India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లా భక్తులకు శుభవార్త మార్గశిరమాసంలో పంచవైష్ణవ క్షేత్రాలను దర్శించుకొనే భాగ్యమ్మను ఏపీఎస్ఆర్టిసి ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక సర్వీసులు డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులోకి ఉంటాయి. ద్వారకా తిరుమల, అంతర్వేది, అప్పన్నపల్లి, గొల్లల మామిడాడ, అన్నవరం దర్శనం ఉంటుంది. ఈ దర్శనాలకు టికెట్ ధర రూ.1970లు ఉంటుంది.
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 7న మెగా పేరెంట్, టీచర్స్ సమావేశాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశాలు ప్రతీ ఒక్కరికీ ఒక మధుర స్మృతిలా మిగిలిపోవాలన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని రగల్చాలని, వారిలో సృజనాత్మకతను వెలికి తీసి, ప్రతిభకు పట్టం కట్టాలన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అలాంటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విశాఖలో అక్కయ్యపాలెంతోపాటు పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. కాగా.. గత సెప్టెంబర్లో బొబ్బిలి, పాచిపెంట, మక్కువ, సాలూరు తదితర ప్రాంతాల్లో భూమి కంపించగా..రిక్టర్ స్కేలు 3.4గా నమోదైంది.
బొబ్బిలి పట్టణంలో రైలు ఢీకొని ఓ యువకుడు మంగళవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన యువకుడు బాడంగి మండలం భీమవరం గ్రామానికి చెందిన కొండేటి చంద్రశేఖర్గా గుర్తించారు. అయితే ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వే ఎస్ఐ బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తానే గ్రామానికి సర్పంచ్ను అంటూ అధికారులను, ప్రజా ప్రతినిధులను మోసం చేస్తున్నాడని టీడీపీ నాయకుడు దల్లి ముత్యాలరెడ్డిపై కుమిలి సర్పంచ్ మామిడి అప్పయ్యమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎంపీడీవో రాధికకు ఆమె వినతిపత్రం సమర్పించారు. సర్పంచ్ అంటూ చెప్పుకుంటూ తిరగడమే కాకుండా లెటర్ ప్యాడ్పై కూడా సర్పంచ్ గానే ముద్రించి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ప్రజా పరిష్కార వేదికకు పెద్ద ఎత్తున బాధితులు క్యూ కడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి బాధితులు రావడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మండల కార్యాలయాల్లో కూడా వినతులు స్వీకరిస్తున్నారు. భూసమస్యలపై అధిక ఫిర్యాదులు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిన్న విజయనగరం కలెక్టరేట్కు 116 వినుతులు రాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలో 108మంది అర్జీలు అందజేశారు. మరి మీ సమస్యకు అధికారులు పరిష్కారం చూపిస్తున్నారా?
రాష్ట్రంలోనే మొదటి <<14768413>>DSC ఫ్రీ కోచింగ్ సెంటర్<<>>ను పార్వతీపురంలో మొదలు పెట్టామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సీతంపేట ఐటీడీఏలో కూడా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 236 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో ST-144 SC-44,BC-42, ఐదుగురు ఓసీలు అప్లే చేసుకున్నారని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటే వారికి కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఉచిత డీఎస్సీ కోచింగ్ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురంలో ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు గిరిజన సామాజిక భవనంలో సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కోచింగ్ రెండు నెలల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్లుగా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి TV రాజేశ్ కోరారు. పదోతరగతి చదివి తెలుగు చదవడం, రాయడం రావాలన్నారు. క్రిమినల్ కేసులు ఉండరాదని సూచించారు. శిక్షణ కాలంలో గాని, శిక్షణ పూర్తైన తరువాత గాని ఎటువంటి జీతభత్యాలు ఉండవన్నారు. కేవలం సమాజ సేవ దృక్పథం గల వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో నిర్వహిస్తున్న అత్యం మైనింగ్ ప్రైవేట్ కంపెనీపై చర్యలు చేపట్టాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. మండలంలోని 10 గ్రామాలలోని కొండలను మైనింగ్ కంపెనీ ఆక్రమిస్తుందని అన్నారు. దీనిపై ప్రశ్నించిన ఆయా గ్రామ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో మైనింగ్ కంపెనీపై చర్యలు చేపట్టాలని కోరారు.
Sorry, no posts matched your criteria.