న జరగనున్న చందనోత్సవాన్ని సవాలుగా తీసుకుని జిల్లా యంత్రాంగం సహకారంతో విజయవంతం చేద్దామన్నారు.

News March 7, 2025

కైలాసగిరిలో అదుపులోకి వచ్చిన మంటలు: ప్రణవ్ గోపాల్ 

image

కైలాసగిరిపై రోప్ వే సిబ్బంది వ్యర్థాలను తగలబెట్టడం వల్లే మంటలు వ్యాపించాయని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ (ఎంసీ) కేఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. తక్షణమే మంటలను అదుపు చేయాలని వీఎంఆర్డీఏ అటవీ విభాగం అధికారులను ఆదేశించామన్నారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా రప్పించామని, మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు.

News March 7, 2025

విశాఖ: నేటి నుంచి ఇంటర్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం

image

నేటి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు రీజినల్ అధికారి మురళిదర్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ మహిళ కాలేజీలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సంస్కృతం పేపర్ మూల్యాంకనం చేయనున్నారు. వీటి కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 20వరకు ఉండనున్నాయి.

News March 7, 2025

విశాఖపట్నం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. విశాఖ ప్రజలు ఎక్కువగా అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అనకాపల్లిలో వివిధ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం వెళ్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా అనకాపల్లి వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ కామెంట్.

News March 7, 2025

గాజువాక: రోడ్డు ప్రమాదంలో సచివాలయం ఉద్యోగి మృతి

image

సచివాలయ ఉద్యోగి డాక్ యార్డ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూర్మన్నపాలెం సచివాలయం-1 మహిళా పోలీస్‌గా పనిచేస్తున్న మీను స్కూటీపై తన కుమార్తెతో నగరానికి వెళ్లి తిరిగి వస్తుండగా మారుతి సర్కిల్ సమీపంలో లారీని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.