Vizianagaram

News January 6, 2026

VZM: ఈనెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా సోమవారం తెలిపారు. మూడు ఫార్మా కంపెనీల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామన్నారు. 18 ఏళ్లు పైబడిన పది, ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పురుష అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 105 ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

News January 6, 2026

VZM: ఈనెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా సోమవారం తెలిపారు. మూడు ఫార్మా కంపెనీల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామన్నారు. 18 ఏళ్లు పైబడిన పది, ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పురుష అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 105 ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

News January 6, 2026

VZM: ఈనెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 8న మహారాజా కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా సోమవారం తెలిపారు. మూడు ఫార్మా కంపెనీల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామన్నారు. 18 ఏళ్లు పైబడిన పది, ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పురుష అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 105 ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

News January 5, 2026

జిల్లా పోలీస్ కార్యాలయానికి 31 అర్జీలు

image

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మొత్తం 31 వినతులను స్వీకరించారు. వీటిలో భూతగాదాలు 10, కుటుంబ కలహాలు 3, చీటింగ్ కేసులు 3, నగదు లావాదేవీలకు సంబంధించి 2, ఇతర అంశాలపై 13 ఫిర్యాదులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సంబంధిత అధికారులు విచారణ చేసి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని 7 రోజుల్లో పరిష్కరించాలి అని ఆదేశించారు.

News January 5, 2026

విజయనగరం జిల్లాలో రేపు మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. గంట్యాడ మండలం రాచకిండాంలో వరి పొలాల్లో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. తదుపరి బొండపల్లి మండలంలోని రైతు సేవా కేంద్రం, రైస్ మిల్లును సందర్శిస్తారు. మధ్యాహ్నం పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం డెంకాడ, భోగాపురం మండలాల్లో రైతు సేవా కేంద్రాలు, పొలాలు, ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేస్తారు.

News January 5, 2026

విజయనగరంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

విజయనగరం నగరపాలక పరిధి ధర్మపురిలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు జరిగింది. ఈ ప్రమాదంలో గుర్ల మండలం నాగలవలస గ్రామానికి చెందిన రాంబాబు అనే యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 5, 2026

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి కొండపల్లి

image

ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో పాల్గొని వినతులు స్వీకరించారు. రెవెన్యూ ఫైళ్లను తిరస్కరించే సమయంలో సరైన కారణాలు తప్పనిసరిగా నమోదు చేయాలనే విధంగా మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News January 5, 2026

నిత్య జీవితంలో క్రీడలు భాగం కావాలి: కలెక్టర్

image

చింతలవలసలోని ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌లో నిర్వహిస్తున్న 37వ వార్షిక క్రీడా పోటీలను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి, సమష్టి తత్వాన్ని అలవర్చుకునేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట APSP కమాండెంట్ రవిశంకర్ రెడ్డి ఉన్నారు.

News January 5, 2026

మరికొన్ని గంటల్లో అర్జీలను స్వీకరించనున్న VZM కలెక్టర్

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News January 5, 2026

విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉదయ్

image

గజపతినగరంకు చెందిన దేవర ఉదయ్ కిరణ్‌ను భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం నియమించింది. ఈ మేరకు పార్టీ జిల్లా అద్యక్షుడు రాజేష్ వర్మ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయ్ కిరణ్‌కు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.