India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ అన్నారు. కౌంటింగ్లో పాల్గొనే మైక్రో అబ్జర్వర్లకు కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మైక్రో అబ్జర్వర్ల విధులు, బాధ్యతలను గురించి వివరించారు.
శృంగవరపుకోట మండలం గోపాలపల్లి గ్రామానికి చెందిన వనం సంతోశ్(36) ఆదివారం సాయంత్రం కల్లు తియ్యడానికి ఈత చెట్టు ఎక్కుతుండగా ప్రమాదశాత్తు జారిపడి కిందపడి పోయాడు. వెంటనే స్థానికులు గుర్తించి శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.ఓ సోమవారం తెలిపారు.
పుణ్యక్షేత్రాలకు వెళ్లొస్తూ వ్యక్తి రైల్లో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పెందుర్తి నూకాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన రాళ్లపల్లి సత్యనారాయణ (63) తన భార్యతో పుణ్యక్షేత్రాలకు వెళ్లి సమతా ఎక్స్ ప్రెస్లో తిరిగి వస్తుండగా టిట్లాగర్ వచ్చేసరికి అస్వస్థతకు గురయ్యారు. అక్కడ దిగి చికిత్స అనంతరం నాగావళి ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణం అవుతుండగా పార్వతీపురం సమీపంలో గుండెపోటుతో మృతి చెందారు.
శృంగవరపుకోట మండలం ఒద్దుమరుపల్లిలో వివాహిత దారప్ప(కల్యాణి)ని భర్త కనకారావు హత్య చేసినట్లు సమాచారం. ఉద్దేశ పూర్వకంగా చంపినట్లు తెలుస్తోంది. చంపి ఊరికి దూరంగా తుప్పల్లో మృతదేహాన్ని పడేసినట్లు స్థానికులు గుర్తించారు. వీరికి వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అయిందని, వీరికి ఒక బాబు కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
జియ్యమ్మవలస మండలం బిత్రపాడులో ఇద్దరు వ్యక్తులపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో నీరస శంకర్రావు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సీమనాయుడువలసకు చెందిన సిర శంకర్రావు గాయాలుపాలై చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. కుక్కల దాడుల్లో ఇప్పటికే అనేక మందికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఇద్దరు చనిపోయినా.. అధికార యంత్రాంగం నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఎం దీపిక పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది గడచిన 24 గంటల్లో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. మోటార్ వెహికల్ నిబంధనలు అతిక్రమించిన 290 మందికి రూ.75,980 ఈ-చలానాలను విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 23 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నమోదు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది.
బొండపల్లి మండలంలోని అంబటివలస-గొట్లాం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను ఢీకొని విజయనగరం మండలం గుంకలాంకి చెందిన తాడ్డి తాతబాబు (35) మృతి చెందినట్లు బొండపల్లి ఎస్.ఐ కె.లక్ష్మణరావు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న తాతబాబు విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేశామన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో కుక్కల దాడిలో మరో వ్యక్తి మృతి చెందాడు. <<13322735>>జియ్యమ్మవలస<<>> మండలం బిత్రపాడుకు చెందిన నీరస శంకర్రావు (40) బహిర్భూమికి వెళ్లాడు. ఆ సమయంలో కుక్కలు దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే చినమేరంగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందు మృతి చెందాడు. కాగా కొద్దిరోజుల క్రితమే వెంకటరాజపురానికి చెందిన ఓ వృద్ధురాలు కుక్కలదాడిలో మృతి చెందింది.
ఉమ్మడి జిల్లాలో 9,890 మంది పాలీసెట్ పరీక్ష రాయగా..నేటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్కు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలు.
➣ ప్రాసెసింగ్ ఫీజు రశీదు
➣ పాలీసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు
➣ పది, తత్సమాన మార్కుల జాబితా
➣ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
➣ EWS కోటా అభ్యర్థులు సంబంధిత EWS సర్టిఫికేట్
➣ 1-1-2021 తర్వాత నాటి కుల,ఆదాయ సర్టిఫికేట్
➣ టీసీ
➣➣Share it
విజయనగరం పైడితల్లి అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్ను ఇటీవల రూ.25 నుంచి రూ.50కు పెంచారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్తకు తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రైవేటు వ్యక్తులు గర్భాలయం పూజలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఆలయ అధికారులు కొట్టిపారేశారు. అలా ఏం జరగడం లేదని తేల్చి చెప్పారు.
Sorry, no posts matched your criteria.