Vizianagaram

News July 28, 2024

నిబంధనల ప్రకారమే ఆక్రమణ తొలగింపు: MRO

image

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధన్నానపేటలో ఆక్రమణను తొలగించినట్లు నెల్లిమర్ల తహశీల్దార్ ధర్మరాజు స్పష్టం చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన ప్రహరీగోడను, ప్రజా ప్రయోజనాల కోసమే తొలగించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆక్రమణ దారునికి ముందుగా నోటీసులు కూడా ఇచ్చామని, తగిన గడువు ఇచ్చిన తరువాత, అతని నుంచి స్పందన రాకపోవడంతో తొలగించినట్లు తహశీల్దార్ తెలిపారు.

News July 27, 2024

విజయనగరంలో మంత్రి శ్రీనివాస్ షెడ్యూల్ ఇదే..

image

మంత్రి కొండపల్లి శ్రీనివస్ ఆదివారం నాడు జిల్లాలో అందుబాటులో ఉంటారని అధికారులు తెలియజేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో మంత్రి అందుబాటులో ఉంటారని చెప్పారు. ఉదయం 10.15 నుంచి జిల్లా పార్టీ కార్యాలయం (అశోక్ బంగ్లా)లో అందుబాటులో ఉంటారని తెలిపారు.

News July 27, 2024

విజయనగరంలో ఒలింపిక్ సెల్ఫీ పాయింట్

image

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన నేపథ్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద ఒలింపిక్ సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. దీనిని కలెక్టర్ అంబేడ్కర్ ప్రారంభించి, జేసీ కార్తీక్‌తో కలిసి సెల్ఫీ దిగారు. ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అధిక సంఖ్యలో పతకాలు సాధించాలని ఆకాక్షించారు. క్రీడాభిమానులు, యువత కూడా సెల్ఫీ దిగి ఇండియా అథ్లెట్స్‌కు శుభాకాంక్షలు తెలిపాలని కోరారు.

News July 27, 2024

శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఆర్వో

image

ఈ నెల 28 నుంచి ఆగష్టు 2వ తేదీ వరకు జరగనున్న శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DRO ఎస్.డి. అనిత తెలిపారు. గాజులరేగలో ఉన్న సీతం కళాశాలలో, అయాన్ డిజిటల్ జోన్ కేంద్రాలుగా ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 10గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రెండు పూటలా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. DRO ఛాంబర్‌లో ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షించారు.

News July 27, 2024

పార్వతీపురంలో ఈనెల 30న జాబ్ మేళా

image

ఈనెల 30న పార్వతీపురం govt జూనియర్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. sbi లైఫ్ ఇన్సూరెన్స్‌లో సేల్స్ అధికారి, అడ్వైజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 18 సం. పైబడిన పది, 12th, గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 80 ఖాళీలు ఉన్నాయని, www.ncs.gov.in వెబ్‌సైట్‌లోని job seeker లాగిన్‌లో నమోదుచేసుకొని బయోడేటా, 2 పాస్ ఫోటోలతో హాజరుకావాలన్నారు.

News July 27, 2024

విశాఖ: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

image

సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకొని అమ్మాయిల ఫొటోలు ఎరగా చూపి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ వాసి కె.లోకేశ్‌ను అరెస్టు చేసినట్లు విశాఖ సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్ తెలిపారు. ఆ వ్యక్తి మాయలో నగరానికి చెందిన ఓ వ్యక్తి రూ. 28 లక్షలు పోగొట్టుకున్నాడని, అతడి ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. కేసులో సంబంధం ఉన్న మరి కొంతమంది పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

News July 27, 2024

విజయనగరం: టమాటా కిలో రూ.34

image

టమాటా ధరలు బహిరంగ మార్కెట్‌లో ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాటిని రైతు బజార్లలో ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ క్రమంలో విజయనగరంలోని 3రైతు బజార్లలో శనివారం నుంచి కిలో రూ.34కే విక్రయించనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా అధికారులు కోరారు.

News July 27, 2024

పార్వతీపురం: రాయితీపై సోలార్ రూఫ్ టాప్

image

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. రాయితీపై అందిస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించుకునేందుకు చక్కని అవకాశం అన్నారు.

News July 27, 2024

నేడు మంత్రి కొండపల్లి జిల్లా పర్యటన

image

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి 10 గంటలు వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటలు వరకు జిల్లా పరిషత్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారని జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గజపతినగరం కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు.

News July 27, 2024

VZM: సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు

image

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కలెక్టర్ డా. బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు పురుషులకు 10, మహిళలకు 10 వంతున 20 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎం.డి. ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.