India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతి కోడిపందేల బరిలో మృతి చెందిన ఓ కోడికి యజమానులు వేలంపాట నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జాలిపూడికి చెందిన నవీన్ చంద్రబోస్ వేలంపాటలో పాల్గొన్నారు. రూ.1,11,111 వెచ్చించి కోడిని దక్కించుకున్నారు. ఈ వేలం పాటకు అధిక సంఖ్యలో జనం పోటీ పడగా చంద్రబోస్ గెలుపొందారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని బుల్లి రాజు క్యారెక్టర్తో అందరినీ అలరించిన రేవంత్ ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లి గ్రామానికి చెందిన రొయ్యల వ్యాపారి భీమాల శ్రీనివాస రావు కుమారుడు. రేవంత్ ‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేశ్కి కొడుకుగా నటించే ఛాన్స్ కొట్టేశాడు. 11 సంవత్సరాల వయసులో సినిమా ఇండస్ట్రీకి కొత్తైనా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.
సంక్రాంతి ప్రయాణీకులతో రద్దీగా ఉంటుందని శుక్రవారం నరసాపురం- చర్లపల్లికి ఏర్పాటు చేసిన రైలు కాళీగా దర్శనమిచ్చింది.దీంతో ఈనెల 19 నరసాపురం నుంచి చర్లపల్లికి మరో రైలు నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ మధుబాబు చెప్పారు. ఈ రైలు నరసాపురంలో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లికి వెళ్తుందన్నారు. పాలకొల్లు, భీమవరం టౌన్, జంక్షన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా వెళ్తుంది.
ఏలూరు జిల్లాలో ఉద్యాన పంటలు విస్తరణ, ఆక్వారంగం, పాడిపరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రానున్న ఐదేళ్లలో లక్ష్యాల అమలు, ప్రగతిపై నిర్ధేశించిన కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్ పై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు.
ఈనెల 22న ఏలూరులో జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మధు భూషణరావు శుక్రవారం తెలిపారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. తిరుపతిలో ఉన్న పశ్చిమ ఆసియాలో అతి పెద్ద క్యాడ్బరీ చాక్లెట్ తయారీ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తారన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో ప్రతి మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టడమైందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు.
భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారిని ప్రతి సంవత్సరం దర్శించుకుంటానని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి అన్నారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని చీర అందించారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేశ్ స్వాగతం పలికి ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజలను నిర్వహించి, సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మొగల్తూరులో కృష్ణంరాజు, సూర్యనారాయణరాజు పేరిట షుగర్ వ్యాధి ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు.
ప.గో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు సంక్రాంతి పండుగ ముగించుకుని పట్టణాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పండుగ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అప్పుడే పండుగ ముగిసిందా అన్నట్లుగా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పట్టణాలకు వెళ్తున్నారు. ఈసంక్రాంతి సంబరాలను రాబోయే పండగ వరకు నెమరువేసుకుంటూ సంతోషిస్తామని పలువురు ప్రయాణికులు తెలిపారు. పిండి వంటలతో పట్టణాలకు పయనమయ్యేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.
హీటర్ పెట్టి బకెట్ కరిగి కరెంట్ షాక్తో వ్యక్తి సజీవదహనమైన ఘటన ఏలూరులో గురువారం జరిగింది. కాకినాడకు చెందిన గంగాధర్ (30) తాత డెత్ సర్టిఫికెట్ కోసం ఏలూరులోని అక్క ఇంటికి వచ్చాడు. మద్యం తాగి నిద్రిస్తుండగా.. అక్క గడియ పెట్టుకుని బయటకు వెళ్లింది. గంగాధర్ లేచి నీళ్లు పెట్టుకుని మళ్లీ నిద్రపోయాడు. ఎక్కువ సేపు ఉండిపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని 1 టౌన్ CI సత్యనారాయణ పరిశీలించినట్లు తెలిపారు.
మొగల్తూరుకు చెందిన కెల్లా లక్ష్మీ కాంతం అల్లుడికి 153 రకాలతో విందు ఏర్పాటు చేశారు. తన కూతురు నాగలక్ష్మిని పాలకొల్లుకి చెందిన చిప్పాడ విజయ కృష్ణతో 29 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. కొత్త అల్లుడికి ఏమాత్రం తీసిపోకుండా 153 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
Sorry, no posts matched your criteria.