Vizianagaram

News July 1, 2024

పెన్షన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు: కమిషనర్

image

పెన్షన్ పంపిణీలో సచివాలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ మల్లయ్య నాయుడు హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పెన్షన్ల మొత్తంలో కమీషన్ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు గుర్తిస్తే తన దృష్టికి తేవాలని సూచించారు. 9849906486 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పరిశీలించి సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News July 1, 2024

పింఛన్ పంపిణీలో రాష్ట్రంలో విజయనగరం జిల్లా టాప్

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛను పథకం ద్వారా పెంచిన పింఛన్లు సోమవారం 96.99 శాతం పంపిణీ చేసి రాష్ట్రంలోనే మెుదటి స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లాలో 2,81,713 మంది లబ్ధిదారులకు గాను 2,73,239 మందికి పింఛన్ పంపిణీ చేసినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. రూ.186,88,88000 పెన్షన్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేస్తే రూ.181,28,63000 పంపిణీ చేశారు.

News July 1, 2024

పార్వతీపురం: అంతర్రాష్ట్ర రహదారిపైకి ఏనుగుల గుంపు

image

పార్వతీపురం నుంచి గుణుపూర్ (ఒడిశా) వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపైకి ఆరు ఏనుగుల గుంపు రావడంతో వాహన చోదకులు భయాందోళన చెందారు. సోమవారం మధ్యాహ్నం ఏనుగుల గుంపు గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపైకి వచ్చాయి. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించడంతో రహదారిపై ఉన్న ఏనుగులను సమీప పంట పొలాలకు వైపు సిబ్బంది వచ్చి తరలించారు. దీంతో రహదారిపై రాకపోకలు యథావిధిగా సాగాయి.

News July 1, 2024

స్టూడెంట్ కిట్లు అందేదెప్పుడు?

image

విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల్లో పాఠశాలలు తెరిచి 18 రోజులు గడిచినా కూడా నేటికీ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు బ్యాగ్ లు, షూలు బయట కొనుక్కోవడం జరుగుతుంది. దీని వలన ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కిట్లు పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు.

News July 1, 2024

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గోనున్న మంత్రి

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గోనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు సాలూరు పట్టణంలోని 21వ వార్డులోని గొల్లవీధి సచివాలయం, 10:30కు కందులపథం, మధ్యాహ్నం 12 గంటలకు మక్కువ మండలం కవిరిపల్లి, 3 గంటలకు పాచిపెంట మండలం మంచాడవలస, సాయంత్రం 4:30కు మెంటాడ మండలం గుర్లతమ్మిరాజుపేట సచివాలయంలో హాజరుకానున్నారు.

News June 30, 2024

విజయనగరం: రబ్బర్ డ్యాం దిగువన వ్యక్తి మృతి

image

కొమరాడ మండలం జంఝావతి రబ్బర్ డ్యాం దిగువున స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. కొమరాడ ఎస్ఐ నీలకంఠం తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం గరుడబిల్లికి చెందిన కలియ దాసు(60) బూర్జి‌వలస స్టోన్ క్రషర్‌లో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం పని ముగించుకుని స్నానానికి నదికి వెళ్ళిన దాసు మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని ఆదివారం గుర్తించి.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News June 30, 2024

మంత్రి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ వినతి 

image

గిరిజన ఆశ్రమ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ ఆదివారం వినతి పత్రం అందజేశారు. జీవోనం-3 ప్రకారం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, గి.సం.శాఖకు మంజూరైన డీఈవో, డివైఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 420 పండిట్ పోస్టులు అప్‌గ్రేడ్ జరిగేలా చూడాలని కోరారు. వారి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. 

News June 30, 2024

నా మొదటి నెల జీతం దానికే: విజయనగరం ఎంపీ

image

అన్ని అలవెన్సులతో తనకు వచ్చే మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు అందజేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ఆయన.. స్వామి సన్నిధిలో ప్రకటించారు. ఆంధ్రుడిగా బాధ్యతతో రాష్ట్ర రాజధాని అభివృద్ధికి తన వంతుగా మొదటి జీతాన్ని అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

News June 30, 2024

ఐటీ రంగం విస్తరణకు కృషి: ఎమ్మెల్యే లోకం మాధవి

image

ఉత్తరాంధ్రలో ఐటీ రంగం విస్తరించడానికి కృషి చేస్తానని, తద్వారా ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. విశాఖపట్నంలో శనివారం రాత్రి జరిగిన ITAAP (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఐటీ రంగం విస్తరణకు అవసరమైన వనరులపై ఈ సందర్భంగా చర్చించారు.

News June 30, 2024

VZM: జిల్లాలో 295 మందికి చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను ఆదివారం వెల్లడించారు. ఎంవీ నిబంధనలు అతిక్రమించిన 295 మందిపై రూ.57,065 ఈ-చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 11 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 22 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయన్నారు.