WestGodavari

News January 7, 2025

ప.గో జిల్లా ఓటర్ల వివరాలు: కలెక్టర్

image

 ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ -2025 ప్ర‌క్రియ‌ అనంత‌రం ఓట‌ర్ల తుది జాబితాను జిల్లా క‌లెక్ట‌ర్ నాగరాణి సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 6 నాటికి జిల్లాలోని మొత్తం 1,461 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 14,70,852 మంది ఓట‌ర్లు ఉన్నారన్నారు. వీరిలో పురుష ఓట‌ర్లు 7,20,597, మ‌హిళ‌లు 7,50,179, థ‌ర్డ్ జెండ‌ర్ 76 మంది ఉన్నారు.

News January 7, 2025

నల్లజర్ల: మహిళ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ 

image

మహిళలపై దాడులు చేస్తే సహించేది లేదని తూ.గో.జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరించారు. నల్లజర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మర్లపూడి ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు పై కలెక్టర్ స్పందించారు. పోలీస్ అధికారిని పిలిచి మహిళ ఫిర్యాదుపై భర్త, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించారు.

News January 7, 2025

నరసాపురం: ఫసల్ భీమా యోజన గడువు పెంపు

image

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువు ఈనెల 15 వరకు ప్రభుత్వం పెంచినట్లు వ్యవసాయశాఖ ఏడీఈ డాక్టర్ అనిల్ కుమారి తెలిపారు. సబ్ డివిజన్ లోని యలమంచిలి, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని రైతులు ఇంకా ఇన్యూరెన్స్ చెల్లించని పక్షంలో గడువులోపు చెల్లించుకోవాలన్నారు. దీని వల్ల పంటలు నష్టపోయినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బీమా పొందేందుకు వీలుంటుందన్నారు.

News January 6, 2025

ప.గో: సంక్రాంతి ట్రైన్లు.. 8 గంటలకు బుకింగ్

image

➤కాకినాడ టౌన్- చర్లపల్లి(07038): 14వ తేదీ
➤సికింద్రాబాద్-కాకినాడ(07078): 12, 19
➤చర్లపల్లి-కాకినాడ(07031): 8, 10, 14, 16, 18
➤కాకినాడ-చర్లపల్లి(07032): 9, 11, 13, 15
➤చర్లపల్లి- నర్సాపూర్(07035): 11, 18
➤నర్సాపూర్- చర్లపల్లి(07036):12,19
➤చర్లపల్లి- నర్సాపూర్(07033):7, 9, 13, 15, 17
➤ చర్లపల్లి- నర్సాపూర్(07034):8, 10, 14, 16, 18
పై ట్రైన్ల బుకింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. గెట్ రెడీ.

News January 6, 2025

ప.గో: పతనమైన టమాట ధర

image

టమాట ధర నేల చూపులు చూస్తోంది. మదనపల్లె మార్కెట్‌లో కనిష్ఠంగా కిలో రూ.13 పలికింది. గ్రేడ్‌ని బట్టి 10 కేజీల బాక్స్ ధర రూ.130 నుంచి 160 వరకు ఉంది. చిత్తూరుతో పాటు స్థానికంగా పంట అందుబాటులోకి రావడంతో డిమాండ్ తగ్గి ధర పడిపోయిందని ఉమ్మడి ప.గో జిల్లా హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. 25 కిలోల ట్రే రూ.300లు ధర పలికిందని చెప్పారు. ధర తగ్గిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

News January 6, 2025

లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్

image

భీమవరం పట్టణంలోని ఎస్ఆర్‌కే‌ఆర్ కళాశాలలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోమవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆదివారం రాత్రి పరిశీలించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేయాలని డిప్యూటీ స్పీకర్ అధికారులకు సూచించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏపీ ఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.

News January 5, 2025

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: SP

image

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, జూదం, గుండాట ఇతర నిషేధిత ఆటలను నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా పెట్టినట్లు జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కోడి పందాలు ఆడడానికి బరులు ఇచ్చినా, నిర్వహించినా, పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కోడిపందాలు నిర్వహించిన, ఆడిన వారి పై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.

News January 5, 2025

ప.గో: ముంచేసిన Instagram పరిచయం

image

పొన్నూరుకు చెందిన రామకృష్ణ అనే ఆర్మీ ఉద్యోగికి ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన ప.గో.జిల్లా మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8లక్షలు తీసుకొని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె పిల్లల చదువుకోసం విజయవాడలో ఉంటున్నారు. రామకృష్ణకి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆమెతో ఇష్టానుసారంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

News January 5, 2025

నరసాపురం: సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

image

ప.గో. జిల్లా రైల్వే ప్రయాణికులకు నరసాపురం స్టేషన్ మేనేజర్ మధుబాబు శనివారం తీపి కబురు చెప్పారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 7, 9, 11, 13, 15, 17, 18 తేదీల్లో చర్లపల్లి నుంచి నరసాపురానికి అలాగే నరసాపురం నుంచి చర్లపల్లికి జనవరి 8,10,12,14,16,18,19 తేదీల్లో రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. ట్రైన్ నెం.07033- 07934 రైలును పరిశీలించాలన్నారు. ఈ రైళ్లు గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తాయన్నారు.

News January 5, 2025

భీమవరం: ‘మంత్రి నారా లోకేశ్ పర్యటన ఏర్పాట్లను పూర్తిచేయాలి’

image

జనవరి 6న ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటింనున్నారు. లోకేశ్ పర్యటన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ రోజున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అధికారులు కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

error: Content is protected !!