India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెరకముడిదాం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బందపు ఈశ్వరప్రసాద్ గరివిడి మండలంలోని కాపుశంభాం జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. అంత్యక్రియలను మంగళవారం ఆయన స్వస్థలం భీమవరంలో అధికార లాంఛనాలతో జరిగాయి. జవాన్ ఈశ్వరప్రసాద్ భార్య వినూత్న తలకు, కాలికి గాయాలు కావడంతో ఆమె ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది.
బంధువు ఇంట్లోనే ఓ మహిళ చోరీ చేసింది. ఈ సంఘటన పూసపాటిరేగ మండలం సీహెచ్ అగ్రహారంలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొళ్లి సత్యం ఇంట్లో మూడు తులాల బంగారం, వెండీ, నగదు చోరీకి గురి అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని సత్యం బంధువు అయిన మొళ్లి రామలక్ష్మి చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారించగా తనే చేసినట్లు ఒప్పుకుంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 19న జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నుంచే జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో రైతులు తమ పంటకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వాతావరణ కేంద్రం జిల్లాకు వచ్చే మూడు రోజుల్లో భారీవర్షాల హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులను క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తం చేశారు. వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే గ్రామాల్లో ఇప్పటికే వరి పంట కోతలు పూర్తిచేసి కుప్పలుగా వేసిన ధాన్యం నూర్చవద్దని సూచిస్తున్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ప్రజలకు మరింత చేరువ చేసేందుకుగాను ప్రత్యేకంగా రూపొందించిన ‘సంకల్పం’ గీతాన్ని, పోస్టర్లును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన కాకర్ల గాంధీ మాష్టర్ రచన, స్వర కల్పన, గానం చేసి, సంగీతాన్ని అందించి, ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని ఇకపై సంకల్పం ప్రచార కార్యక్రమంలో ఉపయోగిస్తామన్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 19న జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. రైతులకు తమ వరి పంటకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. షెడ్యూల్డ్ కులాల వారీగా వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాస్థితిగతులపై ఆరా తీశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఎస్సీల్లో ఉప కులాల వారీగా వెంటనే వివరాలను అందజేయాలని కోరారు.
భార్య గర్భవతి అని తెలిసి ఆర్మీ జవాన్ అయిన భర్త ఎంతో సంతోషించాడు. సెలవుల నిమిత్తం ఇంటికొచ్చిన ఈశ్వరరావు భార్యను టెస్ట్ల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. భార్య కళ్ల ఎదుటే జవాన్ మృతి చెందాడు. భార్య వినూత్నకు తీవ్ర గాయాలయ్యాయి. మెరకముడిదాం మండలం భీమవరం దంపతులు (ఈశ్వరరావు& వినూత్న) గరివిడి మండలం కాపు శంబాం జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
బొబ్బిలి కూరగాయాల బజారులో క్యాబేజీ ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 60 కేజీల క్యాబేజీ బస్తా కేవలం రూ.300 పలికింది. 10 నుంచి 12 పువ్వులు ఉన్న బాస్కెట్ రూ.60 మాత్రమే పలకడంతో విస్తుపోవడం రైతులు వంతైంది. గతేడాది ఒక క్యాబేజీ కనీసం రూ.10 నుంచి రూ.15 ధర లభించింది. ప్రస్తుత ధరలతో ఎకరాకు రూ.40 నుంచి రూ.60 వేల వరకు నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విశాఖ జిల్లా పద్మనాభం మండలం పొట్నూరుకి చెందిన అప్పలనాయుడుకు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షను కోర్టు విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మెంటాడకు చెందిన బాలికను ప్రేమ పేరిట శారీరకంగా అనుభవించి మోసం చేశాడనే ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైందన్నారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.