WestGodavari

News September 24, 2024

APIIC ఛైర్మన్‌గా మంతెన రామరాజు నియామకం

image

రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్‌ (APIIC)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే టికెట్ త్యాగానికి దక్కిన ప్రతిఫలంగా నామినేటేడ్ పోస్టు వరించిందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 24, 2024

ప.గో. జిల్లాలో 118.6 మి.మీ. వర్షపాతం

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 118.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కాళ్ల మండలంలో 52.2, ఉండి 22.2, ఇరగవరం 19.0, పెనుమంట్ర 14.2, పెనుగొండ 4.2, నరసాపురం 2.8, యలమంచిలి, పెంటపాడు 1.4, ఆకివీడు 1.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు.

News September 24, 2024

డల్లాస్‌లో కానూరు యువకుడు గుండెపోటుతో మృతి

image

పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీరాఘవ హార్ట్ అటాక్‌తో అమెరికాలోని డల్లాస్‌లో మృతిచెందాడు. మృతుడు ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. మంగళవారం అతని మృతదేహం స్వగ్రామం కానూరు రానున్నట్లు పేర్కొన్నారు.

News September 24, 2024

ఏలూరు: భార్యాభర్తలకు జీవిత ఖైదు

image

పెదపాడు మండలానికి చెందిన భార్యాభర్తలకు సోమవారం జీవితఖైదు శిక్ష పడిందని ఏలూరు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ పీపీ రామాంజనేయులు తెలిపారు. విజయలక్ష్మికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, భర్త మృతితో మేనమామ సతీశ్‌ను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఆ ఇద్దరిపై సతీశ్ అత్యాచారం చేయగా 2023లో కేసు నమోదయిందన్నారు. నిందితుడికి తల్లి విజయలక్ష్మి కూడా సహకరించిందని నేరం రుజువు కావడంతో ఏలూరు పోక్సో కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది.

News September 23, 2024

ఏలూరు: జలపాతంలో గల్లంతైన రెండు మృతదేహాలు లభ్యం

image

మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులు ముగ్గురు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరి మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరి యువతుల మృతదేహాలు దొరికాయి. వీరిని కె.సౌమ్య, అమృతలుగా గుర్తించారు. మరొక విద్యార్థి ఆచూకీ తెలియాల్సి ఉంది.

News September 23, 2024

ఉమ్మడి జిల్లాలో జట్లు ఎంపిక పోటీలు

image

ఉమ్మడి ప.గో.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2024-25 సంవత్సరానికి అండర్-14, 17 బాల బాలికలకు జిల్లా జట్లు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి మల్లేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా 25న గొరగనమూడి హైస్కూల్లో నెట్ బాల్, పెదవేగి గురుకుల పాఠశాలలో సాఫ్ట్ బాల్, బేస్ బాల్, 26న భీమవరం SCHBRMHSలో రైఫిల్ షూటింగ్, అక్టోబర్ 1న పెనుమంట్రలో బాక్సింగ్ పోటీలు జరుగుతాయన్నారు.

News September 22, 2024

ఏలూరుపాడులో ఎలాంటి లాఠీఛార్జ్ జరగలేదు: SP

image

ఏలూరుపాడులో అంబేడ్కర్ ఫ్లేక్సీని ఆసరాగా చేసుకొని పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వీడియో అవాస్తవమని జిల్లా ఎస్పీ అద్నాన్ అస్మి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఎస్పీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వీడియోను ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి వాటిని ప్రజలు నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

News September 22, 2024

ప.గో జిల్లాలో 42 మంది సిబ్బందికి కౌన్సెలింగ్

image

ఉమ్మడి ప.గో జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖలో పని చేస్తున్న సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం జరిగింది. ఏలూరు జిల్లా కార్యాలయంలో ఉమ్మడి ప.గో జిల్లా రిజిస్ట్రార్లు కె శ్రీనివాసరావు, లంకా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. మొత్తం 42 మంది సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించగా.. 24 మంది జూనియర్ అసిస్టెంట్లు, 14 మంది సబార్డినేట్లు, నలుగురు షరీఫ్లను బదిలీ చేసినట్లు తెలియజేశారు.

News September 22, 2024

ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 పోలింగ్ కేంద్రాలు

image

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నవీకరణ, పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను తెలిపేందుకు ఈనెల 24 నుంచి వచ్చేనెల 15 వరకు గడువు ఉందన్నారు.

News September 22, 2024

గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతు

image

గోదావరిలో దూకి వ్యక్తి గల్లంతయిన ఘటన శనివారం కొవ్వూరులో చోటుచేసుకుంది. చాగల్లు గ్రామానికి చెందిన బొల్లిపో రఘు (29) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్తాపానికి గురై కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపైకి వచ్చి అక్కడ బైక్ పార్క్ చేసి అందరూ చూస్తుండగానే గోదావరిలోకి దూకేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.