WestGodavari

News September 13, 2024

ప.గో.: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

image

భార్యను హత్యచేసిన కేసులో భర్త అరెస్ట్ అయ్యాడు. ఆకివీడు CI జగదీశ్వరరావు వివరాలు.. ఉండి మండలం కలిగొట్లకు చెందిన సత్యవతి ఈ నెల 5న హత్యకు గురైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త చిరంజీవి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం గురువారం అరెస్ట్ చేసి భీమవరం కోర్టులో హాజరుపరచగా నిందితుడికి రిమాండ్ విధించారన్నారు.

News September 13, 2024

ప.గో.: అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు.. 13 మందిపై కేసు

image

అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. కొవ్వూరు మండలం మద్దూరులో బుధవారం రాత్రి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో అశ్లీల నృత్యాలు చేశారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి 13 మందిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై శ్రీహరి తెలిపారు.

News September 13, 2024

దాతృత్వంలో ప.గో జిల్లా ప్రథమ స్థానం: కలెక్టర్

image

వరద బాధితులకు సహాయం అందించటంలో ప.గో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం అన్నారు. 13 మంది దాతలు సహాయంతో రూ.47,88,500/- లు వరద బాధితులకు నగదు, 4.09 లక్షల ఆహార పొట్లాలు, 1.85 లక్షల వాటర్ బాటిల్స్, 1.10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 9,500 బన్నులు, 21,400 రస్కులు, 1.62 బిస్కెట్ ప్యాకెట్లు, 25 కేజీల రైస్ బ్యాగ్స్ 700 అందజేయడం జరిగింది అన్నారు.

News September 13, 2024

14న ప.గో జిల్లాలో జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్ అదాలత్‌ను సెప్టెంబరు 14న నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ కుమార్ తెలిపారు. గురువారం ఏలూరు జిల్లా కోర్టులో ఆయన మాట్లాడారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్, కుటుంబ వివాదాలు, టెలిఫోన్, బ్యాంకు కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు.

News September 12, 2024

ఏలూరు: ముద్దాయికి జైలు శిక్ష.. జరిమానా

image

ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ వాసుదేవ్ ఏలూరు 1- Town పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి, ముద్దాయి బడిగంటల లీల రాజు 3 సం.ల 15 రోజులు సాధారణ జైలు శిక్ష, రూ.6500 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హేమలత వాదనలను వినిపించి ముద్దాయికి శిక్ష పడటంలో సహకరించారన్నారు.

News September 12, 2024

స్వచ్ఛతా హి సేవపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

స్వచ్ఛభారత్ దివాస్ కార్యక్రమంలో బాగంగా స్వఛ్ఛ ఏలూరు జిల్లాగా రూపొందించడానికి అధికారులంతా సిద్ధం కావాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరిగే స్వచ్ఛతా హి సేవాకార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది శ్రమదానం చేసి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

News September 12, 2024

పోలవరం: ప్రమాదకరమైన ప్రయాణం

image

పోలవరం మండలం వింజరం గ్రామం నుంచి గార్ల గొయ్యి వెళ్లే రహదారి పై ఉన్న కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుధవారం నాటికి సగం పైనే కొట్టుకుపోయింది. దీంతో నిత్యం ఇదే దారిలో వెళ్లే స్కూలు బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఇతర అనేక వాహనాలు ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.

News September 12, 2024

ప.గో.: ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

image

సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించిన టెన్త్, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఫీజు చెల్లించడానికి గడువు పొడిగించినట్లు పశ్చిమగోదావరి జిల్లా జిల్లా విద్యాశాఖాధికారిణి నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడానికి ఈ నెల 15న, రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 16 నుంచి 25 వరకు గడువు ఉన్నట్లు తెలిపారు.

News September 12, 2024

42 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం

image

ప.గో.జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 42.86 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆశాఖ జిల్లా అధికారి దేవానందకుమార్ బుధవారం తెలిపారు. నరసాపురం, మొగల్తూరు, పెనుగొండ, తాడేపల్లిగూడెం, యలమంచిలి మండలాల్లో 2,862 మంది రైతులకు చెందిన కూరగాయల తోటలు దెబ్బతిన్నాయన్నారు. యలమంచిలి, ఆచంట మండలాల్లోని లంక గ్రామాల్లో 50 హెక్టార్లలో అరటి తోటలు మునిగిపోవడంతో పంట దెబ్బతినే అవకాశం ఉందన్నారు.

News September 12, 2024

బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తిపై పోక్సో కేసు

image

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై జబీర్ కథనం మేరకు.. జంగారెడ్డిగూడేనికి చెందిన బాలిక(11) ఆడుకుంటుండగా.. అదే ప్రాంతానికి చెందిన చోడగిరి రాజు అనే వ్యక్తి ఇంటిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో ఆమె తల్లి వెళ్లి చూడగా.. స్నానాల గదిలో ఉంచి పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజుపై పోక్సో కేసు నమోదు చేశారు.