WestGodavari

News August 30, 2025

భీమవరం: డ్రగ్స్ నియంత్రణపై కలెక్టర్ సమీక్ష

image

మాదకద్రవ్యాల నియంత్రణపై భీమవరం కలెక్టరేట్‌లో బుధవారం ఎన్‌కార్డ్ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గంజాయి సాగు, రవాణా, అమ్మకం, వినియోగం, పునరావాసం వంటి అంశాలపై చర్చించారు. మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారికి చికిత్స అందించి, యువతలో అవగాహన కల్పించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News August 29, 2025

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం: లండన్ మేయర్ ఉదయ్

image

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, యువత విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలని లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ అన్నారు. భీమవరంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న క్రీడా దినోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రతి విద్యార్థి క్రీడలు, వ్యాయామం, యోగా తప్పకుండా చేయాలని, వీటి ద్వారా మానసిక శాంతి లభిస్తుందన్నారు.

News August 29, 2025

యలమంచిలి: గోదావరిలో స్నానానికి దిగి వ్యక్తి మృతి

image

యలమంచిలి మండలం చించినాడ పుష్కర ఘాట్‌లో స్నానానికి దిగి డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి గ్రామానికి చెందిన వేగి మోహనరావు (42) మృతి చెందినట్లు ఎస్ఐ కే.గుర్రయ్య తెలిపారు. ఈ నెల 25వ తేదీన స్నానానికి దిగిన మెహనరావు ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయాడన్నారు. గురువారం దర్బరేవు వద్ద గోదావరిలో మృతదేహం లభ్యమైందని చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News August 29, 2025

అత్తిలి: దైవ దర్శనానికి వెళ్తుండగా చెట్టు మీద పడి వ్యక్తి మృతి

image

ద్వారకాతిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తున్న ఆ కుటుంబాన్ని దురదృష్టం వెంటాడింది. అత్తిలికి చెందిన వెంకట సుబ్బారావు తన భార్య నాగదుర్గవేణి, కుమారుడితో కలిసి బైక్‌పై చినవెంకన్న దర్శనానికి వెళ్తున్నారు. ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేట సమీపంలో వర్షం ధాటికి ఓ చెట్టు కుప్పకూలి వారిపై పడింది. ఘటనలో సుబ్బారావు మృతి చెందగా భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. SI సుధీర్ కేసు నమోదు చేశారు.

News August 29, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తాం: కలెక్టర్

image

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్‌లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ పాల్గొన్నారు.

News August 29, 2025

గణేశ్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: ఐజీ

image

గణేశ్ నిమజ్జన వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు, పోలీసులు కృషి చేయాలని ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. నరసాపురంలో ఆయన మాట్లాడారు. ఊరేగింపులో కుల, మత, ప్రాంత లేదా రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు లేదా చర్యలు ఉండరాదని సూచించారు. నిమజ్జనం కేవలం భక్తిభావంతో మాత్రమే జరుపుకోవాలని ఆయన కోరారు.

News August 28, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తాం: కలెక్టర్

image

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్‌లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ పాల్గొన్నారు.

News August 28, 2025

సముద్రపు నాచుతో అదనపు ఆదాయం: కలెక్టర్

image

సముద్రపు నాచు సాగు ద్వారా ఎస్‌హెచ్‌జీలు అదనపు ఆదాయం ఆర్జించడానికి తోడ్పాటునందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం నరసాపురం మండలం పెద్దమైనవానిలంక డిజిటల్ భవన్ నందు జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ సహకారంతో ఎస్‌హెచ్‌జి మహిళలకు అందిస్తున్న సముద్రపునాచు సాగు శిక్షణా తరగతులకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

News August 28, 2025

భీమవరంలో వచ్చే నెల 2న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన

image

సారధ్యం యాత్రలో భాగంగా వచ్చే నెల 2న భీమవరం వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పర్యటనను బీజేపీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చాయ్ పే చర్చ కార్యక్రమంతోపాటు పట్టణంలో శోభాయాత్ర, బీజేపీ జిల్లా విస్తృత స్థాయి జరిగే కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారన్నారు.

News August 28, 2025

వైద్యం కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలి: కలెక్టర్

image

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం నరసాపురం మండలం తూర్పు తాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. పీహెచ్‌సీలోని మందులు, ల్యాబ్, స్టాప్ రూమును, పలు విభాగాలను తనిఖీ చేశారు. ఓపి రికార్డులతో పాటు సిబ్బంది హాజరు పట్టి పరిశీలించారు. హాస్పటల్‌కు వచ్చిన రోగులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వైద్యం కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలన్నారు