India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లాలో సజావుగా, ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రతీఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ దీపిక కోరారు. విజయనగరం పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన అభ్యర్ధులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
జామి వాటర్ ఫాల్స్లో గల్లంతైన విజయనగరం కంటోన్మెంట్కు చెందిన<<13330025>> ముగ్గురు <<>>యువకులలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఇంకొకరి కోసం APSDRF బృందాల చేత గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తమ పిల్లల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.యువకుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జామి వాటర్ ఫాల్స్లో ముగ్గురు యువకులు గల్లంతైన<<13329808>> విషయం తెలిసిందే<<>>. వీరు విజయనగరం కంటోన్మెంట్కు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం ఆరుగురు యువకులు వాటర్ ఫాల్స్ వద్దకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిలో మహమ్మద్ రజక్(13), మహమ్మద్ షాహిద్ ఖాన్ (17), మహమ్మద్ ఆశ్రీఫ్ (16) గల్లంతు అయినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిని రక్షించేందుకు విశాఖ నుంచి APSDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
జాగారం గెడ్డ వద్ద ఉన్న వాటర్ ఫాల్స్లో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతు అయిన ఘటన జామిలో చోటు చేసుకుంది. వివరాలు ప్రకారం విజయనగరం కంటోన్మెంట్కు చెందిన ముగ్గురు యువకులు మంగళవారం ఉదయం వాటర్ ఫాల్స్లో స్నానానికి దిగి గల్లంతు అయ్యారు. సమాచారం తెలుసుకున్న జామి ఎస్సై వీరబాబు ఆధ్వర్యంలో బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై వివరించే నిమిత్తం పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మంగళవారం ఉదయం 11.00 గంటలకు కలెక్టరేట్లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు కూడా పాల్గొంటారు. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవలిసిన నియమ నిభందనలు పార్టీల నేతలకు వివరిస్తారు.
జియ్యమ్మవలస మండలం బిత్రపాడు గ్రామంలో మనుషులపై దాడి చేసి చంపిన<<13322804>> కుక్కలను<<>> గ్రామస్థులు వేటాడుతున్నారు. నాలుగు కుక్కలు 15 రోజుల ముందు బంటు. లక్ష్మీ అనే వృద్ధురాలిపై, నిన్న నీరస. శంకర రావు అనే వ్యక్తిపై దాడిచేసి చేయగా వారు మృతిచెందారు. దీంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు చర్యలు ముమ్మరం చేయలేదంటూ వారే ఒక కుక్కను చంపారు.
బాడంగి మండలం బ్రహ్మన్నవలస గ్రామ శివారులో జూదం ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి రూ.16,400 స్వాధీనం చేసుకున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ జయంతి సోమవారం నాడు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పార్వతీపురం జిల్లా ఎస్పీ విక్రాంత్ ఈ పాటిల్ ఆదేశాల మేరకు ఏఆర్ డిఎస్పీ ఆర్మర్డ్ రిజర్వుడు, స్పెషల్ పార్టీ పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ సోమవారం నిర్వహించారు. జూన్ 4న, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మాబ్ డ్రిల్ నిర్వహించారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నందున శాంతియుతంగా ఉండాలని కోరారు.
ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రంలోని లెండి ఇంజినీరింగ్ కళాశాల, JNTU కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రాజకీయ పార్టీల ఏజెంట్లు సులువుగా ఆయా నియోజక వర్గాల లెక్కింపు జరిగే ప్రదేశాలను గుర్తించేందుకు వీలుగా తెలుగులో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని లెండి ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను కలెక్టర్ సోమవారం సాయంత్రం పరిశీలించారు.
కొత్తవలస మండలం అడ్డురువానిపాలెం వద్ద గుర్తు తెలియని సుమారు 20నుంచి 25 సంవత్సరాలమధ్య ఉన్న యువకుడు మృతదేహం లభ్యమైంది. మృతుడు మోచేతికి బుబిలి నల్లనీ పచ్చబొట్టు ఉంది. కుడిచేతి మండపైన కిరీటం పచ్చబొట్టు కలదు. మృతుడు నలుపు, తెలుపు చెక్స్ కలిగిన ఫుల్ హాండ్ షర్ట్, నల్లని కాటన్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడు ఆచూకీ తెలిసినవారు విజయనగరం పోలీసులకు ఫోన్ల్ (9490617089, 9440591331) తెలియజేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.