India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాటిచెట్లపాలెం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన యాక్సిడెంట్లో మృతుల వివరాలను కంచరపాలెం ట్రాఫిక్ సీఐ దాశరథి తెలిపారు. మృతుల్లో ఒకరు కంచరపాలేనికి చెందిన యళ్వంత్గా గుర్తించామన్నారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు. వీరిద్దరూ వాడపేట పండక్కి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. గాజువాక నుంచి భోగాపురం వయా మద్దిలపాలెం, మధురవాడ మీదుగా 34.6 కి.మీ మేర <<15657173>>మెట్రో నిర్మాణానికి <<>>ప్రతిపాదనలకు కేంద్రానికి పంపామన్నారు. పనులు ప్రారంభమయ్యాక నాలుగేళ్లలో పూర్తవుతుందన్నారు. ఏహెచ్ 45 నుంచి ఎన్హెచ్ 16 వరకు 6 రోడ్లు ప్లాన్ చేశామన్నారు. వీటిని ఏడాదిన్నరలోపు ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
కోనెంపాలెంకు చెందిన బండారు ప్రవల్లిక భీమిలి మండలం గొల్లలపాలెం KGBVలో 10వ తరగతి చదువుతుంది. ఈమె చిన్న వయసులోనే 175 సర్టిఫికెట్ కోర్సులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్ఫోసిస్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫారంలో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్స్,ఏఐ వంటి వివిధ సర్టిఫికెట్ కోర్సులు చేసిందని ప్రిన్సిపల్ గంగాకుమారి తెలిపారు. ఛైర్మన్ చందపరపు కుమార్, ఇతర సిబ్బంది చిన్నారిని అభినందించారు.
విశాఖలోని తాటిచెట్లపాలెం వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంచరపాలెం స్టేషన్ పరిధిలోని బైక్పై అతివేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖకు సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం రానున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు రాత్రి 11:40కి విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకొని అక్కడ నుంచి రామ్ నగర్లో టీడీపీ కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. కేంద్ర మంత్రి ఈరోజు రాత్రి 8:40కు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకోనున్నారు. ఆమెకు హోం మంత్రి అనిత స్వాగతం పలకనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. గురజాడ కళాక్షేత్రం వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల తరఫున చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.
➤ విశాఖలో ఎన్నికల కోడ్ ఎత్తివేత: కలెక్టర్
➤ దివ్యాంగుల పారా స్టేడియం కోసం స్థల పరిశీలన
➤ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు స్టేడియం సిద్ధం
➤ మార్చి 17 నుంచి 134 కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు
➤ నేడు విద్యుత్ ప్రధాన కార్యాలయంలో లైన్మ్యాన్ దివస్
➤ రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా చర్యలు
ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెలలో జరగబోయే రెండు ఐపీఎల్ మ్యాచులు విశాఖకు గర్వకారణంగా నిలిచేలా నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మంగళవారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో చేపట్టిన ఆధునీకరణ పనులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్తో కలిసి పరిశీలించారు. మార్చి 24న ఢిల్లీ -లక్నో, మార్చి 30న ఢిల్లీ -సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరగనున్నాయి.
విశాఖలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు.రాష్ట్రంలో వివిధ చోట్ల గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడటం, ఇతర ప్రక్రియలు ముగియటంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేసినట్లు మంగళవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏయూ తరఫున పాల్గొని 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి గోల్డ్ మెడల్, 76 కిలోల విభాగంలో బి.జాన్సీ బ్రాంజ్ మెడల్ సాధించారు. అదేవిధంగా ఖేలో ఇండియా యూనివర్శిటి పోటీల్లో 71 కిలోల విభాగంలో ఎస్.పల్లవికి సిల్వర్ మెడల్, సీహెచ్ శ్రీలక్ష్మికి 87 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. వీరిని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ అభినందించారు.
Sorry, no posts matched your criteria.