Vizianagaram

News August 29, 2024

‘ఉమ్మడి విజయనగరం జిల్లాకు జ్వరమొచ్చింది’ 

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వరపీడితులతో కిక్కిరిసాయి. గడిచిన కొన్ని రోజుల నుంచి ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సీహెచ్సీలలో రోజుకు 400 వరుకు ఓపీలు, పీహెచ్సీల్లో సుమారు 200 వరుకు ఓపీలు నమోదవుతున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై వరుకు 435 మలేరియా,94 డెంగీ కేసులు నమోదయ్యాయి. క్షేత్ర స్థాయిల్లో వసతుల లేమితో రోగులు అవస్థలు పడుతున్నారు.

News August 29, 2024

విజయనగరం మెడికల్ కాలేజీలో ప్రవేశాలు ప్రారంభం

image

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆల్ఇండియా కోటాలో 22 సీట్లను వైద్య కళాశాలకు కేటాయించారు. దీనికి సంబంధించిన ప్రవేశాలు ముందుగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు నలుగురు ప్రవేశాలు పొందారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మలీల, ఆర్‌ఎంఈఓ డాక్టర్ ఎన్.సురేశ్ బాబు ఆడ్మిషన్ ప్రక్రియ నిర్వహించారు.

News August 29, 2024

విజయనగరం కమిషనర్ టాలెంట్ గురించి మీకు తెలుసా? 

image

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న నల్లనయ్యను తెలుగు భాష అంటే మక్కువ ఎక్కువ. ఉత్తరాంధ్ర మాండలికం అంటే ప్రాణం. ఆ యాస కలకాలం బతికేలా రచనల ద్వారా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. “ఉత్తరాంధ్ర అమ్మమ్మలు, నాయనమ్మల్లార మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నారా” అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆయన చేసిందే. ఉత్తరాంధ్ర యాస మనుగడకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు నల్లనయ్య తెలిపారు.

News August 29, 2024

‘కేజీహెచ్‌కు అనుమానాస్పద కేసు రాక’

image

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన వ్యక్తి (44) శరీరంపై ఎర్రటి, నల్లటి పొక్కులతో బుధవారం రాత్రి కేజీహెచ్‌కు వచ్చాడు. కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అతని నుంచి నమూనాలు సేకరించి మంకీపాక్సా కాదా అనేది నిర్ధారించడానికి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించామని కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ శివానంద తెలిపారు. ముందు జాగ్రత్తగా తదుపరి పరీక్షల నిమిత్తం నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు.

News August 29, 2024

పార్వతీపురం: డిగ్రీ విద్యార్థులకు క్విజ్ పోటీలు

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా డిగ్రీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. సంబంధిత పోస్టర్‌ను కలెక్టర్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. https://www.rbi90quiz.in/ ద్వారా సెప్టెంబర్ 17వ తేదీ లోగా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

News August 29, 2024

విజయనగరం కలెక్టర్ వార్నింగ్

image

ఉపాధి హామీ పథకం పనులపై విజయనగరం క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేడ్కర్ బుధవారం సమీక్ష చేశారు. ఈ నేపథ్యంలో మండల స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ ప‌థ‌కం నిధుల కింద మంజూరు చేసిన ప‌నులు చేప‌ట్ట‌డంలోఅల‌స‌త్వం వ‌హించే అధికారుల‌పై త‌ప్ప‌క‌ చ‌ర్య‌లు తీసుకుంటామని క‌లెక్ట‌ర్ హెచ్చరించారు. జిల్లాలో ప్ర‌స్తుతం మొక్క‌లు నాట‌డం, డ్రెయిన్లు, సీసీ రోడ్లు, ఫారం పాండ్‌ల నిర్మాణంలో  పురోగతి లేదన్నారు.

News August 29, 2024

విజయనగరం కుర్రాళ్ల ప్రతిభ

image

అంగవైకల్యం ఉన్నప్పటికీ నిరుత్సాహపడకుండా విజయనగరం కుర్రాళ్లు క్రికెట్‌లో రాణిస్తున్నారు. డిఫరెంట్లీ ఎబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌కు ఎస్.పైడిరాము, ఎం.గణేశ్, వై.సత్తిబాబు, పి.వెంకటేశ్ సెలెక్ట్ అయ్యారు. వీరు ఒక్కోరకమైన అంగవైకల్యం ఉన్నప్పటికీ క్రికెట్లో రాణిస్తున్నారు. వచ్చే నెల 4, 5వ తేదీల్లో ఒంగోలులో జరిగే పోటీల్లో పాల్గొంటారు.

News August 28, 2024

నెల్లిమర్లలో బైక్ దొంగ ఇతనే..!

image

నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో బైక్ చోరీకి గురైంది. కళాశాలకు చెందిన వైద్య విద్యార్థి తన బైకును పార్కింగ్ చేసి క్లాస్ రూముకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బైక్ మాయమైంది. దీంతో సీసీ కెమెరా పరిశీలించగా.. పార్కింగ్ చేసిన కొద్ది సమయానికే గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని దొంగిలించినట్లు రికార్డైంది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News August 28, 2024

VZM: ఈవీఎం రీవెరిఫికేషన్‌కు ఎంత కట్టారంటే?

image

ఈవీఎంల చెకింగ్, రీవెరిఫికేషన్‌కు నిబంధనల ప్రకారం నగదు చెల్లించారని విజయనగరం కలెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. గజపతినగరం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం నెం.20లో రీవెరిఫికేషన్‌కు బొత్స అప్పల నరసయ్య, నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో నెం.9పోలింగ్ కేంద్రంలో EVM చెకింగ్‌, రీవెరిఫికేషన్‌కు బెల్లాన చంద్రశేఖర్ దరఖాస్తు చేశారు. ఈకమ్రంలో ఇద్దరూ కలిపి రూ.47,200 చెల్లించారని కలెక్టర్ చెప్పారు. 

News August 28, 2024

ఒకేరోజు లక్ష మొక్కలు నాటుదాం: కలెక్టర్

image

రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు విజయనగరం జిల్లాలో ఆగ‌ష్టు 30న వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్రమాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ వెల్ల‌డించారు. ఆ ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా ల‌క్ష మొక్క‌లు నాటేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌న్నారు. వ‌న‌మ‌హోత్స‌వ ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారుల‌తో ఆయన స‌మీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.