India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమవరం మండలం గూట్లపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. శ్రీరామ్మూర్తి, నాగలక్ష్మికి 2018లో వివాహం జరిగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ సోమవారం నాగలక్ష్మి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులతోనే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని నాగలక్ష్మి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లారీ ఢీకొని విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెం మండలంలోని పెదతాడేపల్లిలో సోమవారం జరిగింది. ముత్యాలంబపురం గ్రామానికి చెందిన పప్పు సంజీవరావు(64) పొలం పనులు ముగించుకుని బైక్పై వస్తుండగా పెదతాడేపల్లి వద్ద వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.
భూ యజమానులకు తెలియకుండా సర్వే చేయరాదని ప.గో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో రీ సర్వే పనులను ఆయన పరిశీలించారు. ఎంతమంది రైతులకు నోటీసులు ఇచ్చారో తెలుసుకున్నారు. నోటీసుల వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ముందుగా అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీనితో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27న ఉ.8 గంటల నుంచి సా.4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ విక్రయాలు అమాంతం పడిపోగా మటన్, రొయ్యలు, చేపల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ప.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కేజీ మటన్ గరిష్ఠంగా రూ.1200 వరకు విక్రయించినట్లు తెలుస్తోంది. చేపలు కేజీ సాధారణంగా రూ.130గా ఉంటే రూ.180కి, రొయ్యలు రూ.250గా ఉంటే రూ.350కి పెంచి అమ్మారు. ధర ఎక్కువయినప్పటికీ బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వీటి కొనుగోళ్లకే మొగ్గు చూపారు. చికెన్ షాపులు వెలవెలబోయాయి.
ఏలూరు జిల్లా నిడమర్రులోని బావాయిపాలెం గ్రామంలో ఏసురాజు (26) దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. మృతుడి చేయి నరికి తీసుకెళ్లారు. భర్తను విగతజీవిగా చూసిన ఏసు భార్య శ్రీవల్లి గుండెలు పగిలేలా రోదించింది. ఆమె 8 నెలల గర్భిణీ కాగా పురుడు కోసం పుట్టింటికి వెళ్లింది. రెండేళ్ల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా ఈ హత్యకు పాతకక్షలా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పీజీఆర్ఎస్ నిర్వహించే తేదీని ప్రకటన ద్వారా తెలియచేస్తామని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 17 సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను (పీజీఆర్ఎస్) జిల్లా వ్యాప్తంగా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. ఆదివారం కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు.
ఏలూరు జిల్లా నిడమర్రులోని బావాయిపాలెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మాది ఏసురాజు (26) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే యువకుడి చేయి నరికేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి నిడమర్రు SI చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
ద్వారకాతిరుమలలోని సీహెచ్ పోతే పల్లి గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు శనివారం రాత్రి మృతిచెందారు. ఆయన ఇటీవల బాత్రూంలో జారి పడటంతో కాలు విరిగింది. అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి మృతి చెందారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.