Vizianagaram

News August 19, 2024

VZM: అన్న క్యాంటీన్‌కు మంత్రి విరాళం

image

అన్న క్యాంటీన్ నిర్వహణకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇటీవల జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఆయన రూ.లక్ష చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. పేదల ఆకలి తీర్చేందుకు తన మొదటి నెల జీతం రూ.లక్షను నాన్నమ్మ పేరిట అందజేశారు. ఇంటికి ఎవరు వచ్చినా తన నాన్నమ్మ ఆకలితో ఉంచేది కాదని గుర్తు చేశారు.

News August 19, 2024

రామభద్రపురం: రోడ్ల అభివృద్ధికి ఎంపీ ప్రతిపాదనలు

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రామభద్రపురం నుంచి వయా రాజాం, పొందూరు, చిలకపాలెం వరుకు సుమారు 60 కిలోమీటర్ల రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయాలని, అలాగే రామభద్రపురం నుంచి వయా పార్వతీపురం బైపాస్, రాయగడ వరుకు రహదారి విస్తరించాలని ప్రతిపాదనలు అందజేశారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

News August 18, 2024

గుమ్మలక్ష్మీపురం: వరి నాట్లు వేసిన కలెక్టర్

image

గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ, ఆర్ జమ్మూ, కొండ బారెడు, వలసబల్లేరు గ్రామాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులను కలిసి ముచ్చటించారు. అక్కడ సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొందరు రైతులు వరి నాట్లు వేస్తుండగా.. వారితో కలిసి ఆయన నాట్లు వేశారు. గిరిజనులతో రోజంతా గడపడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు.

News August 18, 2024

కొత్తవలసలో ఆ రైలుకు హాల్ట్

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సబల్‌పూర్-ఈరోడ్ రైలును ఈనెల 21, నుంచి నవంబర్ 27 వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. తిరుగు ప్రయాణంలో ఈరోడ్ నుంచి ప్రతి శుక్రవారం ఈ రైలు బయలుదేరుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ఈ రైలు కొత్తవలస స్టేషన్‌లో ఆగుతుందని చెప్పారు.

News August 18, 2024

VZM: బదిలీ అయిన సీఐల వివరాలు ఇవే

image

ఉమ్మడి విజయనగరంలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
➤బొబ్బిలి టౌన్: నాగేశ్వరరావు
➤విజయనగరం టాస్క్ ఫోర్స్: మోహన్ రావు
➤ఎల్విన్పేట: సత్యనారాయణ
➤సాలూరు టౌన్: CH వాసు నాయుడు
➤పార్వతీపురం టౌన్- PVVS కృష్ణారావు
➤విజయనగరం ఉమెన్ PS: నాగేశ్వరరావు.

News August 18, 2024

డబ్బులు ఇస్తానంటే వద్దన్నారు: రాజన్న దొర

image

వాగులో కొట్టుకుపోయి చనిపోయిన ఆర్తి, మహేశ్ మృతదేహాలను మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర పరిశీలించారు. ‘ఇది చాలా బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడానికి నేను వెళ్లగా వాళ్లు తిరస్కరించారు. ఇది వారి ఆత్మాభిమానానికి అద్దం పడుతుంది. మృతదేహాల తరలింపు తమకు సంబంధం లేదని తొలుత అధికారులు చెప్పడం దారుణం’ అని రాజన్న దొర మండిపడ్డారు. కాగా విమానంలో మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

News August 18, 2024

VZM: టీచర్ల మృతి.. రూ.4 కోట్లతో బ్రిడ్జి

image

ఉమ్మడి విజయనగరం జిల్లా పాచిపెంట(M) సరాయివలస సమీపంలోని రాయిమాను కొండవాగులో ఇద్దరు టీచర్లు మృతిచెందిన విషయం తెలిసిందే. హరియాణాకు చెందిన టీచర్లు మహేశ్, ఆర్తి మృతదేహాలు స్వగ్రామం చేరే వరకు పూర్తి ఖర్చులు భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు ఉద్యోగం ఇస్తామని పేర్కొంది. వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు.

News August 18, 2024

పార్వతీపురం: ‘100 రోజుల విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి’

image

జిల్లాలో వంద రోజుల విజన్ డాక్యుమెంట్ అన్ని శాఖలు తక్షణం తయారు చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047పై దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక రంగాల శాఖలతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా శాఖల విజన్ ఉండాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ వివరించారు.

News August 17, 2024

VZM: వికసిత్ ఆంధ్ర- 2047 ప్రణాళికలపై వర్క్ షాప్

image

జిల్లాలో ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి తద్వారా జిల్లా అభివృద్ధి జరిగేలా శాఖల ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో వికసిత్ ఆంధ్ర- 2047 ప్రణాళికలపై శనివారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఆర్థికేతర, ఆర్థిక పరమైన అంశాలను గుర్తించి వేర్వేరుగా ప్రణాళికలలో చేర్చాలన్నారు.

News August 17, 2024

VZM: ఉద్యోగం రాదనే మనస్తాపంతో ఆత్మహత్య

image

ఉద్యోగం రాదనే మనస్తాపంతో డిగ్రీ సెకండియర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేటకు చెందిన చిన్నారావు విజయనగరం కాపుగంటి వీధిలోని ఓ గదిలో అద్దెకు ఉంటూ డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం గదిలో ఉరేసుకొని చనిపోయినట్లు మృతుడి అన్న భాస్కరరావు తెలిపాడు. వన్ టౌన్ స్టేషన్‌లో అతను ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.