India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద 18 రకాల కుల వృత్తులు, చేతి వృత్తులు, సాంప్రదాయ వృత్తులు చేసేవారికి రూ.2 లక్షల వరకు రుణాలు అందజేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం తన ఛాంబర్లో తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన విశ్వకర్మ ఐడీ కార్డు కలిగిన వారికి 5 రోజులు ప్రాథమిక శిక్షణ ఇచ్చి, అనంతరం రూ.15 వేలు టూల్ కిట్ ఇన్సెంటివ్గా మంజూరు చేస్తామన్నారు.
సీజనల్ వ్యాధులను అరికట్టి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. విజయనగరం జిల్లాలో మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తక్షణమే అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థాయి సంఘ సమావేశాలు జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగాయి.
ప్రభుత్వ హోమియో వైద్యశాల రాకోడు లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో యోగా శిక్షకులుగా పనిచేసేందుకు ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వైద్యాధికారి డా. పి. సత్యేంద్ర కుమార్ తెలిపారు. యోగా శిక్షకులుగా పనిచేసేవారు ఎమ్మెస్సీ యోగా, పీజీ డిప్లొమో ఇన్ యోగా , డిప్లొమో ఇన్ యోగాలో అనుభవం ఉన్నవారు అర్హులన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
‘స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా’ అనే టైటిల్తో డా.పీవీజీ రాజుపై విడుదలైన పుస్తకం ఆకట్టుకుంటోంది. కవర్ పేజీ చిత్రపటం నుంచి చివరి పేజీ వరకు పీవీజీ జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘటనలు, విశేషాలను ఫొటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. అశోక్ గజపతిరాజు ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. ఈ తెలుగు అనువాద పుస్తకం సుమారు 8 వేల కాపీలను అచ్చు వేయించారు. సోమవారం సాయంత్రం కోటలో పుస్తకావిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే.
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత.. విజయనగరం వాసులు కొంగు బంగారం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించి సిబ్బందికి గంటన్నర ముందే ప్రమాద సంకేతాలు అందినట్లు తెలిసింది. బల్క్ డ్రగ్ తయారీలో ఉపయోగించే ఎంటీబీఈ రసాయనం లీక్ అవుతున్నా సిబ్బంది, కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తనిఖీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తక్షణం స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని వారు నివేదికలో పేర్కొన్నారు.
పరవాడలోని సినర్జిన్ కంపెనీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సోమవారం ఉదయం మృతి చెందిన వంగర మండలం కోనంగిపాడుకు చెందిన కే.సూర్యనారాయణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నాలుగేళ్ళ క్రితం బలిజపేట మండలం బర్లికి చెందిన సునీతను వివాహం చేసుకున్నాడు. కుమారుడికి రెండేళ్లు కాగా, ఇటీవల జన్మించిన చిన్న కుమారుడికి పది రోజుల్లో నామకరణం చేయనున్నారు. ఇంతలోనే ప్రమాదం జరగడంతో బిడ్డను చూడకుండానే ప్రాణాలు కోల్పోయాడు.
జిల్లాలో ఉచిత ఇసుక సరఫరా విధానం ప్రారంభించిన జులై 8 నుంచి 26వ తేదీ వరకు మూడు ఇసుక డిపోల ద్వారా 39,972 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేసినట్లు గనుల శాఖ ఉప సంచాలకులు సిహెచ్. సూర్యచంద్ర రావు తెలిపారు. సోమవారం ఒక్క రోజులో 30 బుకింగ్లు ద్వారా 449 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేశారని పేర్కొన్నారు. నేటికీ జిల్లాలో 47,107 టన్నులు అందుబాటులో ఉందని వెల్లడించారు.
విద్యను పెంపొందించడం ద్వారా వెనుకబాటుతనాన్ని నిర్మూలించవచ్చని డాక్టర్ పీవీజీ.రాజు నిరూపించారని కేంద్రమంత్రి కే.రామ్మోహన్ నాయుడు అన్నారు. పీవీజీ.రాజు శతజయంతి ఉత్సవాలను సోమవారం కోటలో నిర్వహించిన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రలో విద్యావకాశాలు పెంపొందించి వెనుకబాటుతనాన్ని పోగొట్టే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారని కొనియాడారు.
కొమరాడ మండలం వన్నాం గ్రామానికి చెందిన వాన శివుడు ఏనుగుల దాడిలో మృతి చెందాడు. సోమవారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన శివుడిని ఏనుగుల గుంపు తొక్కి చంపినట్లు సమీప రైతులు చెప్పారు. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు ఒంటరి ఏనుగు హరి వల్లే ఎక్కువగా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసినా.. ఆ ఏనుగు లేకపోయినప్పటికీ మరొకరి ప్రాణాన్ని ఏనుగులు గుంపు బలి తీసుకుంది.
Sorry, no posts matched your criteria.