India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రేమ విఫలమై పాలకొల్లుకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానిక బ్రహ్మానందరెడ్డి కాలనీకు చెందిన రత్నకుమార్ తనకంటే వయసులో పెద్దయిన అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగేవాడు. ఆమె ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన రత్నకుమార్ ఇంటిపై అంతస్తులో పడుకుంటానని వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పా.గో జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్కు 18 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. పాఠశాలకు చెందిన 450 మంది విద్యార్థులు స్కౌట్స్, గైడ్స్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా ఈ రికార్డు సాధించినట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర పరిశీలకులు సిరిమువ్వ శ్రీనివాస్ ఆదివారం WAY2NEWS ప్రతినిధికి తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.
భీమవరంలోని కలెక్టరేట్లో ఈ నెల 7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని.. గమనించాలని కోరారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. కాగా పలు కారణాలతో గత వారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దైన సంగతి తెలిసిందే.
ఆకివీడు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ మృతి చెందాడు. ఆకివీడు పెదపేటకు చెందిన మేకల మైకేల్ రాజ్ (40) రహదారి దాటుతుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. కాగా మైకేల్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
వేసవి దృష్ట్యా జిల్లాలో ప్రజలకు తాగునీరు అందించడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు, మజ్జిగ అందించాలన్నారు.
కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో భారతదేశ తొలి ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం కలెక్టర్ సి.నాగరాణి నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి గ్రామ సర్పంచ్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సమాజంలో అణగారిన ప్రజల కోసం కృషి చేసిన మహనీయుడని ఆయన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆచంట మండలం అయోధ్యలంకలో జరిగింది. ఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యలంకకు చెందిన శ్రీనివాసరావు గురువారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన సమయంలో పాము కరిచింది. ఇంటికి వచ్చిన తర్వాత అతని నోటి నుంచి నురగ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
పాలకోడేరు(M) శృంగవృక్షం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు(37) అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదైంది. ఆకివీడు పీఎస్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి వచ్చారు. గురువారం అర్ధరాత్రి బాత్రూమ్కి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో భార్య వెళ్లి చూడగా స్పృహతప్పి ఉన్నారు. వైద్యునికి చూపించగా చనిపోయినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన ఉమ్మడి ప.గో(D) జీలుగుమిల్లి మండలానికి చెందిన ఫార్మసీ విద్యార్థి నల్లపు అంజలి శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆమె స్వగ్రామం రౌతుగూడెంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మరికాసేట్లో ఆమె భౌతికకాయాన్ని గ్రామానికి తీసుకురానున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అంజలి ఆత్మహత్యకి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.