Vizianagaram

News May 27, 2024

ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో సమీక్షించిన అశోక్ గజపతిరాజు

image

జూన్ 4న జరగనున్న ఓట్లు లెక్కింపు ప్రక్రియ కోసం తీసుకోవాల్సిన చర్యలు గూర్చి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు జిల్లాలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో కలిసి ఆదివారం సాయంత్రం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమర్థులైన కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకొని ఓట్లు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

News May 26, 2024

VZM: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

పూసపాటి రేగ మండలంలో శనివారం ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచెందినట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. మృతుడు అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాదికి చెందిన దారపు రెడ్డి అప్పారావు (48)గా గుర్తించారు. ఇతడు మండలంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పనులు చేస్తుండంగా వైర్లు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. భోగాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

News May 26, 2024

విజయనగరం యువకుడు ఆత్మహత్య

image

పెదముషిడివాడలో ఉంటున్న కోట్ల జగదీశ్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మలిచర్లకి చెందిన జగదీశ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ బాలసూర్యరావు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం లవ్ ఫెయిల్యూర్‌తోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని తెలిపారు.

News May 26, 2024

మూడంచెల భద్రతను తనిఖీ చేసిన ఎస్పీ

image

విజయనగరం ఎస్పీ ఎం.దీపిక శనివారం లెండి ఇంజనీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల తదనంతరం భద్రపరచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూం వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, గార్డ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News May 25, 2024

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన ఎస్పీ

image

ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ, లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పన, భద్రత ఏర్పాట్లను ఎస్పీ దీపిక ఎం.పాటిల్ శనివారం పరిశీలించారు. ఎటువంటి ఆటంకం తలెత్తకుండా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, గార్డ్స్‌ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News May 25, 2024

పూసపాటిరేగ: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు గంగపుత్రుల ఎంపిక

image

పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సత్తిరాజు, దిలీప్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. చింతపల్లి గ్రామ పెద్దలు ఈ విద్యార్థులను సన్మానించారు. గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటే మత్స్యకార కుటుంబాలకు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభను చాటుతారన్నారు. కార్యక్రమంలో చింతపల్లి గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

News May 25, 2024

డిగ్రీ ఫలితాల్లో బొబ్బిలి విద్యార్థిని టాప్ ర్యాంకర్

image

డిగ్రీ ఫలితాల్లో బొబ్బిలికి చెందిన పొట్నూరు హారిక జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. బీఎస్సీ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో హారిక 9.7 గ్రేడ్ పాయింట్స్ సాధించి జిల్లా టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన హారిక జిల్లాలో మొదటి స్థానంలో నిలవడంతో కుటుంబ సభ్యులు, పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు.

News May 25, 2024

నేత్రపర్వంగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

image

సింహాచలం ఆలయంలో వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠిపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.

News May 25, 2024

VZM: కూల్.. కూల్‌గా వాతావరణం

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వాతావరణం శనివారం చల్లబడింది. వారం రోజులుగా భానుడు తన ఉగ్రరూపాన్ని చూపించడంతో ప్రజలు ఉష్ణ తాపానికి ఇక్కట్లు పడ్డారు. నిన్న సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి.

News May 25, 2024

విజయనగరంలో నేడు డిప్యూటీ డీఈవో పరీక్ష

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఈవో పరీక్ష నేడు విజయనగరం జిల్లాలో 6 కేంద్రాల్లో జరుగుతోందని, మొత్తం 1,470 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని డీఆర్‌ఓ అనిత పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌‌‌‌తో పాటు ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని సూచించారు.