India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంగన్వాడీ భవనాల్లో మౌలిక వసతులు తప్పక ఉండాలని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టాయిలెట్స్, విద్యుత్ సరఫరా లేని భవనాల ఖచ్చితమైన జాబితాను వెంటనే అందించాలని ఆదేశించారు. వాటికి వెంటనే విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని విద్యుత్, విద్యా శాఖల అధికారులకు ఆదేశించారు.
విజయనగరం కలెక్టరేట్లో మద్యం షాపుల కేటాయింపునకు గురువారం లాటరీ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీ నాథుడు ఒక ప్రకటనలో తెలిపారు. కల్లుగీత, సొండి కులాలకు కేటాయించిన మద్యం షాపులకు గత నెల 10వ తేదీన లాటరీ తీయాల్సి ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేశామన్నారు. కోడ్ ముగియడంతో గురువారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో 9 గంటల నుంచి లాటరీ నిర్వహిస్తామని చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్పై జనసేన నాయకుడు, రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మిడతాన రవికుమార్ విజయనగరం DSPకి బుధవారం ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్పై తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన పార్టీ నాయకులు రామునాయుడు, కుర్మారావు పాల్గొన్నారు.
అకస్మాత్తుగా గుండె పోటుతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రాజాం మున్సిపాలిటీ పరిధిలో గాయత్రీ కాలనీకి చెందిన శ్రీనివాస్(30) భోజనం చేసిన కాసేపటికే కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రఘువర్మను గెలిపించాలని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం చేశారని, ఓటమితో గాదె కూడా తమ అభ్యర్థి అనడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడించడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసినట్లు విజయనగరం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇకపై అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
చీపురుపల్లి మెయిన్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో గరివిడి మండలం రేగటికి చెందిన కుడుముల బంగారినాయుడు(32) మృతి చెందాడు. చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతరకు తన స్నేహితుడు శనపతి రాముతో కలిసి వచ్చాడు. జాతర నుంచి తిరగివెళ్తుండగా మెయిన్ రోడ్డులో బైక్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న బంగారినాయుడు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడించడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసినట్లు విజయనగరం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇకపై అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
విజయనగరం జిల్లాలో నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 22,114 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 21,192 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్స్పెక్టర్ మజ్జి ఆదినారాయణ తెలిపారు. మొత్తం 922 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 90 మంది ఇన్విజిలేటర్లు, 6 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.
➤ గాదె శ్రీనివాసులు నాయుడు: 12,035(గెలుపు)
➤ పాకలపాటి రఘువర్మ : 8,527
➤ కోరెడ్ల విజయ గౌరీ : 5,900
➤ నూకల సూర్యప్రకాశ్ : 89
➤ పోతల దుర్గారావు : 68
➤ సుంకర శ్రీనివాసరావు : 39
➤ రాయల సత్యనారాయణ : 32
➤ కోసూరు రాధాకృష్ణ : 31
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి : 15
➤ పెదపెంకి శివప్రసాద్ : 15
➤ ఇన్ వ్యాలీడ్ : 656
Sorry, no posts matched your criteria.