India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు ద్వారా సేకరించిన నిధులను సమాజ సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదుపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. రూ.లక్ష కంటే ఎక్కువగా సభ్యత్వ రుసుము సేకరించిన తణుకు తహశీల్దార్, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ అభినందించారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిహార్ వెళ్లారు. ఆ రాష్ట్రంలో జరిగిన అఖిల భారత సభాపతుల మహాసభలో పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇతర రాష్ట్రాల స్పీకర్లతో కలిసి ఆయన సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్ల విధులు గురించి తెలుసుకున్నారు.
ఖోఖో ప్రపంచకప్ పోటీల్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ పోటీల్లోనే భారత మహిళలు, పురుషుల జట్లు విశ్వవిజేతలుగా నిలవడం సంతోషంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు.
ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె వివరాల ప్రకారం.. బుట్టాయిగూడెం మండలం అరుంధతి కాలనీకి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమ వ్యవహారం నడిపించాడు. పెళ్లి చేసుకోమని అడిగితే దుర్భాషలాడి దాడి చేశారని.. తనకు న్యాయం చేయాలని యువతి కోరుతోంది.
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, సభ్యులను తొలగించింది. గత ప్రభుత్వ కాలంలో నియమితులై కొనసాగుతున్న ఏపీ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్, మెంబర్లను తక్షణమే తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చీరాల పద్మశ్రీని సైతం తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జంగారెడ్డిగూడెం(M) లక్కవరం శివారులో మామిడి తోటలో అల్లరి సృష్టిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి సమయంలో పార్టీ చేసుకుంటూ అల్లర్లు చేస్తున్నారంటూ వచ్చిన సమాచారంతో జంగారెడ్డిగూడెం సీఐ కృష్ణబాబు తన సిబ్బందితో దాడులు చేపట్టారు. 23 తెలంగాణ మద్యం సీసాలు, 5 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేయగా నలుగురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
ఉమ్మడి ప.గో జిల్లా నిడదవోలుకు చెందిన MBBS వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఆదివారం ఏలూరు కలెక్టరేట్ పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు.
టి.నరసాపురంలో బాలిక మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మండలానికి చెందిన బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. అయితే బాత్ రూమ్కి అని వెళ్లిన బాలిక స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు చింతలపూడికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి, ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి ప.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు మూడు రోజులూ వైభవంగా జరిగాయి. అదే రీతిలో మద్యం ప్రియులు మద్యం కోసం ఎగబడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి బంధువులు , స్నేహితులు పండుగకు ముందుగానే పల్లె బాట పట్టారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు రూ. 120 కోట్లకు మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.