Visakhapatnam

News June 26, 2024

విశాఖ ఇగ్నోలో కొత్త ఎంబీఏ కోర్సులు ప్రారంభం

image

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎంబీఏలో నూతన కోర్సులను ఆవిష్కరిస్తున్నట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ధర్మారావు తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హెల్త్ కేర్ హాస్పిటల్, మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ ఇలాంటి అంశాలతో కోర్సులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ కోర్సులకు రెండు సంవత్సరాల వ్యవధిగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

News June 25, 2024

టాలీవుడ్ స్టోరీస్ C/O ఉత్తరాంధ్ర

image

ఉత్తరాంధ్రలో జరిగిన యధార్థ సంఘటనలే కథలుగా వెండితెరపై అలరిస్తున్నాయి. ఇటీవల పలాస, జయమ్మ పంచాయతీ, కోటబొమ్మాళి లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తాజాగా..పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న సిక్కోలు మత్స్యకారుడి స్టోరీలో నాగచైతన్య-సాయి పల్లవి నటిస్తున్నారు. రామ్‌చరణ్-బుచ్చిబాబు సినిమాకు కోడి రామ్మూర్తి జీవిత చరిత్రే ఆధారమని టాక్. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

News June 25, 2024

భీమిలి: 4 రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు మృతి

image

భీమిలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రేబిస్‌తో కుమారుడు మృతి చెందిన నాలుగు రోజులకే తండ్రి బెంగతో మంగళవారం మృతి చెందాడు. ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్న అల్లిపల్లి నర్సింగరావుకు పిల్లలు లేకపోవడంతో అబ్బాయిని పెంచుకున్నాడు. అతడిని ఇంట్లో ఉన్న కుక్క కరిచింది. దానిని నిర్లక్ష్యం చేయడంతో ఆ అబ్బాయి రేబిస్ సోకి మృతి చెందాడు. దీంతో బెంగ పడిన నర్సింగరావు ప్రాణాలు విడిచారు.

News June 25, 2024

సంత్రాగచ్చి-విశాఖ రైలు రీ షెడ్యూల్

image

సంత్రాగచ్చి-విశాఖ రైలును రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సంత్రాగచ్చిలో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 8.20 గంటలకు బయలుదేరుతుందని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన రైలు ఆలస్యంగా వస్తుండడంతో దీనిని రీ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News June 25, 2024

దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌గా ఆచార్య విజయమోహన్

image

ఆంధ్రవిశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం సంచాలకుడిగా ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం సీనియర్ ఆచార్యులు ఎన్.విజయ్ మోహన్ నియమితులయ్యారు. ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి నియామక ఉత్తర్వులను ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య విజయ్ మోహన్‌ను విభాగ ఆచార్యులు, ఉద్యోగులు అభినందించారు.

News June 25, 2024

ఆల్ ది బెస్ట్ బ్రదర్: మంత్రి లోకేశ్

image

ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా ఇండియా టీ-20 టీంకు ఎంపికైన నితీశ్ కుమార్‌కు మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. వచ్చే నెలలో జింబాబ్వేలో జరిగే టీ-20 మ్యాచ్‌లో ఆడనున్న నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటి క్రికెట్‌లో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఐపీఎల్‌‌‌లో నితీశ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచనట్లు పేర్కొన్నారు.

News June 25, 2024

ఏయూ పరీధిలోని MA పరిక్షా ఫలితాల విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని MA సంస్కృతం, MA ఇంగ్లీష్, MA తెలుగు, MA హిందీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ – సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షల విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచామని చెప్పారు.

News June 25, 2024

సముద్ర ఉత్పత్తుల రవాణాలో విశాఖ పోర్టు మొదటి స్థానం

image

సముద్ర ఉత్పత్తుల రవాణాలో విశాఖ పోర్టు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పోర్టు కార్యదర్శి టీ.వేణుగోపాల్ తెలిపారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రూ.17,983 కోట్ల విలువ చేసే 3,14,199 టన్నుల సముద్ర ఉత్పత్తులను రవాణా చేసి ఈ రికార్డు సాధించినట్లు పేర్కొన్నారు. విశాఖ పోర్టు 132 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో అమెరికా, చైనా ప్రధాన ఎగుమతి దారులుగా ఉన్నట్లు తెలిపారు.

News June 25, 2024

విశాఖ: 13.5 కిలోల గంజాయి స్వాధీనం

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు 13.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రైల్వే స్టేషన్‌లో నిర్వహిస్తున్న తనిఖీల్లో హర్యానా రాష్ట్రంలోని పల్వాల్ జిల్లాకు చెందిన యోగేంద్ర అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. అతని వద్ద తనిఖీ చేయగా లభించిన గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

News June 25, 2024

విశాఖ: ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు

image

విశాఖ – విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేయడంతో ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ద్వారక బస్ స్టేషన్ నుంచి 12 ప్రత్యేక సర్వీసులు, శ్రీకాకుళం విజయనగరం నుంచి మరో మూడు ప్రత్యేక సర్వీసులు విజయవాడకు నడుపుతామని తెలిపారు. వందే భారత్ రైలు ప్రయాణికుల కోసం విశాఖ నుంచి విజయనగరానికి రాత్రి వేళల్లో ప్రత్యేక బస్ సర్వీసు ఏర్పాటు చేశామన్నారు.