Vizianagaram

News December 25, 2024

విజయనగరంలో వర్షాలపై వాతావరణ శాఖ UPDATE

image

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో బలహీన పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంతో పాటు నెల్లూరు జిల్లాలకు మరో 24 గంటల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

News December 25, 2024

VZM: ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు

image

యేసు క్రీస్తు జననం సందర్భంగా జిల్లాలో నిర్వహించే క్రిస్టమస్ వేడుకల్లో ఎటువంటి అల్లర్లు, మతపరమైన తగాదాలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా చర్చిల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎటువంటి అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లను సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారన్నారు.

News December 25, 2024

విశాఖ R.K బీచ్‌లో నేవీ విన్యాసాలకు సన్నద్ధం..!

image

ఆకాశమే హద్దుగా సంద్రంలో నావికాదళం చేసే యాక్షన్-ప్యాక్డ్ క్షణాలను తిలకించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని నేవీ అధికారులు పిలుపునిచ్చారు. విశాఖ ఆర్కే బీచ్‌లో జనవరి 4న(2025) సాయంత్రం 4 గంటలకు మెరైన్ కమాండోలు, NCC క్యాడెట్లు, నావల్ బ్యాండ్ అద్భుతమైన విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ఈనెల 28,29, జనవరి 2న రిహార్సల్స్ చేయనున్నట్లు వెల్లడించారు. >Share it

News December 25, 2024

యువతిని మోసం చేసిన వ్యక్తికి రిమాండ్: సీఐ

image

ఎస్.కోట మండలం రాజీపేటకి చెందిన వాడుబోయిన ఎర్రినాయుడు (19) పై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసగించాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేశామని సీఐ మూర్తి తెలిపారు. అతడిని కాపు సోంపురం వద్ద మంగళవారం అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం విజయనగరం డీఎస్పీ వద్దకు తీసుకెళ్ళగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. 

News December 25, 2024

విజయనగరం: మహిళ అనుమానాస్పద మృతి

image

విజయనగరం – కోరుకొండ రైల్వే స్టేషన్ మధ్యలో సారిక సమీపంలో పట్టాలు పక్కన గుర్తు తెలియని మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. రైల్వే ఎస్ఐ బాలాజీరావు వివరాలు మేరకు.. వయసు 25-30 ఏళ్ల మధ్యలో, ఐదు అడుగులున్న ఎత్తు ఉంటుంది. ఆమె వివరాలను గుర్తించిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని కోరారు. 

News December 25, 2024

గంజాయి రవాణా పై కఠినంగా వ్యవహారించాలి: VZM SP

image

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షను ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. గంజాయి రవాణ నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలని, రవాణకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తూనే, వారికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని గుర్తించాలన్నారు.

News December 24, 2024

బొబ్బిలిలో యాక్సిడెంట్.. చికిత్స పొందతూ మృతి

image

బొబ్బిలి హైవేపై అదివారం స్కూటీపై ప్రయాణిస్తున్న యువకుడుని లారీ ఢీ కొట్టింది. గుర్ల మండలం గొలగంకి చెందిన నడిమువలస రాంబాబు (26) బొబ్బిలిలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు రోజులుగా ప్రాణాలతో పోరాడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

News December 24, 2024

ప్రత్యేక అలంకరణలో పైడితల్లమ్మ

image

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకుజామున అమ్మవారికి విశేష అర్చనలు జరిపించి, పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.

News December 24, 2024

VZM: పవన్ కళ్యాణ్ అభిమాని ఇంట్లో విషాదం`

image

కొత్తవలస మండలం రామలింగాపురంలో <<14964633>>బ్రైన్ ట్యామర్‌<<>>తో అఖిర్ నందన్(6) చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడి తండ్రి అప్పలరాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. దీంతో పవన్ కళ్యాణ్ కుమారుడి పేరు కలిసేలా అఖిర్ నందన్ అని తన కుమారిడికి పేరు పెట్టుకుని మురిసిపోయాడు. కానీ విధి ఆడిన వింతనాటకంలో చిన్న వయస్సులో తన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News December 24, 2024

VZM: జనసేన క్యాడర్‌ను నడిపే లీడర్ ఎవరు?

image

ఉమ్మడి విజయగనరం జిల్లాలో క్షేత్రస్థాయిలో జనసేన ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. అయితే జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. నెల్లిమర్ల MLA లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ 2017లో జిల్లా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వహించగా..2019 ఎన్నికల అనంతరం ఆయన్ను తప్పించారు. ప్రస్తుతం ఈ పదవికి ప్రసాద్‌తో పాటు అవనాపు విక్రమ్, మర్రాపు సురేశ్, పాలవలస యశస్వి, అయ్యలు, తదితరులు ఆశిస్తున్నట్లు సమాచారం.