India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామభద్రపురం మండలం ముచ్చర్లవలసలో రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. గత నెల 24న నడగాన సురేశ్ (24) ఉరేసుకుని మృతిచెందాడు. అతని మరణం తట్టుకోలేని తండ్రి రవణ (55) బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు. పొలంలో పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.
విజయనగరం పట్టణంలోని కేఎల్ పురం సమీపంలో వ్యభిచార గృహంపై వన్ టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ టాక్స్ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఇద్దరు విటులతో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ కాలనీకి చెందిన ఓ మహిళ విజయవాడ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఆమెపై గతంలో కూడా కేసులు నమోదయ్యాయన్నారు.
విజయనగరం జిల్లాలో గంజాయి, నాటుసారా నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టి, వాటి నిర్మూలనకు విస్తృత దాడులు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్ఈబీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మట్లాడుతూ.. గ్రామ స్థాయిలో గంజాయి, నాటుసారా, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
2024-25 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు జిల్లాలోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. డిశంబరు 08వ తేదీన ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం కుడి ప్రధాన కాలువ ద్వారా పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని 17 మండలాలలో సుమారు1,31,221 ఎకరాలకు సాగునీరు కల్పించుటకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కార్య నిర్వాహక ఇంజినీరు ఆర్.రామచంద్రరావు తెలిపారు. కొత్త కుడి ప్రధాన కాలువ 117.89 కిలోమీటర్ల పొడవునా 450 చెరువులకు సాగునీరు అందిస్తున్నామన్నారు.
మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్రావు గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చీపురుపల్లిలోని లావేరు రోడ్డులోని ఆయన ఇంటికి మృతదేహాన్ని తీసుకురానున్నారు. కాగా ఏయూలో ఎంఏ పూర్తి చేసిన కెంబూరి..1985లో చీపురుపల్లి MLAగా, 1989లో బొబ్బిలి MPగా గెలిచారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టు వద్ద 105 మీటర్ల నీటిమట్టానికి గాను 103.95 మీటర్లలో నీటిమట్టం ఉంది. ప్రస్తుతం ఒడిశా నుంచి 1000 క్యూసెక్కులు నీరు రాగా అధికారులు ఒక గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు.
వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేసి అందజేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల కార్యాచరణను జిల్లా, మండల, గ్రామ స్థాయిలో తయారుచేయాలన్నారు. గ్రామస్థాయిలో కమిటీ గ్రామ ప్రణాళికను తయారుచేసి అమలుచేయాలని తెలిపారు.
ఆదివాసీ దినోత్సవంను ఆగష్టు 9న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అద్దంపట్టే విధంగా వేడుకలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని మోదీకి లఘుచిత్రం ఉన్న చేనేత వస్త్రాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బహూకరించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానిని నేరుగా కలిసి బహుమతిని అందజేసినట్లుగా ఎంపీ తెలిపారు. ఓ చేనేత కుటుంబం నేసిన వస్త్రాన్ని ప్రధానికి అందించడంతో ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు.
Sorry, no posts matched your criteria.