Vizianagaram

News June 25, 2024

విజయనగరం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంబేడ్క‌ర్

image

విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్ అంబేద్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లాకు బదిలీ మీద వెళ్తున్న ప్రస్తుత కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి నుంచి ఆయన చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని రంగాలపై అవగాహన పెంచుకుంటానని, ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు చేసేందుకు, ప్రజోపయోగ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

News June 25, 2024

విజయనగరం జిల్లా కలెక్టర్‌కు వీడ్కోలు

image

జిల్లా కలెక్టర్‌గా గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నగరంలో సోమవారం సాయంత్రం జరిగింది. జిల్లా అధికారుల సంఘం, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీ.సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.దీపిక, జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ పాల్గొని కలెక్టర్‌కు వీడ్కోలు తెలిపారు.

News June 25, 2024

VZM: జిల్లా వ్యాప్తంగా 351 మందికి ఈ చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను మంగళవారం వెల్లడించారు. ఎంవీ నిబంధనలు అతిక్రమించిన 351 మందిపై రూ.75,410 ఈ-చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 19 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 27 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయన్నారు.

News June 25, 2024

VZM: ఇంటింటికి ORS ప్యాకెట్లు, జింక్ మాత్రల పంపిణీ.. జేసీ

image

విజయనగరం జిల్లాలో అతిసారం వ్యాధి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ కే.కార్తీక్ చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఐదేళ్ల లోపు పిల్లలు వ్యాధి బారిన పడకుండా ఇంటికి ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను, జింక్ మాత్రలను పంపిణీ చేయాలన్నారు.

News June 25, 2024

VZM: నేడు జిల్లాకు కొత్త కలెక్టర్

image

విజయనగరం జిల్లా కలెక్ట‌ర్‌గా నియమితులైన బీ.ఆర్.అంబేడ్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం జిల్లాకు చేరుకుంటారు. కలెక్టరే‌ట్‌లో మధ్యాహ్నం ప్రస్తుత కలెక్టర్ నాగ లక్ష్మి ఆయనకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అవుతారని తెలియజేశారు.

News June 25, 2024

VZM: ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు

image

విశాఖ – విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేయడంతో ఆర్టీటీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ద్వారక బస్ స్టేషన్ నుంచి 12 ప్రత్యేక సర్వీసులు, శ్రీకాకుళం విజయనగరం నుంచి మరో మూడు ప్రత్యేక సర్వీసులు విజయవాడకు నడుపుతామన్నారు. వందే భారత్ రైలు ప్రయాణికుల కోసం విశాఖ నుంచి విజయనగరానికి రాత్రి వేళల్లో ప్రత్యేక బస్ సర్వీసు ఏర్పాటు చేశామన్నారు.

News June 25, 2024

జీఓ 117ను రద్దు చేయాలని మంత్రి లోకేశ్‌కు వినతి 

image

G.O 117ను రద్దు చెయ్యాలని మంత్రి లోకేశ్‌ను ఆప్తా సంఘం నాయకులు కోరారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి లోకేశ్ పేషీలో రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్‌రావు, సహాధ్యక్షుడు మెహది సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. తల్లికి వందనం ద్వారా ఇచ్చే ఆర్థిక లబ్ధి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలని కోరారు. వారి వినతులపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

News June 24, 2024

శభాష్ నితీశ్ కుమార్ రెడ్డి..!

image

విశాఖ బ్యాటింగ్ డైనమైట్, SRH ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇండియా టీ-20 టీంకు ఎంపికైన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. క్రికెట్ చరిత్రలో విశాఖ పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేస్తున్న సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నితీశ్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల ACA గౌరవఅధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

News June 24, 2024

VZM: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

గంట్యాడ మండలంలోని వసాది గ్రామానికి చెందిన బొదంకి ఎర్రి నాయుడు(47) పిడుగు పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గంట్యాడ ఎస్సై సురేంద్ర నాయుడు అందించిన వివరాలు ప్రకారం.. మృతుడు పొలంలో పనులు చేసేందుకు వెళ్లగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

News June 24, 2024

విజయనగరం జిల్లాలో నిరుద్యోగులకు శుభవార్త

image

ప్రైవేటు కంపెనీల్లో మొత్తం 310 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 27న 10 గంటల నుంచి ఎంఆర్ కాలేజ్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.అరుణ తెలిపారు. హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్‌లో ప్రొడక్షన్, ముత్తూట్ ఫైనాన్స్‌లో రిలేషన్షిప్ ఆఫీసర్, జాబ్ డీలర్స్ కంపెనీలో ఫ్రంట్ ఆఫీస్, టెలీ కాలింగ్, హెల్పర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ వంటి ఉద్యోగాల భ‌ర్తీ జరుగుతుందని తెలిపారు.