India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంకో ఐదు రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈ తరుణంలో విజయావకాశాలపై ఎరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఇటీవల బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో గెలుస్తామని నిన్న తిరుపతిలో కోలగట్ల అన్నారు. మరి విజయనగరంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఎం.దీపిక పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది గడచిన 24 గంటల్లో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. మోటార్ వెహికల్ నిబంధనలు అతిక్రమించిన 287 మందికి రూ.91,795 ఈ-చలానాలను విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 11 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నమోదు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది.
ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై ఈనెల 31న విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన రఘురాజు వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని మండలి ఛైర్మన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం అనర్హతపై ఛైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎన్నికల ముందు అతని భార్య టీడీపీలో చేరగా ఆయన మాత్రం వైసీపీలో ఉంటూ టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు విమర్శలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో బాల్య వివాహాలకు అడ్డుకట్టపడడంలేదు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, అవగాహన లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులో అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. దీంతో జిల్లాలో టీనేజీ ప్రెగ్నెన్సీ శాతం క్రమేపి పెరిగి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. 2023-24లో గర్భందాల్చిన వారిలో బాలికల శాతం పార్వతీపురం మన్యం జిల్లాలో 9.71% ఉండగా.. విజయనగరం జిల్లాలో 8.41 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
బెస్ట్ వాల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇన్ ఏషియాలో ఏయూకు మెరుగైన స్థానం లభించింది. ఆసియాలోని 20 దేశాలలో 3,349 ఉన్నత విద్యాసంస్థలను అధ్యయనం చేసి ఈ స్థానాలు ప్రకటించారు. ఏయూ అత్యుత్తమమైన వర్సిటీల్లో మొదటి 9 శాతంతో 271 ర్యాంక్ సాధించింది. అధికారిక ఉత్తర్వులను ఏయూ వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్లకు అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీఎన్ ధనుంజయరావు అందజేశారు.
పిల్లల సరదాలు కన్నపేగుకు కడుపుకోతను మిగిలుస్తున్నాయి. బొబ్బిలి మండలంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోనంగి సాయి ఏకైక సంతానం కావడంతో అతని తల్లిదండ్రుల ఆర్తనాదాలకు అవధులు లేవు. అటు జామి ఘటనలో మరణించిన షాకిద్ ఖాన్ తల్లిదండ్రులు రోజువారీ కూలీ చేసుకుంటూ చదిస్తున్నారు. ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన ఏకైక మగ సంతానం మహమ్మద్ అస్రాఫ్ మరణవార్త విన్న అతని అమ్మానాన్న శోక సంద్రంలో మునిగిపోయారు.
గర్భిణులు పొందుతున్న సేవలపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా మాతృ, శిశు మరణాలు సమీక్ష ఉప కమిటీ చైర్మన్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మార్చి, ఏప్రిల్ నెలలో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణులపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.
మధ్యప్రదేశ్లోని బాంధవగఢ్ టైగర్ ఫారెస్టులో బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన పర్యటిస్తున్నారు. తనకు ఇష్టమైన వన్యప్రాణులకు ఫోటోలు తీస్తూ సేద తీరుతున్నారు. బేబినాయన తీస్తున్న ఫోటోలు ‘కాక ఆంగ్లం మ్యాగజైన్’లో ప్రచురితం అవుతాయి. గతంలో తల్లీపిల్ల పులుల ఫోటోకు అంతర్జాతీయ అవార్డును బేబినాయన సొంతం చేసుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద వాహనాల పార్కింగ్ కేంద్రం బయట ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్దేశిత ప్రదేశంలో వాహనాలను నిలుపుదల చేయాలని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రంలోనికి ప్రవేశించే వారికి విధిగా పాస్ ఉండాలని ఆయన చెప్పారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడ ఎక్కువ మంది గుమికూడరాదని ఆయన అన్నారు.
Sorry, no posts matched your criteria.