Vizianagaram

News November 30, 2024

VZM: ప‌రిశ్ర‌మ‌లు ప్రారంభించ‌క‌పోతే భూకేటాయింపు ర‌ద్దు 

image

ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించిన భూముల్లో నిర్ణీత గ‌డువులోప‌ల‌ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌క‌పోతే, కేటాయింపుల‌ను ర‌ద్దు చేయాల్సి ఉంటుంద‌ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా స్థాయి సమీక్షలో శనివారం ఆయన మాట్లాడారు. త్వ‌ర‌లో బొబ్బిలి గ్రోత్ సెంట‌ర్‌ను సంద‌ర్శించి, కేటాయింపుల‌పై స‌మీక్షిస్తామ‌ని అన్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించిన భూముల‌పై స‌మ‌గ్ర నివేదిక‌ను త‌యారు చేయాల‌ని ఆదేశించారు.

News November 30, 2024

పేదవాడి ముఖంలో ఆనందం చూడటమే లక్ష్యం: మంత్రి

image

సాలూరు పట్టణం 21వ వార్డులో లబ్ధిదారులు ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పంపిణీ చేశారు. ప్రతి పేదవాని ముఖంలో ఆనందం చూడడమే ప్రభుత్వ ధ్యేయమని అందుకు తగ్గట్టుగా ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారన్నారు.

News November 30, 2024

విజయనగరం నుంచి గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్

image

కోమటిపల్లి స్టేషన్‌లో అభివృద్ధి పనుల దృష్ట్యా డిసెంబర్ 4వ తేదీ వరకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం జంక్షన్ నుంచి రాకపోకలు సాగిస్తుందని వాల్తేర్ డీసీఎం సందీప్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ట్రైన్ నంబర్ 17243 /44 గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరారు.

News November 30, 2024

VZM: భార్య, కుమారుడి మృతి.. భర్త ఆత్మహత్య

image

పటాన్‌చెరు పరిధిలో విజయనగరం జిల్లా వాసి శుక్రవారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. విజయనగరం జిల్లా డెంకాడ మండలం రామచంద్రాపురానికి చెందిన రామానాయుడు(38) భార్యతో కలిసి HYD వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా 9ఏళ్ల క్రితం భార్య సూసైడ్ చేసుకోగా పిల్లలు అత్తామామల వద్ద ఉంటున్నారు. 4 నెలల క్రితం చిన్న కొడుకు చెరువులో పడి చనిపోయాడు. కుమిలిపోయిన అతడు బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు.

News November 30, 2024

హోం మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష: కలెక్టర్

image

జిల్లా సమీక్షా సమావేశం శనివారం జరుగుతుందని కలెక్టర్ అంబేద్కర్ ఒక తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారన్నారు.

News November 29, 2024

విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ

image

విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌విఎస్ కేకే.రంగారావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.

News November 29, 2024

మీ ప్రాంతంలో ధాన్యం సేకరణ ఎలా ఉంది?

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరి నూర్పులు పూర్తి కాగా పండించిన పంటను ధాన్యం కోనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్రాలను 250 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. మరి మీ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు సేకరణ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News November 29, 2024

విజయనగరం జిల్లాలో విషాదం

image

ఎస్.కోట మండలంలో 2 వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్.కోటకు చెందిన విశాలక్ష్మి (86) బుధవారం వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను విశాఖ తరలించగా అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందారు. అదేవిధంగా వెంకటరమణ పేట గ్రామానికి చెందిన సన్నమ్మ మెట్ల నుంచి జారిపడగా మెరుగైన చికిత్స కోసం KGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.

News November 29, 2024

గంజాయి రవాణాపై 289 కేసులు: DIG

image

గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్నా 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.

News November 28, 2024

గంజాయి రవాణాపై 289 కేసులు: DIG

image

గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్న 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.