India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భీమవరంలోని కలెక్టరేట్లో ఈ నెల 7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని.. గమనించాలని కోరారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. కాగా పలు కారణాలతో గత వారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దైన సంగతి తెలిసిందే.
ఆకివీడు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ మృతి చెందాడు. ఆకివీడు పెదపేటకు చెందిన మేకల మైకేల్ రాజ్ (40) రహదారి దాటుతుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. కాగా మైకేల్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
వేసవి దృష్ట్యా జిల్లాలో ప్రజలకు తాగునీరు అందించడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు, మజ్జిగ అందించాలన్నారు.
కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో భారతదేశ తొలి ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం కలెక్టర్ సి.నాగరాణి నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి గ్రామ సర్పంచ్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సమాజంలో అణగారిన ప్రజల కోసం కృషి చేసిన మహనీయుడని ఆయన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆచంట మండలం అయోధ్యలంకలో జరిగింది. ఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యలంకకు చెందిన శ్రీనివాసరావు గురువారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన సమయంలో పాము కరిచింది. ఇంటికి వచ్చిన తర్వాత అతని నోటి నుంచి నురగ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
పాలకోడేరు(M) శృంగవృక్షం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు(37) అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదైంది. ఆకివీడు పీఎస్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి వచ్చారు. గురువారం అర్ధరాత్రి బాత్రూమ్కి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో భార్య వెళ్లి చూడగా స్పృహతప్పి ఉన్నారు. వైద్యునికి చూపించగా చనిపోయినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన ఉమ్మడి ప.గో(D) జీలుగుమిల్లి మండలానికి చెందిన ఫార్మసీ విద్యార్థి నల్లపు అంజలి శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆమె స్వగ్రామం రౌతుగూడెంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మరికాసేట్లో ఆమె భౌతికకాయాన్ని గ్రామానికి తీసుకురానున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అంజలి ఆత్మహత్యకి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
సినీ ఫక్కీలో పోలీసులమని చెప్పుకుంటూ భీమడోలు పరిసర ప్రాంతాలలో దుకాణదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు మీడియాకు వివరాలు తెలిపారు. వీరంతా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో నిఘా పెట్టి అరెస్ట్ చేశామన్నారు. కేసుని ఛేదించిన భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్లను అభినందించారు.
సీడ్, ఫీడ్ ధరల పెంపుతో ఇప్పటికే అల్లాడుతున్న ఆక్వా రైతులపై మరో పిడుగు పడింది. భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 26% పన్నులు విధిస్తామని చెప్పడం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా నుంచి అమెరికా, ఇతర దేశాలకు రొయ్యలు ఎగుమతి అవుతాయి. ఇదే అదునుగా ఎగుమతిదారులు కౌంట్ను బట్టి రూ.20 నుంచి రూ.30 వరకు రేట్లు తగ్గించేశారని రైతులు లబోదిబోమంటున్నారు. ఇలా అయితే సాగు చేయలేమంటున్నారు.
నరసాపురం మండలం రుస్తుంబాద లేసు పార్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా లేసు అల్లికదారులతో మాట్లాడుతూ నిత్య వినియోగం, బహుమతిగా ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్న లేసు ఉత్పత్తులను తయారుచేసి మార్కెటింగ్ పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లోనూ లేసు అల్లికను తెచ్చి పెట్టుకునేలా నైపుణ్యతను చూపించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.