WestGodavari

News April 10, 2025

నల్లజర్ల : చిన్నపిల్లలతో HIV ఉన్న వృద్ధుడి అసభ్య ప్రవర్తన

image

చిన్నారులను HIV ఉన్న ఓ వృద్ధుడు లైంగిక చర్యలతో వేధించిన ఘటన నల్లజర్ల మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు. పాఠశాలలో 4,5 తరగతి చదువుకుంటున్న చిన్నారులు స్కూల్ అయ్యాక ఆడుకుంటుండగా వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఆయిల్‌పామ్ తోటలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ బాలుడు తన తల్లికి చెప్పగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సాయంతో సీఐ రాంబాబు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News April 10, 2025

పాలకొల్లు : లవ్ మ్యారేజ్ ..మూడు నెలలకే ఆత్మహత్య

image

ప్రేమ వివాహం చేసుకున్న మూడు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకొల్లులో జరిగింది. 28వ వార్డుకు చెందిన సతీశ్ మంగళవారం భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబీకులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదుతో ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేశామన్నారు.

News April 10, 2025

ప.గో జిల్లా రొయ్య రైతు ఆవేదన

image

ప.గో జిల్లాలో రొయ్య రైతులు అయోమయంలో పడ్డారు. రాష్ట్రంలో ఆక్వాసాగు 5.75 లక్షల ఎకరాల్లో ఉంటే, ఉమ్మడి ప.గో జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి జరుగుతూ మొదటి స్థానంలో నిలిచింది. కొనుగోలు దారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో జూలై నుంచి పంట బ్రేక్‌కు పిలుపునిచ్చారు. బుధవారం ఉండిలో జరగాల్సిన ఆక్వా రైతుల సదస్సు వాయిదా పడింది.

News April 10, 2025

కారుమూరి, అంబటికి MLA మాస్ వార్నింగ్

image

నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో బుధవారం జరిగిన సభలో MLA బొమ్మిడి నాయకర్ కారుమూరి, అంబటికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘కారుమూరి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట తీరు మార్చుకో. లేకుంటే తాటతీస్తాం. అంబటి రాంబాబు పద్ధతి మార్చుకోకుంటే నీ సొంత నియోజకవర్గంలో, కార్యకర్తల ముందే బుద్ధి చెప్పాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరించారు.

News April 10, 2025

ప.గో: నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ

image

జిల్లా ఎస్పీ ఆదాన్ నయీమ్ అస్మి తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో నేర సమీక్ష సమావేశం తాడేపల్లిగూడెం డీస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సమీక్షలో స్థానిక నేరాల స్థితిగతులు, కీలక ఘటనలపై విచారణ, పురోగతి, నేరాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, రౌడీ షీటర్ల పై నిఘా, సైబర్ నేరాల నియంత్రణ అంశాలపై అధికారులతో ఎస్పీ సమగ్రంగా చర్చించారు.

News April 9, 2025

ప.గో జిల్లా వాసులకు గ్యాస్ భారం

image

గ్యాస్ ధరల పెంపు ప.గో జిల్లా సామాన్యుడి తలపై గుది బండలా మారింది. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఏకంగా రూ. 50 పెరగడంతో రూ. 860కి చేరింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ముందుగా వినియోగదారుని సొమ్ముతో సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. పలు కారణాలతో ఆ నగదు వినియోగదారుని ఖాతాకు జమ కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

News April 9, 2025

జిల్లాలో 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: జేసీ

image

జిల్లాలో ఇప్పటివరకు 43 రైతు సేవా కేంద్రాలు ద్వారా 2,500 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టర్ ఛాంబర్‌లో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, సహకార, వ్యవసాయ, రవాణా, అసిస్టెంట్ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ, అగ్రికల్చర్ ట్రెండ్ మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా కంట్రోల్ రూమ్ 8121676653 తెలియజేయాలన్నారు.

News April 8, 2025

ప.గో: రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

image

రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పచ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి ప.గో జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు.

News April 8, 2025

కాగుపాడు సర్పంచ్ సస్పెన్షన్

image

ఉంగుటూరు మండలం కాగుపాడు సర్పంచ్ కడియాల సుదేష్ణను విధుల నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీకి సంబంధించి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉప సర్పంచ్ విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News April 8, 2025

పాలకొల్లు: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ విఫలమై పాలకొల్లుకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానిక బ్రహ్మానందరెడ్డి కాలనీకు చెందిన రత్నకుమార్ తనకంటే వయసులో పెద్దయిన అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగేవాడు. ఆమె ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన రత్నకుమార్ ఇంటిపై అంతస్తులో పడుకుంటానని వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.