Vizianagaram

News August 26, 2024

తిరుగులేని నాయకుడు, అభ్యుదయవాది డా.పీవీజీ

image

విజయనగరం సంస్థానాధీశులు పీవీజీ రాజు సోషలిస్ట్ భావాలు గల అభ్యుదయవాది. 1952 నుంచి 1984 వరకు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించారు. 1952లో సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా, 1956లో ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 1957లో విశాఖ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1960 నుంచి 1964 వరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

News August 26, 2024

రైతుల కోసం జైలు శిక్ష అనుభవించిన పీవీజీ

image

విజయనగరం మహారాజు డా.పీవీజీ రాజు రైతు బాంధవులుగా పేరొందారు. వారి పక్షాన పోరాడి జైలు జీవితం గడిపారు. 1949లో జామి మండలం అన్నమరాజుపేటలో కాలువ తవ్వకంలో శ్రమదానం చేశారు. కర్నూలు జిల్లా కలివెన్న గ్రామంలో ఈనాం సత్యాగ్రహంలో పాల్గొని 40 రోజులు జైలు శిక్ష గడిపారు. బిహార్‌లో జరిగిన రైతు ఉద్యమానికి పీవీజీ నాయకత్వం వహించి పూర్నియా జైలులో 45 రోజులు గడిపారు. నాగార్జున సాగర్ నిర్వాసితులకు అండగా నిలిచారు.

News August 26, 2024

వర్షం కారణంగా ఆర్కేబీచ్ రోడ్డులో ర్యాలీ

image

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆర్.కె.బీచ్ వద్ద నిర్వహించారు. ర్యాలీ నిర్వహణకు పోర్టు స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వర్షం కారణంగా ట్రాక్ అంతా తడిసిపోయింది. దీంతో బురద కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడతారని భావించిన కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సూచనతో అధికారులు ర్యాలీని బీచ్ రోడ్‌లో నిర్వహించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అభ్యర్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

News August 26, 2024

ఫార్మాకంపెనీలో ప్రమాదం.. విజయనగరం జిల్లా వ్యక్తి మ‌ృతి

image

పరవాడ సినర్జిన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖలో చికిత్స పొందుతున్న కెమిస్ట్ సూర్యనారాయణ(34) మృతి చెందాడు. మృతుడు విజయనగరం జిల్లా కోనంగిపాడుకు చెందిన వ్యక్తి. ఆరోజు సూర్యనారాయణ కెమికల్ మిక్స్ చేస్తుండగా రియాక్షన్ జరిగి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఝార్ఖండ్‌కు చెందిన కార్మికుడు రెండు రోజుల కిందట చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

News August 26, 2024

డా.పీవీజీ రాజు మానస పుత్రిక “మాన్సాస్ “

image

విజయనగరం సంస్థానాధీశులు డా.పీవీజీ రాజు అభినవ దానకర్ణుడని చెప్పుకుంటారు. సామాన్యులు సైతం ఉన్నత విద్య అభ్యసించాలన్న లక్ష్యంతో తన రాచరిక వైభవాన్ని విద్యా సంస్థలు కోసం దానం చేశారు. 1958లో మాన్సాస్ ట్రస్ట్ (మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సెస్) స్థాపించి, ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, విజయనగరాన్ని విశ్వవిద్యాలయంగా చేశారు. విద్యా సంస్థలు కోసం తన కోటని ధారాదత్తం చేశారు.

News August 26, 2024

విద్యారంగ సమస్యలపై మంత్రి కొండపల్లికి వినతి

image

G.O నం.117తో విద్యావ్యవస్థ నాశనం అయ్యిందని, ఆంగ్లమాద్యమంతో పాటు తెలుగును కూడా కొనసాగించాలని ఏపీటీఎఫ్ నాయకులు మంత్రిని కోరారు. టీచర్ల పనిసర్దుబాటు ప్రక్రియ కూడా లోపభూయిష్టంగా ఉందని తెలియజేశారు. మండల పరిధిలో అవసరం మేరకు మాత్రమే టీచర్లను సర్దుబాటు చేయాలనీ మంత్రిని తన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు.

News August 26, 2024

నేడు డా.పీవీజీ రాజుపై పుస్తకావిష్కరణ

image

విజయనగరం సంస్థానాధీశులు, మాన్సస్ సంస్థ వ్యవస్థాపకులు దివంగత డా.పీవీజీ రాజు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన జీవిత చరిత్రకు సంబందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం కోటలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరగనుంది. అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు, శాసనసభా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

News August 26, 2024

విజయనగరం: ‘ఎమ్మెల్సీ అభ్యర్థిగా రఘువర్మ’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC అభ్యర్థిగా APTF-57 తరఫున రెండోసారి పాకలపాటి రఘువర్మ పోటీ చేయనున్నారు. ఈ మేరకు విజయనగరంలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీచర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తిని బరిలో ఉంచుతున్నట్లు కార్యవర్గం పేర్కొంది. త్వరలో ప్రచారం మొదలుపెడతామని వెల్లడించింది. సంఘం పరంగా ఆయన గెలుపునకు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చింది.

News August 26, 2024

పరిశ్రమల యాజమాన్యాలతో 27న సమావేశం: VZM కలెక్టర్

image

జిల్లాలోని భారీ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో భద్రతపై ఈ నెల 27న ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఇటీవల అనకాపల్లి జిల్లాలోని ఫార్మా పరిశ్రమల్లో జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల యజమానులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు.

News August 25, 2024

మహిళలు లక్షాధికారులు కావాలి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

image

స్వయం సహాయక సంఘాల సభ్యులు లక్షాధికారులుగా ఎదగాలని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో జరిగిన ‘లఖ్ పతి దీదీ’ కార్యక్రమంలో మహిళా సంఘాలకు రూ.66.14 కోట్ల చెక్కును అందజేశారు. మహిళలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ఈ పథకం లక్ష్యమన్నారు.