Vizianagaram

News February 18, 2025

విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ MLC ఓటర్లు ఇలా..!

image

➤ మొత్తం ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య: 4,937 
➤ పురుష ఓటర్లు: 3,100 
➤ మహిళా ఓటర్లు:1,837 
➤ పోలింగ్ కేంద్రాల సంఖ్య: 29 
➤ పోలింగ్ తేదీ: 27.02.2025 
➤ ఓట్ల లెక్కింపు తేదీ: 03.03.2025

News February 18, 2025

జిల్లాలో హోటల్స్‌కు ప్రభుత్వం రేటింగ్: కలెక్టర్

image

పర్యావరణ హితంగా, పర్యాటకులను ఆకర్షించేలా నడిపే హోటళ్లకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తుందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోటల్ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే ఈ రేటింగ్‌ను హోటల్స్ ఆన్‌లైన్ లో అప్లోడ్ చేసుకోవచ్చునని, అందువలన ఆయా హోటల్స్‌కు ర్యాంకింగ్ బుక్ చేసుకునే వారికీ తెలుస్తుందని పేర్కొన్నారు.

News February 17, 2025

VZM: మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ

image

మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని విజయనగరం ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో రామతీర్థాలకు 45 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరికి 35 బస్సులు, ఎస్.కోట నుంచి సన్యాసిపాలెంకు 10 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

News February 17, 2025

విజయనగరం: ఆమె జీబీఎస్‌తో చనిపోలేదు..!

image

విశాఖ KGHలో ఓ వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయిందని సూపరింటెండెంట్ శివానంద్ చెప్పారు. ‘విజయనగరం(D) L.కోట మండలానికి చెందిన వృద్ధురాలు(63) గుయిలెయిన్-బారే సిండ్రోమ్(జీబీఎస్) అనుమానాస్పద లక్షణాలతో ఫిబ్రవరి 6న KGHలో చేరారు. ఆమెకు షుగర్, బీపీ ఉన్నాయి. మేం అందజేసిన చికిత్సతో కాస్త కోలుకున్నారు. ఇవాళ ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో చనిపోయినట్లు తేలింది. ఆమె GBSతో చనిపోలేదు’అని ఆయన తెలిపారు.

News February 17, 2025

PHOTO: పంట పండింది కానీ..! 

image

టమాటాకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి ముందు క్రేట్ టమటా రూ.300 నుంచి రూ.400 వరకు అమ్ముడుపోయేది. సంక్రాంతి తర్వాత పంట దిగుబడి పెరగినా.. క్రమేపీ ధర తగ్గి ప్రస్తుతం క్రేట్ రూ.150కు కూడా అమ్ముడుపోవడం లేదు. దీంతో విసుగు చెందిన రైతులు రోడ్లపై పారేస్తున్నారు. బొబ్బిలి మార్కెట్‌లో పారేసిన టమాటాలను ఆవులు తింటున్న దృశ్యాన్ని పైన చూడొచ్చు. 

News February 17, 2025

VZM: పెళ్లికి వెళ్లి వస్తూ యువకుడి మృతి

image

వేపాడ మండలంలో వీలుపర్తి గ్రామానికి చెందిన గోకేడ రవికుమార్ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అన్నవరంలో బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతి చెందిన రవికుమార్ స్వస్థలమైన వీలుపర్తికి తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 17, 2025

ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతుల పుస్తకావిష్కరణ

image

విజయనగరానికి చెందిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ఠ సేవా పురస్కార గ్రహీత సముద్రాల గురు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతుల పుస్తకాని రచించారు. ఈ పుస్తకాని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆవిష్కరించారు. 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగినప్పుడు స్పీకర్‌గా ఉన్న వెంకటరామయ్య చౌదరి నుంచి నేటి శాసన సభాపతి వరకు 23 మంది శాసనసభాపతుల రాజకీయ జీవిత విశేషాలపై రాసిన పుస్తకం బాగుందని అభినందించారు.

News February 16, 2025

విశాఖలో IPL.. మ్యాచ్‌లు ఎప్పుడంటే..?

image

IPL అంటేనే అదొక మజా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి నేరుగా మ్యాచ్ చూడలేని వాళ్లు టీవీలు, మొబైల్లో ఐపీఎల్‌ను ఆస్వాదిస్తారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్‌లను ఈ సీజన్‌లో విశాఖ ప్రజలు నేరుగా చూడవచ్చు. ఢిల్లీ జట్టు విశాఖ స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకోవడంతో ఇక్కడ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 24న లక్నోతో, 30న సన్ రైజర్స్ హైదరాబాద్‌‌తో ఢిల్లీ తలపడనుంది.

News February 16, 2025

రామతీర్థంలో 26 నుంచి శివరాత్రి జాతర

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు శివరాత్రి జాతర మహోత్సవం జరగనుంది. 26, 27 తేదీల్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు జాగరణ చేస్తారు. 28న వేద పారాయణం అనంతరం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

News February 16, 2025

నెల జీతం విరాళంగా ఇచ్చిన విజయనగరం ఎంపీ 

image

తలసేమియాతో బాధపడుతున్న రోగుల చికిత్స నిమిత్తం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. విజయవాడలో తలసేమియా రోగుల కోసం శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఏడాది రోగుల కోసం తన వంతుగా ఒక నెల జీతాన్ని అందజేస్తానని ఎంపీ తెలిపారు. ఈ మొత్తాన్ని ఎన్టీఆర్ ట్రస్టుకు జమచేస్తానని వెల్లడించారు.