India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు మంత్రులు కింజరాపు అచ్చెనాయుడు, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి శనివారం ఏలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఏలూరు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు తరలివెళ్లారు.
ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మన్యం జిల్లా పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉండి మండలానికి చెందిన ఓ బాలికపై ఇద్దరు యువకులు <<13715911>>అత్యాచారానికి<<>> పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆకివీడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, అతని స్నేహితుడు ఉప్పుటేరు వంతెన సమీపంలో రేకులషెడ్డులోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం శుక్రవారం పోలీసుల దృష్టికి వెళ్లగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
☛ ఏలూరులో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.
కుక్కునూరు మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిని సమీప బంధువు మడకం వెంకటేశ్ (24) గోదావరి వరద చూపిస్తానని ట్రాక్టర్పై తీసుకెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో GCC భవనం వద్ద అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటి వద్ద దింపేశాడు. ఆమె ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా విషయం బయటపడింది. ఈ మేరకు వెంకటేశ్ను అరెస్ట్ చేసి కుక్కునూరు SI రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దుండగులను పోలీసులు శుక్రవారం చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వివరాల ప్రకారం.. సూరంపాలెంలో షేక్ రమాదేవి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని ఫిర్యాదు అందింది. కేసు దర్యాప్తు చేసి చాట్రాయి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, రూ.9,200 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు స్టేట్/ఎన్ఎఫ్టీడబ్ల్యూ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారి ఎన్.అబ్రహం శుక్రవారం తెలిపారు. గతంలో జిల్లా స్థాయి అవార్డు పొంది 15 సంవత్సరాల కాల పరిమితి నిండిన హెడ్మాస్టర్, టీచర్ ఎడ్యుకేటర్స్ అర్హులన్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి 9 వరకు విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 2024 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 151 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. IMEI నెంబర్లతో వాటి జాడ కనుగొని, బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. వాటి మొత్తం ఫోన్ల విలువ రూ.21,14,000 వరకు ఉంటుందన్నారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడిలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు కలపాల యేసు(40)గా స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. పొలం విషయమై ఇద్దరు అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదం ఈ హత్యకు దారితీసిందని సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శనివారం ప.గో జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి నష్టంపై అధికారులతో సమీక్షించనున్నారు. తణుకు నియోజకవర్గంలోని దువ్వ ప్రాంతాల్లో పంట పొలాలు, కాలువలను పరిశీలిస్తారు. తాడేపల్లిగూడెంలో ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రి తిలకించనున్నారు.
ఏలూరు జిల్లా కుక్కునూరులో బాలిక(7)పై <<13712611>>అత్యాచార ఘటనకు<<>> సంబంధించిన వివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారి వివరాల ప్రకారం.. వెంకటేశ్(24) అనే వ్యక్తి పునుగులు కొనిస్తానని ఇద్దరు బాలికలను ట్రాక్టర్పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంకటేశ్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.