WestGodavari

News August 17, 2024

ఏలూరులో దారుణం.. భర్తకు మద్యం తాగించి భార్యపై అత్యాచారం

image

ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. కూలి పనుల కోసం భర్తతో కలిసి వచ్చిన మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. రామకోటి ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. భర్తకు మద్యం తాగించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. సహకరించకుంటే భర్తను చంపేస్తామని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని కన్నీరుపెట్టుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 17, 2024

ఏలూరులో వైసీపీ కార్యాలయం కూల్చివేత

image

ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ అంశంపై మాజీ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కార్యాలయ కూల్చివేతలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. రెండేళ్ల లీజు కోసం స్థలం తీసుకుని తాత్కాలిక నిర్మాణం చేపట్టామన్నారు. లీజు గడువు ముగియడంతో భవనాన్ని యజమానికి అప్పగించామని చెప్పారు. ఇక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగతంగా ఇకపై అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

News August 17, 2024

ఏలూరు: సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు పుణ్యక్షేత్ర యాత్ర

image

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 1 నుంచి 10 వరకు పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో పూరీ- కాశీ- అయోధ్య యాత్రను నిర్వహిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్‌ రాజా తెలిపారు. ఈ యాత్రలో పూరీ, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌ రాజ్‌ పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. వచ్చే నెల 1న సికింద్రాబాద్‌లో యాత్ర రైలు బయలుదేరి విజయవాడ, ఏలూరు, స్టేషన్లో ఆగుతుందన్నారు.

News August 17, 2024

ప.గో.: క్షణికావేశంలో భర్తపై భార్య దాడి

image

నిడమర్రు మండలం పెదనిండ్రకొలనుకి చెందిన ఝాన్సీ, భర్త శ్రీను (38) మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. శుక్రవారం వారు నివాసం ఉంటున్న ఎస్సీ కాలనీలో రేకుల షెడ్డు కూల్చివేత విషయంలో వాగ్వాదం జరగ్గా భర్తను నిలువరించే ప్రయత్నంలో గుణపంతో ఇద్దరి మధ్య తోపులాట జరగింది. దీంతో ఆవేశంలో శ్రీను తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఎస్సై వీర ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 17, 2024

ఏలూరు: సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు పుణ్యక్షేత్ర యాత్ర

image

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 1 నుంచి 10 వరకు పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో పూరీ- కాశీ- అయోధ్య యాత్రను నిర్వహిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్‌ రాజా తెలిపారు. ఈ యాత్రలో పూరీ, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌ రాజ్‌ పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. వచ్చే నెల 1న సికింద్రాబాద్‌లో యాత్ర రైలు బయలుదేరి విజయవాడ, ఏలూరు, స్టేషన్లో ఆగుతుందన్నారు.

News August 17, 2024

ప.గో.: 5 కోట్ల కేజీల వర్జీనియా కొనుగోళ్లు పూర్తి

image

ఉభయ గోదావరి జిల్లాల్లో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు శుక్రవారానికి 5 కోట్ల కేజీలు పూర్తయ్యాయి. అధికారికంగా బోర్డు సుమారు 50 మిలియన్‌ కేజీలకే అనుమతి ఇచ్చింది. సెప్టెంబరు రెండో వారం నాటికి వేలం పూర్తి చేసే ఆలోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది పొగాకు ధర కేజీకి గరిష్ఠంగా రూ.400 పలికింది. సరాసరి రూ.332.97 చొప్పున లభించింది. మార్చిలో వేలం ప్రారంభ సమయంలో కేజీ రూ.240గా ఉంది.

News August 17, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో వైద్యసేవలు బంద్

image

కోల్‌కతాలో విధుల్లో ఉన్న జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా వైద్యులు నేటి నుంచి నిరసన చేపట్టనున్నారు. జాతీయ వైద్యసంఘం పిలుపు మేరకు నేటి ఉదయం నుంచి 24 గంటల పాటు ఉమ్మడి జిల్లాలో 1,350 ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులంతా సేవలు నిలిపివేయనున్నారు. అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరవుతారు.

News August 17, 2024

జంగారెడ్డిగూడెం: బాలికపై అత్యాచారం

image

బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. SI జ్యోతిబసు తెలిపిన వివరాలు.. కాళ్ళ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17)ను అదే గ్రామానికి చెందిన రాజేశ్ పెళ్లి చేసుకుంటానని వేధించాడు. ఈ విషయంలో గొడవలవగా బాలికను జంగారెడ్డిగూడెంలోని బంధువుల ఇంటికి పంపారు. ఈ నెల 7న రాజేష్ బాలికకు ఫోన్ చేసి తనవెంట తీసుకెళ్లాడు. అనంతపురం, లంబసింగిలో ఉంచి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News August 17, 2024

మాజీ మంత్రులు అన్న క్యాంటీన్‌లో భోజనం చేయండి: బొలిశెట్టి

image

అన్న క్యాంటీన్లపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు ఓసారి వాటి వద్దకు వెళ్లి భోజనం చేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లపై చౌకబారు విమర్శలు చేయొద్దని ఆయన అన్నారు.

News August 17, 2024

ఇసుక నిల్వల వివరాలు ప్రకటించిన ప.గో కలెక్టర్

image

ఉమ్మడి ప.గో జిల్లాలోని ఇసుక నిల్వల వివరాలను కలెక్టర్ నాగరాణి శుక్రవారం వెల్లడించారు. పెరవలి మండలం ఉసులుమర్రు – 5,603 మెట్రిక్ టన్నులు, పెండ్యాల – 1,06,758 మెట్రిక్ టన్నులు, నిడదవోలు మండలం పందలపర్రు – 38,566 మెట్రిక్ టన్నులు, ఆయా స్టాక్ పాయింట్లు వద్ద నిలువ ఉందని అన్నారు. స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఒక్కింటికి రూ.270/- అని తెలిపారు.