WestGodavari

News August 5, 2024

ప.గో.: సముద్రంలో యువకుడి డెడ్‌బాడీ లభ్యం

image

పేరుపాలెం బీచ్‌లో స్నానం చేసేందుకు దిగి తణుకు పట్టణానికి చెందిన కొల్లి జాన్‌బాబు (17) సముద్రంలో ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. కాగా నిన్న రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సోమవారం (నేడు) మళ్లీ పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది.

News August 5, 2024

ప.గో.: సముద్రంలో యువకుడు గల్లంతు (UPDATE)

image

ప.గో. జిల్లా పేరుపాలెం బీచ్‌ వద్ద సముద్రంలో తణుకు పట్టణానికి ఇంటర్ విద్యార్థి కొల్లి జాన్‌బాబు (17) ఆదివారం మధ్యాహ్నం గల్లంతైన విషయం తెలిసిందే. కాగా యువకుడి ఆచూకీ కోసం పోలీసులు ఆదివారం రాత్రి వరకు గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే సోమవారం (నేడు) తెల్లవారుజాము నుంచి మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు.

News August 5, 2024

జంగారెడ్డిగూడెం ఎర్రకాలువలో చనిపోయింది ఈమే

image

జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం ఎర్రకాలువ వాగు వద్ద చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. వారు పోలీసులకు సమాచారం అందించగా SI జ్యోతిబసు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు ద్వారకాతిరుమల మండలం ఐఎస్.జగన్నాథపురానికి చెందిన పంపన వెంకాయమ్మ (50)గా గుర్తించారు. 4 రోజులు క్రితం అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారని ఎస్సై చెప్పారు.

News August 5, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో నేడు వర్షాలకు ఛాన్స్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలుచోట్ల సోమవారం అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ప.గో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT..

News August 4, 2024

ఏలూరు: బస్సుల టైర్లు, బ్యాటరీలు దొంగతనం

image

ఏలూరు జిల్లా తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సుల టైర్లు, బ్యాటరీలు చోరీ చేసిన నలుగురిని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వారి వివరాల ప్రకారం.. కామవరపుకోటలోని ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన 2 బస్సుల టైర్లు, బ్యాటరీలు, జాకీలు, ఇతర సామగ్రి పోయినట్లు నందిగామ ధర్మరాజు ఫిర్యాదు చేశాడు. విచారణలో చందు, ఈశ్వర్ కుమార్, సాయి దుర్గారావు, వెంకట్ కాజేశారని తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

News August 4, 2024

ఏలూరు జిల్లాలో 9మంది SIల బదిలీ

image

ఏలూరు జిల్లాలో 9మంది SIలు బదిలీ అయ్యారు. భీమడోలు ఎస్సైగా సుధాకర్, లక్కవరం ఎస్సై సుధీర్ ద్వారకాతిరుమల స్టేషన్‌కు, ద్వారకాతిరుమల ఎస్సై సతీష్ వీఆర్‌కు, తడికలపూడి ఎస్సై జైబాబు టి.నరసాపురానికి, టి.నరసాపురం ఎస్ఐ మహేశ్వరరావు వీఆర్‌కు, చింతలపూడి ఎస్సైగా కుటుంబరావు, జీలుగుమిల్లి ఎస్ఐ చంద్రశేఖర్ కొయ్యలగూడెం స్టేషన్‌కు, కొయ్యలగూడెం ఎస్సై విష్ణువర్ధన్ వీఆర్‌కు, నిడమర్రు ఎస్సై శ్రీను వీఆర్‌కు బదిలీ అయ్యారు.

News August 4, 2024

ప.గో జిల్లాలో ‘ఫ్రెండ్‌షిప్ డే’న విషాదం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో ‘ఫ్రెండ్‌షిప్ డే’న విషాదం చోటుచేసుకుంది. పేరుపాలెం బీచ్‌లో కె.జాన్‌బాబు(17) గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మొగల్తూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జాన్‌బాబు తణుకుకు చెందిన వాడిగా గుర్తించినట్లు తెలిపారు. ఆదివారం.. అందులోనూ ఫ్రెండ్‌షిప్ డే కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా పేరుపాలెం బీచ్ వెళ్లాడు. స్నానం చేస్తూ అలల ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు.

News August 4, 2024

ఏలూరు: నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

image

ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠాసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన ఫణి కుమార్ అనే వ్యక్తికి కొంతమంది ఫోన్ చేసి రూ.10 లక్షలకు రూ.44 లక్షలు ఇస్తానని చెప్పారు. దీంతో ఫణికుమార్ సందేహంతో పోలీసులకి సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి ఒక సెల్‌ఫోన్ , నకిలీ కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు.

News August 4, 2024

జంగారెడ్డిగూడెం: కాలువలో మహిళ డెడ్‌బాడీ లభ్యం

image

జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం ఎర్రకాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆదివారం స్థానిక మత్స్యకారులు మృతదేహాన్ని గుర్తించి జంగారెడ్డిగూడెం పోలీసులకు సమాచారం అందించారు. మృతిరాలికి సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 4, 2024

పోలవరం ప్రాజెక్ట్ వద్ద నీటిమట్టం తగ్గుముఖం

image

పోలవరం ప్రాజెక్ట్ ఎగువన గోదావరి నీటిమట్టం క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శనివారం పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 6,70,355 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. కడెమ్మ స్లూయిజ్ వద్ద గేట్లు వరద నీటి నుంచి బయటపడడంతో ఏటిగట్టుకి కుడివైపున పంటపొలాల్లో ఉన్న వరద జలాలు వేగంగా గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి.