WestGodavari

News August 8, 2024

ప.గో: రూ.2లకే బిర్యానీ.. ఎగబడిన జనం

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో గురువారం రూ.2లకే బిర్యానీ ఇవ్వడంతో జనాలు భారీగా తరలివచ్చారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఈ ఆఫర్ ప్రకటించారు. 2 రోజులుగా దీనిపై ప్రచారం చేయడంతో బిర్యానీ ప్రియులు ఎగబడ్డారు. 2000 మంది వస్తే 200 బిర్యానీ ప్యాకెట్స్ మాత్రం ఇచ్చారని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జాం అయ్యి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

News August 8, 2024

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయండి: ఎంపీ

image

పార్లమెంట్‌లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం ప్రసంగించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. పామాయిల్ రైతులకు ఏలూరు జిల్లాలో ఇంక్యుబేషన్ సెంటర్ నెలకొల్పాలన్నారు. దీనిపై సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితిన్ రామ్ మాన్ జీ స్పందిస్తూ ఎంపీ కోరిన వాటిని పరిశీలిస్తామని చెప్పినట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

News August 8, 2024

ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం వినతి పత్రం

image

పారామిలిటరీ (CAPFS) మాజీ సైనికుల బృందం నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో తమ సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుని కలవడానికి అపాయింట్మెంట్ కోరుతూ శ్రీ కేఎస్ జవహర్, మాజీ మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ ప్రభాకర్, శ్రీ ఏడుకొండలు, శ్రీ సుబ్బారావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

News August 8, 2024

నరసాపురం: కారు బీభత్సం.. మహిళ మృతి

image

నరసాపురం పట్టణంలో 216 జాతీయ రహదారిపై బుధవారం కారు బీభత్సం సృష్టించింది. SI జయలక్ష్మి తెలిపిన ప్రకారం.. సీతారామపురం నుంచి పట్టణానికి వస్తున్న కారు అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న మహిళపై అక్కడికక్కడే మృతి చెందింది. అదే ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని నరసాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈప్రమాదంలో ఆరు బైక్‌లు ధ్వంసమయ్యాయి. కేసు నమోదైంది.

News August 8, 2024

ఏలూరు: ‘భార్యను అందుకే చంపాను’

image

కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో భార్యను భర్త హత్య చేసిన విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదంలో హత్య జరినట్లు DSP తెలిపారు. సూర్యచంద్రానికి 11ఏళ్ల క్రితం సాయిలక్ష్మితో పెళ్లి జరిగింది. కొన్నేళ్లుగా గొడవలు జరగడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో నిన్న వారి మధ్య వాగ్వాదం జరగగా కోపంతో సూర్యచంద్రం రోడ్డుపై ఆమె మెడపై కత్తితో నరికినట్లు తెలిపాడు.

News August 8, 2024

ప.గో.: ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రస్తుత విద్యా సంవత్సరంలో జరిగే జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్)కు విద్యార్థులు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా డీఈవో జి. నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 8న జరిగే ఈ పరీక్షకు 8వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. సెప్టెంబరు 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News August 8, 2024

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష

image

ఏలూరు కలెక్టరేట్‌లో బుధవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్ వెట్రీ సెల్వి, ఎస్పీ కిషోర్ అధికారులతో సమీక్షించారు. దేశ భక్తిని పెంపొందించే విధంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 15వ తేదీ ఉదయం 9గం నుంచి వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వేడుకల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలన్నారు.

News August 7, 2024

‘మండల ప్రత్యేకాధికారులు గ్రామాన్ని దత్తత తీసుకోవాలి’

image

ఏలూరు కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ వెట్రి సెల్వి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాను అభివృద్ధి బాటలో పయనింపజేసేందుకు మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలోని ప్రతీ కుటుంబం జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేయాలన్నారు. ముందుగా మండలంలో పేదల వివరాలను ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలన్నారు.

News August 7, 2024

కొయ్యలగూడెం: భార్యను నరికి చంపిన భర్త

image

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో బుధవారం దారుణం జరిగింది. కొయ్యలగూడెం ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపిన వివరాల మేరకు.. రామానుజపురంలో సాయి లక్ష్మిని భర్త సూర్యచంద్రం వేటకొడవలితో కిరాతకంగా నరికి హత్య చేశాడు. భార్యపై అనుమానంతోనే దాడి చేసినట్లు భావిస్తున్నారు. సమాచారం తెలియడంతో హుటాహుటిన కొయ్యలగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News August 7, 2024

ఏలూరు: ముఖ్యమంత్రి ఐటీడీఏ పర్యటన రద్దు

image

అనుకూల వాతావరణం లేనందు వల్ల ఈ నెల 9న సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా కేఆర్.పురం ఐటీడీఏ పర్యటన రద్దయినట్లు MLA చిర్రి బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడెం మండలం ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుందని స్పష్టం చేశారు.