India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో రాత్రి 11 గంటల తర్వాత ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో సంచరించినా, వ్యాపారాలు సాగించినా కేసులు నమోదు చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా కొన్ని ఆంక్షలను కఠినతరం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత ఎటువంటి వ్యాపారాలు నిర్వహించకూడదని, గుంపులుగా కనిపించవద్దని సూచించారు. SHARE IT..
నషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA) ప్రతిజ్ఞను ఈ నెల 12న పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం సంబంధిత అధికారులు, మండల పరిషత్ అభివృద్ది అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం నివారించేందుకు 2020 ఆగస్టు 15న నషా ముక్త్ భారత్ అభియాన్ అనే సామూహిక అవగాహన కార్యక్రమాన్ని సామాజిక న్యాయం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తామన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పార్వతీపురం పట్టణంలోని వెంకంపేట గోరీల వద్ద చోటుచేసుకుంది. అవుట్ పోస్ట్ పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా గాజువాకలోని గణేశ్నగర్కు చెందిన షేక్ రోషన్(26) పార్వతీపురం పట్టణంలో సీలింగ్ పనులు చేస్తున్నాడు. పనులు ముగించుకొని తిరిగి రూమ్కి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు తెలిపారు.
రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగష్టు 12న సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించనున్నారు. ఆరోజు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించారు. ‘ఎంతోమందిని బాధపడితే ఆ ఉసురు తగులుతూనే ఉంటుంది. సొంత కుటుంబమే మాట్లాడాక.. నేను ఏం చెబుతాను. కుటుంబ వ్యవహారాల గురించి మనమేం మాట్లాడతాం. దువ్వాడను ముందుగా భార్యపిల్లలకు సమాధానం చెప్పమనండి’ అని మంత్రి అన్నారు. రెండ్రోజులుగా దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించినట్లు చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జి.విణేశ్ తెలిపారు. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల విధానం అమలులో ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విధానాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. టికెట్ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ వసతి ఉంటుందని ప్రయాణికులు వినియోగించుకోవచ్చునని తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ITDA పీవోలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం ఐటీడీఏ పీవో ఎస్.సేదు మాధవన్ను విజయనగరం జేసీగా, సీతంపేట పీవో టి.రాహుల్ కుమార్ రెడ్డిని పశ్చిమగోదావరి జేసీగా నియమించారు. వారం రోజులు గడవకుండానే ఇద్దరినీ బదిలీ చేయడం గమనార్హం. పీవో స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు.
విశాఖ నుంచి వయా విజయనగరం మీదుగా వెళ్లే విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ను దారి మళ్లించారు. రెగ్యులర్గా ఈ రైలు విజయనగరం, పార్వతీపురం, రాయగడ, రాయపూర్ మీదుగా నిజాముద్దీన్ వెళ్తుంది. అనివార్య కారణాల వల్ల 12807 నంబర్తో నడిచే ఈ రైలు శనివారం విజయవాడ మీదుగా నిజాముద్దీన్ వెళ్లనుంది. శనివారం ఉదయం 9.20 నిమిషాలకు ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని అధికారులు కోరారు.
బాలికపై సొంత బాబాయే అత్యాచారం చేసిన దారుణ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భర్త చనిపోవడంతో ఓ మహిళ కూలి పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య అక్క కూతురి(17)పై ఆమె బాబాయి(40) అత్యాచారానికి పాల్పడినట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో నిందుతునిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వాలు మారుతున్నా, గిరిజనుల తల రాతలు మాత్రం మారడం లేదు. మక్కవ మం. వీరమాసికి చెందిన చౌడిపల్లి బుల్లికు శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్కు ఫోన్ చేశరు. రావడం ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులు డోలితో నంద వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి బైక్పై తీసుకెళ్లగా, కాసేపటికి ఫీడర్ అంబులెన్స్ వచ్చింది. కొద్ది దూరం వెళ్లగా, అంబులెన్స్లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.