India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రసాయనిక పదార్థాలు వినియోగించి పళ్లను కృత్రిమంగా పండించి విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తామని విజయనగరం జేసీ ఎస్.సేతుమాధవన్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోని JC ఛాంబర్లో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ.. కృత్రిమంగా పండించే పండ్లు తక్కువ రుచితో వుంటాయన్నారు. ప్రజలకు విస్తృత అవగాహన చేపట్టాలని సూచించారు.
వేపాడ మండలం వీలుపర్తి క్వారీ వద్ద ప్రమాదవశాత్తు జారిపడి క్వారీ కార్మికుడు చింతల సత్తిబాబు (54) శుక్రవారం మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చర్లపాలెంకు చెందిన సత్తిబాబు క్వారీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. క్వారీలో పని చేస్తుండగా శుక్రవారం ఉదయం జారీపడడంతో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో పలువురు నాయకులను నామినేటెడ్ పదవులు వరించాయి. విజయనగరం, గజపతినగరం, రాజాం మార్కెట్ కమిటీ ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాజాం ఏఎంసీ ఛైర్పర్సన్గా పొగిరి కృష్ణవేణి(జనసేన), గజపతినగరం మార్కెట్ కమిటీ ఛైర్మన్గా పీ.వీ.వీ గోపాలరాజు(టీడీపీ), విజయనగరం ఏఎంసీ ఛైర్మన్గా కర్రోతు వెంకటనర్శింగరావుకు(టీడీపీ) అవకాశం ఇచ్చింది.
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని తన ఛాంబర్లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.
విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జి స్టేషన్ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.
విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జి స్టేషన్ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.
విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జి స్టేషన్ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.
గజపతినగరం మండలంలో తాటి చెట్టు పైనుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన భోగాది సత్యం (50) కల్లు తీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు పైనుంచి జారిపడి మృతి చెందినట్లు సత్యం భార్య భోగాది లక్ష్మి శుక్రవారం తెలిపారు. గజపతినగరం ఎస్సై లక్ష్మణరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని లక్ష్మీ వాపోయారు.
కొత్తవలస పోలీస్ స్టేషన్లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. నిందితుడు తన భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడన్నారు. తిరిగి భార్య కనిపించలేదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.
కొత్తవలస పోలీస్ స్టేషన్లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. నిందితుడు తన భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడన్నారు. తిరిగి భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడన్నారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.
Sorry, no posts matched your criteria.