WestGodavari

News August 18, 2025

భీమవరం: ‘అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులపై సమీక్ష’

image

అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పనతో బలోపేతానికి ఐసీడీఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 489 అంగన్వాడీలకు ఒక్కొక్క అంగన్వాడికి రూ.16 వేలు చొప్పున కేటాయించిన నిధులతో గుర్తించిన పనులను పూర్తి చేయాలన్నారు.

News August 18, 2025

దుంపగడప: వీవీ గిరి కళాశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన

image

ఆకివీడుమండలం దుంపగడప వీవీ గిరి ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ, కలెక్టర్ నాగరాణీలు శంకుస్థాపన చేసారు. భారత జీవిత భీమా సంస్థ సామాజిక బాధ్యత విభాగం గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వీవీ.గిరి ప్రభుత్వ కళాశాలకు ఎక్స్టెన్షన్ బ్లాక్ నిర్మాణానికి రూ. 1.06 కోట్లు నిధులు ఇచ్చారు. విద్యాసంస్థల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.

News August 18, 2025

ప.గో: భారీ వర్షాలు.. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. అత్యవసర సహాయం కోసం 08816 299181 నంబర్‌తో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధికారుల సెలవులు రద్దు చేస్తూ, గజ ఈతగాళ్లను, మోటార్ బోట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలు సముద్రం, గోదావరి నది వైపు వెళ్లవద్దని ఆమె హెచ్చరించారు.

News August 18, 2025

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ నాగరాణి

image

వాతావరణ శాఖ భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీని కారణంగా ఏపీకి మరో 3 రోజులు భారీ వర్షసూచన ఉన్నట్టు ప్రకటించిందన్నారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అధికారులకు సెలవులు రద్దు చేశామని తెలిపారు.

News August 17, 2025

ప.గో: రేపు పీజీఆర్‌ఎస్ రద్దు

image

అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ రానున్న మూడు రోజులు అధిక వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో రేపు 18న సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో జరగాల్సిన పీజీ‌ఆర్‌ఎస్ రద్దు సమాచారాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించవలసిందిగా కలెక్టర్ కోరారు.

News August 17, 2025

స్త్రీ, శిశు సంక్షేమ అధికారులతో మంత్రి గుమ్మిడి సమీక్ష

image

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప.గో జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి పాలకొల్లు వచ్చిన సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సమగ్రంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా 1626 అంగన్వాడీ కేంద్రాల పని తీరు, పిల్లలకు అందుతున్న పోషకాహారం, విద్య, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News August 17, 2025

నరసాపురం: అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

image

నరసాపురంలో తొమ్మిదేళ్ల బాలికపై ఈ నెల 13న అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు నరసాపురం డీఎస్పీ జి. శ్రీవేద తెలిపారు. శనివారం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. శనివారం కుడుపూడి నాగ బాలాజీని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని డీఎస్పీ తెలిపారు.

News August 17, 2025

పాలకొల్లు రానున్న మంత్రి లోకేశ్

image

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆదివారం పాలకొల్లు రానున్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ నిశ్చితార్థం వేడుకల్లో ఆయన పాల్గొనన్నారు. స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులో ఎస్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ఉదయం ఏడు గంటలకు జరిగే నిశ్చితార్థ వేడుకలో మంత్రి లోకేష్ పాల్గొంటారని మంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

News August 16, 2025

కాళ్ల: లచ్చన్న జయంతి వేడుకలు

image

కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు.

News August 16, 2025

ఆకివీడు: కండక్టర్‌గా మారిన RRR

image

‘స్త్రీ శక్తి’ పథకాన్ని డిప్యూటీ స్పీకర్ RRR శుక్రవారం దుంపగడపలో ప్రారంభించారు. కండక్టర్‌గా మారి, కాసేపు మహిళలకు ఉచిత టికెట్లు ఇచ్చారు. ప్రభుత్వం మహిళాభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 297 బస్సులకు గాను 225 బస్సులు ఈ పథకంలో సేవలందిస్తున్నాయని, ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించిందని ఆయన వివరించారు.