India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 702 మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు. జిల్లావ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలలో 508 మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు, 194మంది ఓకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. కొంతమంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో హాజరు కాకపోవడంతో గైర్హాజరు కాగా మరికొంతమంది వివిధ కారణాలతో హాజరు కాలేదు.
విశాఖలోని సీతంపేట మార్గదర్శి ఆపోజిట్లో గల స్పా సెంటర్పై ద్వారక నగర్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా స్పా సెంటర్లో దాడులతో మిగతా స్పా సెంటర్లలో అలజడి నెలకొంది. ద్వారక నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో జిల్లాకు చెందిన SHOలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం స్టేషన్లలో ఉన్న రిసెప్షన్ సెంటర్లను ఉమెన్ హెల్ప్ డెస్క్గా మార్చనున్నామని తెలిపారు. డెస్క్లో ఒక మహిళా ఏఎస్ఐ బాధ్యులుగా నియమిస్తామని తెలిపారు.
విజయనగరం జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 20,964మంది విద్యార్థులు రాసినట్లు ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు. జిల్లాలో 166 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 18,686మందికి 18,178మంది ఓకేషనల్ విద్యార్థులు 2980 మందికి 2786మంది హాజరయ్యారన్నారు. పరీక్షలలో ఎటువంటి చూసి రాతలు జరగకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్, సిటింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు ఆదినారాయణ చెప్పారు.
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై భారీగా జరిమానాలు పడుతున్నాయి. SP వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం పట్టణ ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 16 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి పదివేలు చొప్పున 16 మందికి రూ.1.60 లక్షల జరిమానాను విధించారని SP శనివారం తెలిపారు. ప్రమాదాలు నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.
ఎస్.కోటకి చెందిన వ్యక్తి తల్లి చనిపోయిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. CI నారాయణమూర్తి వివరాల ప్రకారం.. మండలంలోని అయితన్నపేటకి చెందిన సంతోశ్ కుమార్(35) తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురైన సంతోశ్ ఫిబ్రవరి 25న మందులో పురుగుమందు కలుపుకొని తాగాడు. దీంతో అతడిని ఎస్.కోట ఆస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి విజయనగరం తరలించగా చికిత్స పొందతూ శుక్రవారం మృతిచెందాడు.
దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన మామిడి పెంటయ్య శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పెదమానాపురం ఎస్ఐ జయంతి తెలిపారు. మృతుడి బార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. తరచు తాగి వస్తుండటంతో ఇలా అయితే మీ ఆరోగ్యం చెడిపోతుందని భార్య మందలించడంతో మనస్తాపం చెంది, అశరబంద చెరువు వద్ద పురుగు మందు తాగినట్లు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా బొండపల్లి వద్ద చనిపోయినట్లు పేర్కొన్నారు.
తోటపాలెం సమీపంలో బొండపల్లి జనార్ధన్ అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనార్ధన్ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని, డిగ్రీ చదివిన సమయంలో ప్రేమ విఫలమైన కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తండ్రి కుమార్ తెలిపారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో 177 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 20,902, ద్వితీయ సంవత్సరం 20,368మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు.
జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని ప్రభుత్వం మూడు నెలలు పొడిగించిందని DPRO రమేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి కలెక్టరేట్లోని DPRO కార్యాలయంలో రెన్యువల్ స్లిప్పులు పంపిణీ చేస్తామన్నారు. రెన్యువల్ స్లిప్పులతో పాటు అక్రిడేషన్, ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో ఆర్టీసీ కార్యాలయానికి వెళితే బస్సు పాస్ ఇస్తారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.