India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరంలోని సాలిపేట రహదారిలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆక్రమణలను మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య ఆదేశాలతో పట్టణ ప్రణాళిక సిబ్బంది మంగళవారం తొలగించారు. ఎన్సీఎస్ థియేటర్ రోడ్లో అనధికార ప్రకటన బోర్డులను తొలగించారు. సాలిపేట రోడ్లో అనధికారికంగా నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రణాళిక విభాగం అధికారులు నిర్మాణ దశలోనే వాటిని అడ్డుకున్నారు. ఆక్రమణలను ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు.
అలనాటి ప్రముఖ సినీ నటి సూర్యకాంతం కుటుంబ సభ్యులు విజయనగరంలో మంగళవారం పర్యటించారు. సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభ మూర్తి, కోడలు ఈశ్వరరాణి, తదితరులు గురజాడ అప్పారావు మ్యూజియాన్ని సందర్శించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ అప్పారావు ముని మనవడు గురజాడ ప్రసాద్ పాల్గొన్నారు.
డిసెంబర్ 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎ అదాలత్లో పలు కేసుల్లో ఇరు వర్గాలకు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రాజేశ్ కుమార్ సూచించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల న్యాయమూర్తులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కు బౌన్స్, తదితర కేసులను ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.
జిల్లాలో అనర్హత గల వారు పింఛన్లు పొందుతున్న వారిపై గ్రామాల్లో సర్వే విస్తృతంగా జరుగుతోంది. సామాజిక పింఛన్లు తీసుకుంటున్న వారి ఇళ్లకు అధికారులు, సిబ్బంది వెళ్లి అర్హతలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన నియమావళితో ఇళ్లకు వెళ్లి ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. వయస్సు, కరెంట్ బిల్లు, నాలుగు చక్రాల వాహనం, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం, ధ్రువీకరణ పత్రాలు, తదితర వాటిపై ఆరా తీస్తున్నారు.
APSSDC ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని విజయనగరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు https://forms.gle/Xoy8SHAdaZCtugb1A లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి సౌద్ అరేబియాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. >Share it
APSSDC ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని విజయనగరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు https://forms.gle/Xoy8SHAdaZCtugb1A లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి సౌద్ అరేబియాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. >Share it
విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో రాష్ట్రీయ కిశోర స్వస్థ కార్యక్రమంలో భాగంగా ఖాళీగా ఉన్న హెల్త్ కౌన్సిలర్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు DMHO రాణి సోమవారం తెలిపారు. డిగ్రీ సోషల్ వర్క్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, 25 నుంచి 30 ఏళ్లు ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులందరూ vizianagaram.nic.inను సంప్రదించాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని వైసీపీ క్యాడర్కు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ నేతలతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రైతు సమస్యలపై ఈనెల 13న, విద్యుత్ ఛార్జీల మోతపై27న, విద్యార్థుల సమస్యలపై జనవరి 3న సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. నేతలు ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు.
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన గొర్లి రాము జీవనోపాధి కోసం విజయనగరం జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం పాలు పాకెట్ కోసం వెళ్లిన సమయంలో లారీ ఢీకొనడంతో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. రాము మృతి చెందడంతో దత్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
డెంకాడ మండలం చందకపేట ధాన్యం సేకరణ కేంద్రం వద్ద రైతులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి నాదేండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి గిట్టుబాటు ధర, నగదు జమపై ఆరా తీశారు. రైతులకు అండగా ఉంటామని, 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.