India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భీమవరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తణుకు నియోజకవర్గంలోని శాంతిభద్రతలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని కోరారు.
దెందులూరు మండలం సత్యనారాయణపురం సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొక వ్యక్తిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సీఐ నబీ, ఎస్ఐ స్వామి సంఘటన స్థలానికి చేరుకొని లారీకింద ఇరుక్కుపోయిన కారును బయటకు తీసే చర్యలు చేపట్టారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరులో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు ఇంట్లో ఉన్న దిమిటి నాగేశ్వరమ్మను బయటకు తీసుకువచ్చారు. కొద్దిసేపటికే సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు.
గోదావరి నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్ మధ్య డౌన్ లైన్ ట్రాక్పై గుర్తు తెలియని యువతి(20) మృతదేహాన్ని గుర్తించినట్లు తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు మంగళవారం తెలిపారు. మృతురాలు నీలం రంగు టాప్ ధరించి ఉన్నట్లు వివరించారు. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రాజమండ్రి రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
ఉండిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరంలోని కందికట్లవారి వీధి వాసి నిఖిల్(25) ఇటీవల ముంబయి నుంచి వచ్చాడు. ఫ్రెండ్ పవన్తో ఆదివారం బయటకెళ్లిన నిఖిల్ రైల్వే ట్రాక్ వద్ద పడి ఉన్నట్లు పోలీసులకు ఫోన్ రాగా, వారు వెళ్లి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆర్థిక వివాదాల కారణంగా పవనే హత్య చేశాడని నిఖిల్ తండ్రి ఆరోపిస్తున్నారు.
దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్కు ఫోన్ కాల్స్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఏలూరు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. చింతమనేనికి కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ చింతమనేని కాల్ డేటా సమర్పించగా కేసు నమోదు చేశామన్నారు. మాజీ MLA అబ్బయ్య చౌదరి అనుచరుల పనే అని చింతమనేని ఆరోపిస్తున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. బస్టాండ్ సమీప కుచ్చలమెట్టపై దుండగులు తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో మెట్టపైకి ఎవరూ వెళ్లడం లేదని, గతంలో కొందరు మండప ప్రదేశంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని గుర్తుచేశారు. 2, 3 రోజులుగా రాత్రివేళ తవ్వుతున్నారని, అక్కడ పసుపు, కుంకుమ, గొయ్యి తీసిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు.
ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద ఏలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు సోమవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చింతపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసి రవాణాచేస్తున్న ఏడుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద 20.30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్పీ సూర్యచంద్రరావు తెలిపారు. వారిని అరెస్ట్ చేశామన్నారు.
బైక్ అదుపుతప్పి ఓ యువకుడు మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి తణుకు పట్టణంలో జరిగింది. ఉండ్రాజువరం జంక్షన్ సమీపంలో జరుగుతున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ట్రాఫిక్ మళ్లించేందుకు రోడ్డుకు అడ్డంగా తాడు కట్టారు. అటుగా బైక్పై వెళ్తున్న పాలంగికి చెందిన గంగులకుర్తి పూర్ణచంద్ర సాయికుమార్ (22) తాడును గమనించకపోవడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలవడంతో మృతి చెందాడు. కేసు నమోదైంది.
ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ధాన్యం బకాయి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ను రైతు సంఘం జిల్లా నాయకులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు సమస్యలను మంత్రికి వివరించారు. సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పంట పండించడం కంటే అమ్ముకోవడానికి రైతులు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.