Vizianagaram

News March 19, 2024

సింహాచలం: చందనోత్సవం రోజున అంతరాలయ దర్శనాలు రద్దు

image

సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో మే 10వ తేదీన నిర్వహించే చందనోత్సవం రోజున అంతరాలయ దర్శనాలు రద్దు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఉత్సవానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ రోజున కేవలం విధుల్లో ఉన్న వైదికలు, ఆలయ సంప్రదాయం ప్రకారం అనుమతులు ఉండే వాళ్లకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పించాలని సూచించారు. ఆరోజున ఘాట్ రోడ్డులో కేవలం మినీ బస్సులు మాత్రమే నడపాలని అన్నారు.

News March 19, 2024

జామి: మైనర్‌పై దాడి నిందుతుడికి జైలు శిక్ష

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఏడేళ్ల జైలు, రూ.3,500 జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానం సోమవారం తీర్పు ఇచ్చిందని విజయనగరం SP దీపిక ఎం.పాటిల్ తెలిపారు. జామి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఆబోతుల సత్తిబాబు (45) మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా బాలిక తల్లి 20 సెప్టెంబర్ 2023న పిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన కోర్ట్ నిందుతుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందని SP తెలిపారు.

News March 19, 2024

VZM: 50 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్షకు హాజరు

image

చదువుకి వయసుతో సంబంధం లేదని గుమ్మలక్ష్మిపురం మండలానికి చెందిన పెద్దమ్మి నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మూలపాడుకి చెందిన 53 ఏళ్ల పెద్దమ్మి సోమవారం పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. 7వ తరగతి వరకు చదివిన ఆమె అనివార్య కారణాలతో చదువు ఆపేశానాని, చదువుపై ఆసక్తితో మళ్లీ పరీక్షలు రాస్తున్నట్టు తెలిపింది. సోమవారం పరీక్ష రాసేందుకు భద్రగిరి ఏపీఆర్ కేంద్రానికి వచ్చారు.

News March 18, 2024

VZM: సచివాలయ ఉద్యోగి మృతి.. ఎక్స్‌గ్రేషియా అందజేత

image

వేపాడ(M) <<12875448>>కుంపల్లి<<>>కి చెందిన డెక్క చిరంజీవి(32) అనకాపల్లి జిల్లా దేవరాపల్లి(M) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిన్న ములకలాపల్లి పాలకేంద్రం వద్ద స్తంభానికి కట్టిన పోస్టర్‌ తొలగిస్తుండగా కరెంట్ షాక్‌ తగిలి మృతిచెందాడు. బాధిత కుటుంబానికి కలెక్టర్ రవి పటాన్ శెట్టి ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కుని మృతుడి భార్య హేమలతకు అందజేశారు.

News March 18, 2024

విజయనగరంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

image

విజయనగరం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగు చూసినట్లు ఎస్.ఐ హరిబాబు నాయుడు వెల్లడించారు. రిలయన్స్ మాల్‌కి ఎదురుగా ఉన్న తుప్పల్లో ఉరి వేసుకుని మరణించినట్లు వీఆర్వో సమాచారం అందించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News March 18, 2024

కొత్తవలస: రైల్వే పట్టాలు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

కొత్తవలస రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఔట్ పోస్ట్ పరిధి కంటకాపల్లి నిమ్మలపాలెం మధ్యలో గుర్తు తెలియని మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. వెళ్తున్న రైలు నుంచి జారీ పడి మరణించాడని ఆర్ఫీఫ్ పోలీసులు భావిస్తున్నారు. విజయనగరం జీఆర్పీ పోలీసులకు తెలిపామని అధికారి ఎఎస్ఐ కె. యు.ఎం. రావు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2024

ఈరోజు సాయంత్రం 3 గంటల వరకే టైం:  మన్యం పిఓ

image

సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 3 గంటలలోగా ప్రైవేటు స్థలాల్లో వివిధ రాజకీయ నాయకుల ప్లెక్సీలు, జెండాలను తొలగించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడిఏ పిఓ విష్ణు చరణ్ ఆదేశించారు. సోమవారం పాచిపెంట మండలం పి కొనవలస, పాచిపెంటలో పర్యటించారు. పి కొనవలస ఐటీడీఏ బంగ్లాలో జరుగుతున్న పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈఈ జే సంతేశ్వరరావు, డీఈ ఏ మనిరాజ్, ఏఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

News March 18, 2024

విజయనగరం: ‘త్వరలో నా నిర్ణయం ప్రకటిస్తా’

image

విజయనగరం నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని పోటీలో నిలపడంపై నిర్ణయం తీసుకుంటామని వైసీపీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు అన్నారు.ఆదివారం అంబటి సత్రంలో ఆయన మాట్లాడారు.ఉత్తరాంధ్రలో వైసీపీ యాదవులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, జిల్లాకు సంబంధించి ఒక్క పార్టీకూడా తమ వర్గాన్ని పట్టించుకోలేదన్నారు. పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నా..టికెట్ ఇవ్వలేదని, వైసీపీ మోసం చేసిందన్నారు.

News March 18, 2024

సింహాచలం ఆలయంలో ఎన్నికల కోడ్ అమలు

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన సింహాచలం ఆలయంలో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. ఇక నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వీఐపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రోటోకాల్ దర్శనాలు, అతిథి మర్యాదలు ఉండవు. ఎంతటి వారైనా సాధారణ భక్తులు లాగే స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే సిఫార్సు లేఖలూ చెల్లవని స్పష్టం చేశారు.

News March 18, 2024

VZM: సచివాలయ ఉద్యోగి మృతి

image

విజయనగరం జిల్లా వేపాడ(M) కుంపల్లికి చెందిన వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. డెక్క చిరంజీవి(32) అనకాపల్లి జిల్లా దేవరాపల్లి(M) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిన్న ములకలాపల్లి పాలకేంద్రం వద్ద స్తంభానికి కట్టిన పోస్టర్‌ తొలగిస్తుండగా కరెంట్ షాక్‌ తగిలి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. SI డి.నాగేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.