WestGodavari

News September 14, 2024

ప.గో.: బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి ఆరేళ్ల జైలు

image

ప.గో. జిల్లా ఆకివీడుకు చెందిన 12 ఏళ్ల బాలికపై మాదివాడకు చెందిన మద్దా సుందర్ సింగ్ 2017లో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ముద్దాయికి న్యాయమూర్తి సోమశేఖర్ శుక్రవారం ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ప్రస్తుత ఎస్సై నాగరాజు తెలిపారు.

News September 14, 2024

చింతలపూడి: ‘ఉపాధి హామీ పనులు ప్రారంభించండి’

image

ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్విను చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలని కోరారు. అనంతరం ఉపాధి పనుల వివరాలను కలెక్టర్‌కు సమర్పించారు. గ్రామాల్లో ప్రజలు వలస వెళ్లకుండా ఉపాధి హామీ అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధులు కేటాయించాలని కోరారు.

News September 13, 2024

17 నుంచి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు

image

ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో శుక్రవారం ఆమె సమీక్షించారు. స్వచ్ఛతా కి భాగీదారి ప్రజల భాగస్వామ్యం, అవగాహన, సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ నెల 17న మానవహారం, 20న మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాల నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలన్నారు.

News September 13, 2024

పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.3.07కోట్లు మంజూరు

image

జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీలు కింద రూ.3.07కోట్లు మంజూరు చేయడం జరిగిందని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని శుక్రవారం వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించారు. సింగిల్ విండో పథకం కింద అనుమతులను కాలయాపన లేకుండా మంజూరు చేయాలని ఆదేశించారు. ఓఎన్‌డీసీ ప్లాట్ ఫామ్‌లో అన్ని ఎంఎస్ఎంఈ యూనిట్లు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

News September 13, 2024

17న నులిపురుగుల నిర్మూలన నివారణ దినోత్సవం

image

జిల్లాలో ఈ నెల 17వ తేదీన నులిపురుగుల నిర్మూలన నివారణ దినోత్సవంగా నిర్వహించనున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం నులిపురుగుల నివారణ, ఆల్బెండ్జోల్ మాత్రలు అవశ్యకతకు సంబంధించి ప్రచార వీడియోలు, కరపత్రాలను ఆవిష్కరించారు. 19 ఏళ్ల లోపు వారికి నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు.

News September 13, 2024

‘ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలి’

image

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, సంబధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సుమారు 5.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా ఉండగా అందులో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు పటిష్ఠ ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు.

News September 13, 2024

ఏలూరు జిల్లా బ్యాంకర్‌లకు కలెక్టర్ విజ్ఞప్తి

image

ఏలూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్‌లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లాలో వరదల కారణంగా నష్టపోయిన రైతాంగం, ప్రజలకు రుణ సౌకర్యంపై బ్యాంకర్లతో ప్రత్యేక డీసీసీ సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భీమా క్లైముల పరిష్కారంలో రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకోకుండా పరిష్కరించాలన్నారు.

News September 13, 2024

ప.గో.: గాంధీ తత్వంపై చిత్రలేఖనం పోటీలు

image

గాంధీ జయంతి సందర్భంగా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్వోదయ మండలి ఉమ్మడి ప.గో.జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ.. ‘గాంధీ తత్వం- నేటి భారతం’ అంశంపై ఏ4 సైజ్ డ్రాయింగ్‌ షీటుపై చిత్రం వేసి, స్కాన్‌ చేసి ispeducation@gmail.com మెయిల్‌‌కు ఈ నెల 21వ తేదీ లోపు పంపాలన్నారు.

News September 13, 2024

పేరుపాలెం బీచ్‌కి వచ్చే పర్యాటకులకు విజ్ఞప్తి

image

మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కి వచ్చే పర్యాటకులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. పేరుపాలెంలోని మొలపర్రు కనకదుర్గా బీచ్‌కి వెళ్లే మార్గంలో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ రహదారి మీదుగా ప్రయాణాలు నిలిపివేశామన్నారు. పర్యాటకులు ఈ విషయం గమనించి ఇతర మార్గాల్లో బీచ్‌కు వెళ్లాలని కోరారు.

News September 13, 2024

ఏలూరు జిల్లాలో వైసీపీ నేత మృతి

image

ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. కామవరపుకోట మండలం కళ్ళచెరువుకు చెందిన AMC మాజీ ఛైర్మన్ మేడవరపు అశోక్ బాబు శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఏలూరు జిల్లాలోని రాజకీయ నాయకులు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.