India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, ఇటీవల రద్దు చేసిన పింఛన్ దారులు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ పాల్గొన్నారు.
సముద్రపు నాచు సాగు ద్వారా ఎస్హెచ్జీలు అదనపు ఆదాయం ఆర్జించడానికి తోడ్పాటునందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం నరసాపురం మండలం పెద్దమైనవానిలంక డిజిటల్ భవన్ నందు జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ సహకారంతో ఎస్హెచ్జి మహిళలకు అందిస్తున్న సముద్రపునాచు సాగు శిక్షణా తరగతులకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
సారధ్యం యాత్రలో భాగంగా వచ్చే నెల 2న భీమవరం వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పర్యటనను బీజేపీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చాయ్ పే చర్చ కార్యక్రమంతోపాటు పట్టణంలో శోభాయాత్ర, బీజేపీ జిల్లా విస్తృత స్థాయి జరిగే కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారన్నారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం నరసాపురం మండలం తూర్పు తాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. పీహెచ్సీలోని మందులు, ల్యాబ్, స్టాప్ రూమును, పలు విభాగాలను తనిఖీ చేశారు. ఓపి రికార్డులతో పాటు సిబ్బంది హాజరు పట్టి పరిశీలించారు. హాస్పటల్కు వచ్చిన రోగులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వైద్యం కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలన్నారు
అనాకోడేరు, ఎల్.జి పాడు గ్రామాల్లో జరుగుతున్న ఫేజ్-3 ప్రభుత్వ భూముల రీ సర్వే ప్రక్రియను జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ రికార్డుల్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా వీఆర్వోలు వెంటనే పూర్తి చేయాలని జేసీ సూచించారు. జిరాయితీ భూముల సర్వేను కూడా వేగవంతం చేయాలన్నారు.
ఉండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలోని మందుల స్టాక్, రికార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అదించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. తహశీల్దార్ నాగార్జున, డాక్టర్ సునంద ఆమెతో ఉన్నారు.
బంగళాఖాతంలో అల్పపీడనం ప్రభావం ప.గో జిల్లాలో అధికంగా చూపిస్తోంది. నిన్న జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఎడతెరిపి లేని వర్షంతో ప్రయాణాలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు జాగ్రత్త ఉండాలన్నారు.
బంగాళాఖాతంలో అల్ప పీడనం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తణుకులో మంగళవారం జరిగిన ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ అండర్–17 బాలుర, బాలికల ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ ఎంపికల్లో 18 మంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పశ్చిమ గోదావరి ఫెన్సింగ్ అసోసియేషన్ సెక్రెటరీ గుణ్ణం కృష్ణమోహన్ తెలిపారు. ఈ పోటీలకు జిల్లా నుంచి 60 మంది పాల్గొన్నారని చెప్పారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 30న శనివారం భీమవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
ఆచంటలోని పెనుమంచిలి, భీమలాపురం, కోడేరు, కొడమంచిలి, వల్లూరు, పెదమల్లం ప్రాంతాల్లో వేకువ జాము నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం వేళ వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో రహదారులపై ఏర్పడ్డ గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా ? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.