Vizianagaram

News August 22, 2024

VZM: ఉత్త‌మ టీచర్ అవార్డుకు ప్ర‌తిపాద‌న‌లు

image

విజ‌య‌న‌గ‌రం జిల్లాస్థాయి ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డు-2024కు ఈనెల 28వ తేదీలోగా ప్ర‌తిపాద‌న‌లు పంపించాల‌ని DEO ఎన్‌.ప్రేమ్‌కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక‌, ప్రాథమికోన్న‌త‌, ఉన్న‌త పాఠ‌శాల‌లు, ప్ర‌భుత్వ డైట్ ఇత‌ర యాజ‌మాన్యాల కింద ప‌నిచేస్తున్న 10 సంవ‌త్స‌రాల స‌ర్వీసు పూర్తి చేసిన‌ ఉపాధ్యాయులంతా ఈ అవార్డుకు అర్హుల‌ని పేర్కొన్నారు.

News August 22, 2024

విజయనగరం జిల్లాలో ఎస్ఐల బదిలీ

image

విజయనగరం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమెన్ పీఎస్‌లో పనిచేస్తున్న నారాయణరావుకు గుర్ల, 1టౌన్ తారకేశ్వరరావును బాడంగి, పీటీసీలో ఉన్న ప్రసాద్‌ను రామభద్రపురం, గరివిడి దామోదర్‌ను చీపురుపల్లి, బుదరాయవలస లోకేశ్వరరావును గరివిడి పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని SP ఆదేశించారు.

News August 22, 2024

ఎమ్మెల్యేగా ఓడినా.. క్యాబినెట్ హోదా!

image

MLAగా ఓడినా.. రెండు నెలలు తిరగక ముందే బొత్స సత్యనారాయణకు క్యాబినెట్ హోదా లభించనుంది. చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స తన ప్రత్యర్థి కళావెంకట్రావు చేతిలో ఓడిపోయారు.అధినేత జగన్ నిర్ణయంతో ఆయన మళ్లీ చట్ట సభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కింది. MLCగా ప్రమాణ స్వీకారం చేసిన బొత్సను శాససనమండలిలో విపక్ష నేతగా నియమించాలని జగన్ నిర్ణయించారు. దీంతో బొత్స అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 22, 2024

మృతుల్లో ముగ్గురు విజయనగరం వాసులు

image

అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన పేలుడులో 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులు ముగ్గురు ఉన్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతులు అసిస్టెంట్ మేనేజర్ నారాయణరావు (గరివిడి), ఫిట్టర్ పార్థసారథి(పార్వతీపురం), ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్ ఆనందరావు బమ్మిడి(గొల్లపేట, పూసపాటిరేగ)గా గుర్తించారు.

News August 22, 2024

VZM: కౌలు రైతులందరికీ 100 శాతం రుణాలు మంజూరు చేయాలి

image

జిల్లాలోని కౌలు రైతులంద‌రికీ గుర్తింపుకార్డుల‌ను జారీ చేసి, 100 శాతం రుణాలు మంజూరు చేయాల‌ని బ్యాంక‌ర్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో 15,500 సీసీఆర్‌సీ కార్డుల‌ను రైతుల‌కు అందించాల్సి ఉండ‌గా, ఇప్పటికే 14,860 కార్డులు (95.5శాతం) అందజేశామన్నారు. మిగిలిన కార్డుల‌ను రెండు రోజుల్లో అంద‌జేయాల‌ని వ్య‌వ‌సాయాధికారుల‌ను ఆదేశించారు.

News August 21, 2024

పార్వతీపురం: 1,500 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

బహుళ జాతి కంపెనీ (MNC)లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయి కుమార్ తెలిపారు. జెన్ ప్యాక్ట్ కంపెనీలో కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ విభాగాలలో 1500 ఖాళీల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారన్నారు. 2022,23,24 సంవత్సరాలలో డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులుగా తెలిపారు. ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 21, 2024

జగన్‌ను కలిసిన బొత్స

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యానారాయణ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బొత్సకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. బొత్స వెంట విశాఖ, విజయనగరం జడ్పీ ఛైర్మన్లు జల్లి సుభద్ర, మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్‌.మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, ఉత్తరాంధ్ర కీలక నేతలు ఉన్నారు.

News August 21, 2024

విజయనగరం డీఈవో సూచనలు

image

ఇన్‌స్పైర్ మనక్ కోసం ప్రాజెక్టులు తయారు చేసి.. ఆ వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయాలని విజయనగరం డీఈవో ప్రేమకుమార్ సూచించారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులను ఈనెల చివరిలోగా నమోదు చేయాలన్నారు. అన్ని పాఠశాలల ప్రాజెక్టులను అప్‌లోడ్ చేయాలని కోరారు. ఉన్నత పాఠశాల నుంచి 5, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 3 ప్రాజెక్టులు ఉండాలని సూచించారు.

News August 21, 2024

మరికాసేపట్లో MLCగా బొత్స ప్రమాణ స్వీకారం

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలోని శాసనమండలిలో ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. బొత్స చేత శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌తో బొత్స భేటి అవుతారు.

News August 21, 2024

విజయనగరం: ఉపాధి హామీ పనుల ఆమోదం కోసం గ్రామ సభలు

image

ఉపాధి హామీ పనుల ఆమోదం కోసం ప్రతి గ్రామంలో ఈ నెల 23 న గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ఈ గ్రామ సభల్లో సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయం చేసుకొని ప్రణాళికా బద్దంగా సభలను విజయవంతం చేయాలన్నారు. మంగళవారం కలెక్టర్ ఎం.పి.డి.ఓ లు, ఈఓఆర్డిలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ సభలపై ఆయన పలు సూచనలు చేశారు.