India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ-పలాస రైల్వే లైన్లో సాంకేతిక సమస్యల కారణంగా విశాఖ-పలాస పాసింజర్ (67289/90)శ్రీకాకుళం వరకు మాత్రమే నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. మార్చ్ 9 నుంచి మార్చ్ 16 వరకు(శుక్రవారం, ఆదివారం మినహాయించి) ఈ రైళ్ళు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి పది మంది ఖైదీలు రెగ్యులర్ గాను, మరో ఐదుగురు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీరిలో నలుగురు ఖైదీలు రాజమండ్రి జైలుకు ట్రాన్స్ఫర్ కాగా మిగిలినవారు పరీక్షలు రాస్తున్నారు. వీరికి జైలు ప్రాంగణంలో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశీలకులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జైలు సూపరిండెండెంట్ మహేశ్ బాబు తెలిపారు.
విశాఖ నుంచి బరంపూర్ వెళ్లే విశాఖ – బరంపూర్ ఎక్స్ప్రెస్ (18526/25) మూడు రోజులపాటు రద్దు చేసినట్టు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. కుర్దా డివిజన్లో ఆపరేషనల్ పనులు నిమిత్తం రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. మార్చ్ 6,7వ తేదీలో విశాఖ నుంచి బరంపూర్ వెళ్లే రైలు, మార్చి 7,8 తేదీల్లో బరంపూర్ నుంచి విశాఖ వచ్చే రైలు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
➤ చిన్న వయసులోనే 175 సర్టిఫికెట్ కోర్సులు➤ విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ➤ విశాఖలో రేపే మద్యం దుకాణాల వేలం➤ తాటిచెట్లపాలెం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి➤ సింహాచలం దేవస్థానం హుండీ ఆదాయం రూ.1,85,22,270 ➤ రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు ➤విశాఖలో 29.2 కిలో మీటర్ల మేర ఇంటర్నల్ రోడ్లు నిర్మాణం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్రమంత్రికి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ముఖ్య అధికారులు, బీజేపీ నాయకులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.
గాజువాక సమీపంలో గల కాపు జగ్గరాజుపేట STBL వసుంధర గార్డెన్స్లో చోరీ జరిగింది. ఉమ అనే మహిళ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వసుంధర గార్డెన్స్లో నివాసం ఉంటున్న ఉమ తన తల్లిని చూసేందుకు వెళ్లి రాత్రి అక్కడే ఉండిపోయింది. బుధవారం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులకొట్టి ఉన్నాయని, సుమారు 75 తులాలు బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ జరిగేలా రుషికొండ బీచ్లో యుద్ధప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన రుషికొండ బీచ్ను సందర్శించారు. పరిశసరాల్లో కలియతిరిగిన ఆయన అక్కడ పరిస్థితులను గమణించారు. పర్యాటకుల వాహనాల పార్కింగ్ పరిశీలించారు. దుకాణాల సముదాయాలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో విశాఖలో గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణలకు వేలం నిర్వహించనున్నారు. మార్చి 6న ఉడా చిల్డ్రన్ ఏరినాలో ఉదయం 9 గంటలకు వేలం జరగనుంది. అయితే ఫిబ్రవరి 11న వేలం నిర్వహించాల్సి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో వాయిదా వేశారు. జిల్లాలో 14 మద్యం దుకాణలకు గాను 316 దరఖాస్తులు వచ్చాయని గతంలో అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కొమ్మాదిలోని దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుపై విశాఖ జేసీ మాయూర్ అశోక్ సమీక్షించారు. ఈ మేరకు కొమ్మాది ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న స్థలాన్ని బుధవారం పరిశీలించారు. 22 ఎకరాల్లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మూడు నెలల్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయనతో పాటు విశాఖ రూరల్ తహశీల్దార్ కిరణ్ పాల్ తదితులు ఉన్నారు.
విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలో ఆరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇతర నాయకులతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక తేదీ ప్రకటిస్తామన్నా. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాలూ మద్దతు ఇవ్వాలని కోరారు.
Sorry, no posts matched your criteria.