Vizianagaram

News August 12, 2025

నేడు 3.60 లక్షల మందికి అల్బెండజోల్ మాత్రలు: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ళ మధ్య పిల్లలు, విద్యార్ధులు 3,60,000పై బడి ఉన్నారని, వీరందరికీ అల్బెండజోల్ మాత్రలు మంగళవారం మింగించాలని కలెక్టర్ అంబేద్కర్ సూచించారు. కలెక్టరేట్లో నేషనల్ డే వార్మింగ్ డే పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. మధ్యాహ్న భోజనం చేసిన అర గంట తర్వాత మాత్రలు మింగించాలన్నారు. ఏడాది వయసు వారికి అరముక్క, 2-19 ఏళ్ల వారికి పూర్తి మాత్ర వేయాలన్నారు.

News August 12, 2025

జిల్లా వ్యాప్తంగా 200 గ్రామ స్థాయి సమావేశాలు: కలెక్టర్

image

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా రానున్న రెండు నెలలు వివిధ అంశాలపై 200 గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. సోమవారం తన ఛాంబర్లో కరపత్రాలు ఆవిష్కరించారు. హెచ్ఐవీ, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, మాదకద్రవ్య దుర్వినియోగం, తదితర వాటిపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. 20 సైకిల్ ర్యాలీలు, 700 హౌస్ హోల్డ్ కార్యకలాపాలు, 40 ప్లాష్ మాబ్ లు నిర్వహిస్తామన్నారు.

News August 12, 2025

ఈనెల 14న విజయనగరం జిల్లా సమీక్షా సమావేశం: కలెక్టర్

image

ఈనెల 14న విజయనగరం జిల్లా సమీక్షా సమావేశం (డిఆర్సి) జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల, వ్యవసాయం, అనుబంధ శాఖలు, వైద్య ఆరోగ్యం, త్రాగునీటి సరఫరా తదితర కీలక శాఖలపై చర్చించడం జరుగుతుందని వెల్లడించారు.

News August 11, 2025

మహిళ ఫ్రీ బస్.. విజయనగరం జిల్లాలో ఎన్ని బస్సులంటే

image

“శ్రీ శక్తి పధకం” ద్వారా ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్ సర్వీసులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి జి. వరలక్ష్మి అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 160 బస్సులు నడుస్తున్నాయన్నారు. అందులో పల్లెవెలుగు-108, అల్ట్రా పల్లె వెలుగు-7, మెట్రో ఎక్స్ ప్రెస్-14, ఎక్స్ ప్రెస్-8 బస్సుల్లో(మొత్తం 137) మహిళలు ఉచితంగా ప్రయాణించ వచ్చన్నారు. గుర్తింపు కార్డు చూపించాల్సి ఉందని వెల్లడించారు.

News August 11, 2025

యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష: విజయనరగం SP

image

2022లో గుర్ల PSలో నమోదైన పొక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. తన బిడ్డ కనిపించడం లేదని ఓ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బాలిక ఆచూకీ కనుగొన్నామన్నారు. పెనుబర్తికి చెందిన గుడిశ సూర్యనారాయణ అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసినట్లు గుర్తించామన్నారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.

News August 11, 2025

VZM: మనువడి అన్న ప్రాసనకు వెళ్లి మృతి

image

ద్వారకా బస్టాండ్‌లో విశాఖ-పలాస ప్లాట్‌ఫాం వద్ద శ్రీకాకుళం డిపో-1కు చెందిన బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతి చెందింది. మృతురాలు విజయనగరం(D) ఎస్.కోట(M) పోతనాపల్లికి చెందిన ముత్యాలమ్మ(45)గా గుర్తించారు. గాజువాక గోపాలరెడ్డిపేటలో ఉన్న మనవడి(పెద్ద కుమార్తె కొడుకు) అన్నప్రాసన నిన్న జరగ్గా వచ్చింది. తిరిగి ఇంటి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా.. ఈమె అక్కయ్యపాలెంలో ఓ హోటల్‌లో పనిచేస్తోంది.

News August 11, 2025

VZM: గ్రామాన్ని అమ్మేశారంటూ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

image

ఎస్.కోట మండలం దెప్పూరు గిరిజన గ్రామాన్ని తమకు తెలియకుండా అమ్మేశారని గ్రామస్థులు విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. జిందాల్ కంపెనీ పేరిన రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందన్నారు. కిల్తంపాలెం పంచాయతీలో ఉన్న ఈ గ్రామంలో 13 కుటుంబాల వారు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నా తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ జరిగిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.

News August 11, 2025

VZM: అనర్హులు ఉంటే తొలగించాలని ఆదేశం

image

ఆగ‌స్టు 15 నాటికి 50వేల బంగారు కుటుంబాల ద‌త్త‌త ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.బిఆర్ అంబేడ్క‌ర్ ఆదేశించారు. వివిధ అంశాల‌పై ఆన్‌లైన్ సమావేశం ద్వారా క‌లెక్ట‌ర్ సోమవారం స‌మీక్షించారు. జిల్లాలో మొద‌ట 67,066 బంగారు కుటుంబాల‌ను గుర్తించ‌గా, వ‌డ‌పోత‌ల అనంత‌రం ఆ సంఖ్య 60,612కు త‌గ్గింద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. ఇంకా ఎవ‌రైనా అన‌ర్హులు ఉంటే తొల‌గించాల‌ని సూచించారు.

News August 11, 2025

తదుపరి సమస్యలకు మీదే బాధ్యత: JC

image

కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులతో భూముల రీసర్వే పై JC సేతుమాధవన్ సోమవారం సమీక్ష జరిపారు. గ్రామాల, ప్రభుత్వ భూముల, సంస్థల, అతుకుబడి భూములు, సరిహద్దులను నిర్ణయించడానికి నవంబర్ నెల లోపల రీసర్వే జరపనున్నట్లు తెలిపారు. ఆయా శాఖల భూముల్ని రీ సర్వే చేసుకొని సరిహద్దులను నిర్ణయించుకోవాలన్నారు. ఆయ శాఖల అధికారులు బాధ్యత వహించాల్సి ఉందని, లేని యెడల తదుపరి సమస్యలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

News August 11, 2025

విజయనగరం PGRSకు 149 వినతులు

image

విజయనగరం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించిన PGRSకు 149 వినతులు అందాయి. వాటిలో భూ సమస్యలకు సంభందించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 52 వినతులు అందాయి. పంచాయతిశాఖకు 6, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 27 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 8, విద్యాశాఖకు 8 అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవన్నారు. ఫిర్యాదులను కలెక్టర్ అంబేడ్క‌ర్‌తో పాటు ఇతరులు స్వీకరించారు.