WestGodavari

News January 11, 2025

పెదవేగి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పెదవేగి మండలం సీతాపురం గ్రామ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. ద్విచక్ర వాహనంపై అటుగా వస్తున్న ఓ వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొట్టిందని తెలిపారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి రామసింగవరం గ్రామానికి చెందిన కేబుల్ ఆపరేటర్ శ్యామ్‌గా గుర్తించారు.

News January 11, 2025

ప.గో: రెండు బస్సులు సీజ్.. రూ.14లక్షలు ఫైన్

image

సంక్రాంతి పండుగ సందర్భంగా దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అధిక రేట్లతో టికెట్లను అమ్ముతున్నారని సమాచారం మేరకు రవాణా శాఖ అధికారులు ప.గో.జిల్లాలో శనివారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి బస్సులు నడిపితే కఠినంగా శిక్షిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ తనిఖీల్లో 96 కేసులు నమోదు చేసి, రూ.14లక్షలు ఫైన్ వేసి, 2బస్సులను సీజ్ చేశామన్నారు.

News January 11, 2025

ప.గో: విమాన ధరలతో పోటీ పడుతున్న బస్సు ధరలు

image

సంక్రాంతి కోసం సొంత గ్రామాలకు నగరవాసులు తరలిరావడంతో ప్రెవేట్ బస్ ఛార్జీలు విమాన ధరలతో పోటీ పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శని, ఆదివారాలు వీకెండ్ 13,14,15 తేదీలు వరుసగా సంక్రాంతి సెలవులు కావడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పాలకొల్లు, భీమవరం, నరసాపురం పట్టణాలకు వచ్చేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి టికెట్ ధరలు సాధారణంగా వెయ్యి లోపు ఉంటే ఇప్పుడు రూ.3వేల నుంచి 5 వేలకు పెరిగాయి.

News January 11, 2025

ఆచంటలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఆలయం!

image

ఆచంటలోని పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఆలయం తిరునాళ్ల నిర్వహణకు ముస్తాబవుతోంది. సంక్రాంతి పర్వదినాల్లో ఈ ఆలయంలో తీర్థవ ఘనంగా జరుగుతుంది. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. పూర్వం ఓ నవ జంట ఇక్కడ చనిపోయింది. పాము కాటు వేయడంతో భర్త చనిపోయాడని భార్య స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఊర్లో పంటలు సరిగా పండకపోవడంతో వారికి ఇక్కడ గుడి కట్టినట్లు గ్రామస్థులు చెబుతారు.

News January 11, 2025

చింతలపూడి తహశీల్దార్‌కు ఏలూరు జిల్లాలో సెకండ్ ర్యాంకు

image

విధి నిర్వహణ, పనితీరు ఆధారంగా చింతలపూడి మండల తహశ్దీలార్ డి. ప్రమద్వార ఏలూరు జిల్లాలో ద్వితీయ ర్యాంకు సాధించారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు ప్రమద్వారను అభినందించారు. జిల్లాలో పనితీరు ఆధారంగా ద్వితీయ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని ఈ విజయం సాధించడానికి సహకరించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఉన్నతాధికారులు, చింతలపూడి మండల రెవెన్యూ సిబ్బందికి కృతజ్ఞతలన్నారు.

News January 10, 2025

సూర్య‌ఘ‌ర్ పథకానికి కేంద్రం సబ్సిడీ: కలెక్టర్

image

విద్యుత్ బిల్లుల‌ నుంచి విముక్తి పొంద‌డానికి చ‌క్క‌ని ప‌రిష్క‌ారం ప్ర‌ధాన‌మంత్రి సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం అని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న స‌బ్సిడీతో ఇప్ప‌డు సోలార్‌ రూఫ్‌ టాప్ పథ‌కం సామాన్యుల‌కు సైతం అందుబాటులోకి వ‌చ్చిందన్నారు. ఈ మేరకు భీమవరం ఆమె కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పీఎం సూర్య ఘర్ పోర్టల్ pmsuryaghar.gov.inలో దీని కోసం రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

News January 10, 2025

నల్లజర్ల: ఆర్థిక ఇబ్బందులతో మహిళా వాలంటీరు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో మహిళా వాలంటీరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి ప.గో. నల్లజర్ల(M)లో గురువారం జరిగింది. ప్రకాశరావుపాలెంకు చెందిన గౌతమి(24) ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.50 వేలు ఋణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది సామగ్రి బయపడేసి ఇంటికి తాళం వేస్తామని హెచ్చరించారు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. తల్లిని చూసిన చిన్నారులు కన్నీటిపర్యంతమయ్యారు.

News January 10, 2025

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో 1,975 మంది క్వాలిఫై: ఏలూరు SP

image

ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 9వ తేదీ వరకు నిర్వహించిన పురుష, మహిళ కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షలను సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ, డ్రోన్ కెమెరాల ద్వారా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పేర్కొన్నారు. 4,976 అభ్యర్థులకు హాల్ టికెట్స్ ఇవ్వగా వారిలో 3,453 మంది మంది హాజరయ్యారని వారిలో 1,975 మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు.

News January 9, 2025

ప.గో: బెంబేలెత్తిస్తోన్న బస్ ఛార్జీలు

image

సంక్రాంతికి సొంతూర్లకు వచ్చేందుకు ఉమ్మడి ప.గో జిల్లా ప్రజలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్లు అయిపోయాయి. బస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. HYD నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు పట్టణాలకు ప్రయివేట్ ట్రావెల్స్‌లో సుమారుగా రూ. 2,500 నుంచి 3 వేల వరకు ఉన్నాయని చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో ఛార్జీలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మీ కామెంట్

News January 9, 2025

జూద క్రీడలను అడ్డుకోండి: ఏలూరు కలెక్టర్

image

సంక్రాంతి సంబరాల పేరిట కోడిపందేలు, జంతుహింస జరుగకుండా నియంత్రణా చర్యలు చేపట్టాలని గురువారం అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. హైకోర్టు ఉత్తర్వులు మేరకు జిల్లాలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం, స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిధులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీలను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో అన్ని మండలాల్లో 28 సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు.