Vizianagaram

News August 14, 2024

సాలూరు: అన్న క్యాంటీన్‌‌కు మంత్రి విరాళం

image

సాలూరులోని అన్న క్యాంటీన్‌లో భోజనం అందించేందుకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. బుధవారం సాలూరు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో అన్న క్యాంటీన్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. పేదలు ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News August 14, 2024

పార్వతీపురం: హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష

image

హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం రాత్రి పార్వతీపురం రెండవ అదనపు జిల్లా జడ్జి దామోదర్ రావు తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు. 2015లో పట్టణంలోని జరిగిన ఘర్షణ, హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.1000 జరిమానా, ఏడుగురికి సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు రూ. 500 జరిమానా విధించినట్లు తెలిపారు.

News August 14, 2024

వైసీపీ పూర్వవైభవానికి బొత్స విజయం బీజం: అంబటి

image

విశాఖ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికలలో బొత్సను వైసీపీ అధిష్ఠానం బరిలో దింపింది. అయితే కూటమి నుంచి ఎవరూ పోటీలోలేరని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స విజయం ఖాయం కానుంది. దీనిపై స్పందిస్తూ మాజీ మంత్రి అంబటి ” YSRCP పూర్వ వైభవానికి బీజం వేసిన బొత్స విజయం ” అంటూ తన X లో పేర్కొన్నారు. ఇది నిరుత్సాహంలో ఉన్న వైసీపీకి ఊరటనిచ్చే విషయమేనని పలువురు చర్చించుకుంటున్నారు.

News August 14, 2024

శృంగవరపుకోట: కన్నబిడ్డల కళ్లెదుటే తల్లి హత్య

image

కన్నబిడ్డల ఎదుటే భార్యను, భర్త హత్య చేసిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగింది. సీఐ నారాయణమూర్తి వివరాల మేరకు.. మూలబొడ్డవర పంచాయతీకి చెందిన డి.దేముడు భార్యపై అనుమానంతో ఆదివారం రాత్రి టేకు చెక్కతో దాడి చేశాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా..స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది. దీనిపై కేసు దర్యాప్తులో ఉందని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News August 13, 2024

విజయనగరంలో రెండు.. పార్వతీపురంలో జీరో

image

విజయనగరం జిల్లా కేంద్రంలో రెండు అన్న క్యాంటీన్ల ప్రారంభానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అదే రోజు జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రకాశం పార్క్ వద్ద అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. కాగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఆ రోజు ఎక్కడా అన్న క్యాంటీన్లు ప్రారంభం కావడం లేదు.

News August 13, 2024

వైసీపీ అధినేతతో జడ్పీ చైర్మన్ భేటీ

image

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జగన్ ను కలిసిన వారిలో జిల్లాకు చెందిన పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

News August 13, 2024

VZM: ఈ నెల 16న స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాక

image

స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ఈ నెల 16న విజయనగరం జిల్లాకు రానున్నారు. ఆగస్టు 15 నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 16న సిసోడియా జిల్లాకు విచ్చేసి రోజంతా వివిధ మండలాల్లో పర్యటిస్తారని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఎంపీడీఓలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలన్నారు.

News August 13, 2024

ఉత్తరాంధ్ర వైసీపీలో జోష్..!

image

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్ర వైసీపీ కేడర్ నిరుత్సాహానికి గురైంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. గెలవడడానికి బలమున్నా సరే టీడీపీ పోటీలో ఉంటే ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇదే సమయంలో బొత్సను వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. చివరకు పోటీ నుంచి కూటమి తప్పుకోవడంతో ఆయన గెలుపు లాంఛనం కానుంది. బొత్స లాంటి సీనియర్ నేత MLC అయితే YCPకి జోష్ వస్తుందా? మీ కామెంట్.

News August 13, 2024

అరకు ఎంపీ ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో సవాల్

image

అరకు ఎంపీ తనూజా రాణి ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి గీత హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో అవాస్తవాలు చూపారని ఆరోపించారు. ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న తనను ఎన్నికైనట్లు ప్రకటించాలన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తనూజాతో పాటు పదిమంది అభ్యర్థులకు, లోక్ సభ సెక్రటరీ జనరల్, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.

News August 13, 2024

నాటు తుపాకీ గుర్తింపు.. విజయనగరం వాసుల అరెస్ట్

image

విశాఖ జిల్లా కొండెంపూడిలో లైసెన్స్ లేని నాటు తుపాకీతో సంచరిస్తున్న విజయనగరం జిల్లా వాసులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై డి.ఈశ్వరరావు తెలిపారు. ఎల్.కోటకు చెందిన ఎం.సత్యనారాయణ నుంచి దాసరి సత్యారావు తుపాకిని కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. తుపాకీ, గంధకం, శురాకారం, నల్ల బొగ్గు, గన్ పౌడర్, సైకిల్ బాల్స్ స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ చెప్పారు.