WestGodavari

News May 7, 2025

మొగల్తూరు: యువకుడిని కాపాడిన పోలీసులు 

image

పేరుపాలెం తీరానికి వచ్చి సేద తీరుతూ అలల ఉదృతికి లోపలికి కొట్టుకుపోతున్న ఒక యువకుడుని తీరం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు రక్షించారు. శుక్రవారం ద్వారకాతిరుమలకు చెందిన వీరవల్లి మధు అనే యువకుడు పేరుపాలెం సాగర తీరానికి వచ్చాడు. మద్యాహ్నం సమయంలో సముద్ర స్నానం చేస్తూ అలల ఉదృతికి గురై కొట్టుకుపోతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ పి.శ్రీనివాస్, హెచ్‌సీ హరి యువకుడిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు.

News May 7, 2025

ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి: కలెక్టర్

image

ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా కలెక్టర్ చదలవారి నాగరాణి అన్నారు. భీమవరం పట్టణంలోని టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు శుక్రవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. 595 మార్కులు సాధించిన క్యాతిశ్రీ‌ను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో నారాయణ  పాల్గొన్నారు.

News April 25, 2025

పాలకొల్లు: సీఎం, డిప్యూటీ సీఎంకి హరిరామజోగయ్య లేఖ

image

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో కాపులకు EWS కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 103 రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కాపుల అభ్యున్నతికి తోడ్పడవల్సిందిగా ఆ వర్గం తరఫున కోరుతున్నానని పేర్కొన్నారు.

News April 25, 2025

యలమంచిలి: వ్యక్తిని దారుణంగా చంపిన దంపతులు

image

యలమంచిలి మండలం కొంతేరులో కత్తుల పౌలు(59) <<16199598>>హత్యకు గురైన సంగతి తెలిసిందే<<>>. ఈ కేసుపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న పౌలు, ఏసుదాసు కుటుంబాల మధ్య పాత కక్షలున్నాయి. బుధవారం రాత్రి పౌలు ఇంటికి వెళ్లిన ఏసుదాసు మంచంపై నిద్రిస్తున్న పౌలుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఇందుకు ఏసుదాసు భార్య భారతి కూడా సహకరించింది. నిందితులు ఏసుదాసు, భారతీలను అదుపులోకి విచారిస్తున్నారు.

News April 25, 2025

భీమవరం: విద్యార్థులను సత్కరించిన కలెక్టర్ 

image

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థులు అభినందనీయులని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం కాళ్ల మండలం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన 10 మంది విద్యార్థులకు మెమొంటోలు అందజేసి సత్కరించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News April 24, 2025

భీమవరంలో యాంకర్ అనసూయ సందడి

image

భీమవరంలో సినీనటి అనసూయ సందడి చేశారు. గురువారం భీమవరంలోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె వచ్చారు. అనసూయను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. భీమవరం చాలా సార్లు వచ్చానని, ఇక్కడ అభిమానం ఎప్పటికీ మరవలేనని, ఎన్నిసార్లు అయినా భీమవరం వస్తానని అనసూయ అన్నారు.

News April 24, 2025

యలమంచిలిలోని కొంతేరులో హత్య

image

యలమంచిలి మండలం కొంతేరులో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. సరిహద్దు గొడవల నేపథ్యంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కత్తుల పౌలు (58)ను బత్తుల ఏసుదాసు నరికాడు. మెడపై తీవ్రగాయాలు కావడంతో పౌలు మంచంపై మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని నరసాపురం డీఎస్పీ జి. శ్రీవేద, పాలకొల్లు రూరల్ సీఐ జి. శ్రీనివాస్, ఎస్సై కె. గుర్రయ్య పరిశీలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 24, 2025

ప.గో జిల్లా టాపర్ ఈ బాలికే..!

image

నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతీ బా పూలే గురుకుల పాఠశాల (బాలికలు)విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో ప్రతిభ చూపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రావి అశ్విని 592 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సీహెచ్ కె. శైలజ తెలిపారు. పెరవలి గ్రామానికి చెందిన అశ్విని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ ఉంటారు.

News April 24, 2025

పాలకోడేరు : ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. కేసు

image

పాలకోడేరు మండలం మోగల్లు వశిష్ట మెరైన్స్ ఆక్వా పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకై మంగళవారం ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు పలువురు అస్వస్థతకు గురవ్వగా, మరికొంత మంది ఊపిరాడక బయటకు పరుగులు తీసేటప్పుడు గాయాలపాలయ్యారు. దీనిపై ఓ మహిళా కార్మికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు స్టేషన్ రైటర్ నాగరాజు తెలిపారు.

News April 24, 2025

బాలిక మిస్సింగ్ కేసు చేధించిన భీమవరం పోలీసులు

image

భీమవరం టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలో 14 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో చేధించారు. సీఐ కాళీ చరణ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలిక విశాఖపట్నం ట్రైన్ లో వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ పోలీసులకు సమాచారం అందించగా బాలికను గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.