WestGodavari

News September 26, 2024

నల్లజర్ల: తిరుమల లడ్డూపై వాట్సాప్ పోస్ట్.. వ్యక్తి అరెస్టు

image

తిరుమల లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరుగుతోందనే ఆరోపణలపై మత ఘర్షణలు చెలరేగేలా వాట్సాప్ స్టేటస్ పెట్టిన పుల్లలపాడు గ్రామానికి చెందిన శివను అరెస్ట్ చేసినట్లు సీఐ నక్కా శ్రీనివాసరావు తెలిపారు. నల్లజర్ల మండలం బజరంగ్ దళ్ అధ్యక్షుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఆపై నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు.

News September 26, 2024

కొవ్వూరు: చోరీ కేసులో ఇద్దరు అరెస్టు

image

కొవ్వూరులో ఇటీవల జరిగిన చోరీకు సంబంధించి పొన్నాడ రవిశంకర్, లంకపల్లి నాగరాజులను అరెస్టు చేసినట్లు బుధవారం జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ తెలిపారు. వారు 44 కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పారు. నిందితుల వద్ద 400 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జి.దేవకుమార్, సీఐ పి.విశ్వం పాల్గొన్నారు. సహకరించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.

News September 25, 2024

భీమవరం: నూతన కార్పొరేషన్ ఛైర్మన్లతో చంద్రబాబు భేటీ

image

జిల్లాలోని కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ ఛైర్మన్లతో బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యత. మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదన్నారు. ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులు అని గుర్తు పెట్టుకోవాలని వారికి సూచించారు. బాధ్యతగా పనిచేయాలన్నారు.

News September 25, 2024

ఉమ్మడి జిల్లా రవాణా శాఖలో బదిలీలు

image

ఉమ్మడి ప.గో.జిల్లా రవాణా శాఖ పరిధిలో పని చేస్తున్న పలువురు మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్లు, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్లు మంగళవారం బదిలీ అయ్యారు. జంగారెడ్డిగూడెం ప్రసాద్‌ను కొవ్వూరు యూనిట్‌ కార్యాలయానికి, కొవ్వూరు బీ.భీమారావును ఏలూరు డీటీసీ కార్యాలయానికి, ఏలూరు ప్రసాద్‌ను పెద్దాపురం, రాజమహేంద్రవరం రంగనాయకులను జంగారెడ్డిగూడెం ఆర్టిఓ కార్యాలయానికి బదిలీ చేశారు.

News September 25, 2024

సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

image

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకరంగా, దూషణలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆగస్టు నెలలో జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ టీడీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా దర్యాప్తు చేపట్టి.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, జడ్జి అతనికి రిమాండ్ విధించారు.

News September 25, 2024

నాడు MLA టికెట్ వచ్చినా మంతెన త్యాగం.. నేడు ప్రతిఫలం

image

ఎన్నికల వేళ TDP తొలి జాబితాలో ఉండి MLA టికెట్ మంతెన రామరాజుకు కేటాయించిన విషయం తెలిసిందే. అనంతరం మారిన రాజకీయ సమీకరణాల వల్ల పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన టికెట్ త్యాగం చేశారు. అక్కడ రఘురామకృష్ణ రాజు గెలుపునకు కృషి చేశారు. నాటి త్యాగానికి ప్రతిఫలంగా నిన్న ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఆయనకు ప్రాధాన్యం దక్కింది. కీలకమైన APIIC ఛైర్మన్ పదవి కేటాయించి పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించింది.

News September 25, 2024

28న సాఫ్ట్ టెన్నిస్ ఉమ్మడి ప.గో.జిల్లా జట్ల ఎంపికలు

image

ఉమ్మడి ప.గో.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి అండర్-14, 17 బాల బాలికల సాఫ్ట్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపికలు ఈనెల 28న నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ కార్యదర్శి మల్లేశ్వరరావు తెలిపారు. ఈ పోటీలు గణపవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరగనున్నాయన్నారు. విద్యార్థులు ఎంట్రీ ఫారం, మిడ్ డే మీల్స్ అక్విట్టెన్స్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.

News September 24, 2024

ఉమ్మడి ప.గో.జిల్లా నేతలకు టీడీపీలో కీలక పదవులు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు వరించాయి. ఏపీ ట్రైకార్ ఛైర్మన్‌గా పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు, ఏపీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఛైర్మన్‌గా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉండి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు నియమితులయ్యారు.

News September 24, 2024

ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఛైర్మన్‌గా సుజాత

image

రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. మొత్తం 20 మందిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో చింతలపూడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీమంత్రి పీతల సుజాతను ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఛైర్మన్‌గా నియమించింది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ఆమెకు తగిన గౌరవం దక్కిందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 24, 2024

ఏపీ షెడ్యూల్ ట్రైకార్ ఛైర్మన్‌గా బొరగం శ్రీనివాసులు

image

రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం భర్తీ చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఈ సందర్భంగా మొత్తం కూటమి పార్టీల నుంచి 20 మందిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసింది. ఈ జాబితాలో పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బోరగం శ్రీనివాసులకు ఏపీ స్టేట్ షెడ్యూల్ ట్రైకార్ ఛైర్మన్‌గా నియమించింది. నాయకుడికి దక్కిన గౌరవంగా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.