India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజకీయాల్లో పలకరింపులు సహజమని బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి కొండపల్లి తన కాళ్ళకు నమస్కారం చేశారనే ఆరోపణలపై బొత్స స్పందించారు. లోకేశ్ తనకి షేక్ హ్యాండ్ ఇచ్చారని, పవన్ కళ్యాణ్కు ఎదురుగా వెళ్లి కలిశారని.. అవన్నీ సహజమన్నారు. ఎయిర్ పోర్టులో బండారు, పల్లా, కలిశెట్టి కలిశారని అందులో తప్పేముందన్నారు. ఎవరైతే క్రియేట్ చేసుకొని కొండపల్లిపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారో వారే సమాధానం చెప్పాలన్నారు.
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి కొత్తగా నడపనున్న రైలు 9 రైల్వే స్టేషన్లలో ఆగనుంది. విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం రైల్వే స్టేషన్లలో ఆగి మధ్యాహ్నం 12.20 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది. తిరిగి 12.45కు బయలుదేరి సాయంత్రం 4కి విశాఖ చేరుకుంటుంది. >Share it
నకిలీ IPS సూర్య ప్రకాష్ ఉన్నత చదువులే చదివాడు. స్థానికంగా బీటెక్ పూర్తి చేసిన ఈయన కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో MBA చేశాడు. 2003లో ఇండియన్ ఆర్మీలో సిపాయిగా ఎంపికయ్యాడు. 2005లో ఉద్యోగం విడిచిపెట్టి 2016 వరకు కాంట్రాక్ట్ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. కాగా పవన్ పర్యటనలో IPS అంటూ తిరుగుతూ దిగిన ఫొటోలను వాట్సప్ స్టేటస్ పెట్టుకోగా ఎంక్వైరీలో అసలు విషయం బయట పడిందని పోలీసులు తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని 20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ సూచించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఎయిర్ ఫోర్ట్ అంశాన్ని ప్రస్థావించారు. అవసరాలకు తగ్గట్టుగా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు సిద్ధం చేయాలన్నారు.విమానాశ్రయం ద్వారా ఎగుమతులకు ఉన్న అవకాశాలపై ఇప్పటినుంచే దృష్టిపెట్టాలన్నారు.
వైద్యాధికారులు గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితుల్ని తెలుసుకొని వాటికి తగ్గట్టుగా బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్యాధికారులతో సమీక్షించారు. గత మూడు నెలలుగా డయేరియా అంశం జిల్లాను పట్టి పీడిస్తోందని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేలా వాస్తవాలను వెల్లడించి నమ్మకం కలిగించాలని తెలిపారు.
నూతన సంవత్సర వేడుకల ఈవెంట్స్కు పర్మిషన్ తప్పనిసరి అని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు తెలిపారు. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలో లిక్కర్తో పార్టీలు జరుపుకునే వారు ఎక్సైజ్ సీఐ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని అని ఆయన తెలిపారు. సీఐ సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు పార్వతీపురం జిల్లా ఎక్సైజ్ అధికారి మొబైల్ నంబర్ 9490642242 ను సంప్రదించాలన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. మక్కువ మండలంలోని గిరి శిఖర గ్రామమైన బాగుజోల పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ ఐపీఎస్తో పలువురు పోలీసులు సైతం ఫొటోలు దిగడం చర్చీనీయాంశమైంది. కాగా ఆయన ఎవరనేది పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయనగరం జిల్లాలో నిన్న వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. బొత్స సత్యనారాయణ నియోజకవర్గమైన చీపురుపల్లిలో సైతం భారీ ర్యాలీ జరిగింది. నిన్న విజయనగరం జిల్లాలోనే బొత్స ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఏ ధర్నాలోనూ పాల్గొనలేదు. శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా, వైసీపీలో కీలకంగా ఉన్న ఆయన ఆందోళనల్లో పాల్గొనలేదనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానిస్టేబుల్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు VZM పోలీస్ పరేడ్ గ్రౌండులో పీఎంటీ, పీఈటీ పరీక్షలు డిసెంబరు 30 నుంచి జనవరి 22 వరకు నిర్వహిస్తున్నట్లుగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లాలో 9,152 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు అర్హత సాధించగా అందులో 1,584 మంది మహిళలు ఉండగా 7,568 మంది పురుషులు ఉన్నారు. ఉదయం 4 గంటలకు పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్దకు హాజరు కావాలన్నారు.
పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి పార్వతీపురానికి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈ రైలు 08565/66 జనవరి 10 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 పార్వతీపురం చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో పార్వతీపురం నుంచి 12.45 బయలుదేరి సాయంత్రం 4కి విశాఖ చేరుతుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.