India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు.
పరిశ్రమల స్థాపన కోసం సీఎం చంద్రబాబు పాటుపడుతుంటే, పారిశ్రామిక వేత్తలు ఆంధ్రాకు రావొద్దని జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం జిల్లా తెలుగదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పనిచేస్తామంటే టీడీపీ ఎప్పుడూ అడ్డుకోలేదన్నారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు తేలేకపోయారని విమర్శించారు.
ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులకు పండగే. సండే రోజు కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఆర్థిక పరిస్థితిని బట్టి కొందరు మటన్ తెచ్చుకుంటే మరికొందరు చికెన్, చేపలతో సండే విందును కంప్లీట్ చేస్తుంటారు. అయితే విజయనగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతోంది. చికెన్ (స్కిన్) రూ.150, (స్కిన్ లెస్) రూ.170, ఫిష్ రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
ఆదివాసీలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గిరిజన ప్రాంతాలకు రహదారుల అభివృద్ధి కోసం రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఇప్పటికే పంపించామన్నారు. జిల్లా విడిపోయిన తర్వాత ITDA వేరయ్యిందని, అందువలన గిరిజనులకు అందవలసిన సౌకర్యాలను కోల్పోయారన్నారు.
విజయనగరంలోని SSSS డిగ్రీ కాలేజీలో ఈనెల 12న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులుగా పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://naipunyam.ap.gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకొని రోడ్డు ప్రమాదాల నియంత్రించడం కోసం ఈనెల అంతా డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ దారణ వంటి ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా SI నుంచి పైస్థాయి పోలీసు అధికారులు జిల్లాలో ప్రతిరోజు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. నమోదు చేసిన కేసులు వివరాలను జిల్లా కేంద్రానికి తెలియజేయాలని ఆదేశించారు.
రాష్ట్రీయబాల పురస్కార్ అవార్డుల కోసం ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి విమలారాణి తెలిపారు. విద్యా, విజ్ఞానం, కళలు, ఆటలు, ఇతర రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5-18 ఏళ్ల లోపు వారు అర్హులుగా పేర్కొన్నారు. సంబంధించిన సర్టిఫికెట్, పత్రికల్లో ప్రచంపబడిన పేపర్ క్లిప్పింగ్, తదితర సర్టిఫికెట్లతో https://award.gov.in లో అన్లైన్ చేసుకోవాలన్నారు.
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. జామి మండలం అట్టాడ గ్రామంలో పిడుగు పడి సత్యనారాయణ (60) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ సమీపంలోని పార పని చేస్తుండగా పిడుగుపాటుకు గురయ్యాడని చెప్పారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
జిల్లాలో ఉన్న నాటుతుపాకీల ఏరివేతకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. గంజాయి, నాటుసారా నియంత్రణ, నాటుతుపాకీల స్వాధీనమే లక్ష్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. లైసెన్స్ లేకుండా నాటు తుపాకీలను వినియోగించడం నేరమని, స్వచ్ఛందగా అప్పగించాలని కోరారు.
జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ (NCSC) కిశోర్ మాక్వాను, NHRC సభ్యులను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కలిసి జిందాల్ భూ సమస్యలపై రైతులకు న్యాయం జరగాలని వినతిపత్రం అందించినట్లు బుధవారం తెలిపారు. NHRC సభ్యులు విద్యా భారతి, జస్టిస్ సారంగి, ఎస్టీ కమిషన్ సభ్యులు నిరుపమ్ చక్మా, హుస్సేన్, బీజేపీ నాయకులను కలిసి వినతి పత్రాలు అందించామన్నారు. విచారణ చేసి నివేదిక పంపాలని కలెక్టర్కు ఆదేశాలు అందాయన్నారు.
Sorry, no posts matched your criteria.